ఏపీలో అప్రతిహత విజయం దక్కించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు కేంద్రంలోనూ కీలకం కానున్నారు.
ఎందు కంటే.. కేంద్రంలో తమకు ఈ సారి 400 సీట్లు పక్కా అని చెప్పుకొన్న బీజేపీకి ప్రజలు 250-270 మధ్య పరిమితం చేయనున్నా రు. ప్రస్తుతం వస్తున్న ట్రెండ్లు కూడా.. అలానే ఉన్నాయి.
మరోవైపు.. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అసలు ప్రభావం చూపించదని బీజేపీ నేతలు అనుకున్నా.. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర, మణిపూర్ విధ్వంసం. మైనారిటీ ముస్లింల రిజర్వేషన్ ఎత్తేయడం వంటి కీలక అంశాలు పనిచేశాయి. దీంతో ఉత్తరాది ఓటర్లు కాంగ్రెస్ వైపు మళ్లారు.
దీంతో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి కూడా.. బలంగా సీట్లురాబట్టింది. ఇప్పటి వరకు ట్రెండ్స్ ప్రకారం 235 స్థానాల వరకు ఇండియా కూటమి వచ్చేసింది. మొత్తానికి ఇరు పక్షాలకు కూడా మెజారిటీ లేదా.. మేజిక్ ఫిగర్ 272 చేరుకునే స్థాయిలో సీట్లు దక్కేలా కనిపించడం లేదు.
దీంతో ఇరు పక్షాలకు కూడా.. ఇతర పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే.. ఎన్డీయేలో ఇప్పటికే భాగస్వామిగా ఉన్న టీడీపీకి ఈ అవకాశం కలిసి వస్తోంది. దీంతో చంద్రబాబు కేంద్రంలో కీ రోల్ పోషించే అవకాశం ఏర్పడింది. గతంలో చక్రం తిప్పినట్టుగానే ఇప్పుడు కూడా చంద్రబాబుకు చక్రం తిప్పే అవకాశం ఏర్పడింది.
ఇక, ఈ విషయం గ్రహించిన బీజేపీ పెద్దలు చంద్రబాబుకు వర్తమానాలు పంపుతున్నారు. ఎన్డీయే కన్వీనర్ పదవిని చేపట్టాలని చంద్రబాబుకు ఆఫర్ వచ్చినట్టు టీడీపీ వర్గాలు తెలిపాయి. అయితే.. మరో 48 గంటల తర్వాతే తాను నిర్ణయం తీసుకుంటానని.. అప్పటి వరకు వేచి చూడాలని చంద్రబాబు సూచించారు. ఇదిలావుంటే.. ఇండియా కూటమి కూడా చంద్రబాబు వైపు చూస్తున్న ట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
ఆయన తమకు మద్దతు ఇవ్వాలన్నది ఆ పార్టీ నేతల మాటగా వినిపిస్తోంది. చంద్రబాబుతో టచ్లో ఉండే కీలక నేతల ద్వారా కాంగ్రెస్ రాయబారాలు నడుపుతున్నట్టు సమాచారం. ఈనేపథ్యంలో చంద్రబాబు ఎటు మొగ్గు చూపుతారనేది ఆసక్తిగా మారింది.
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారో తెలిసిందే. ప్రతిసారీ అవార్డులు ప్రకటించినపుడు గ్రహీతల అర్ఙతల…
సౌత్ ఇండియాలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఒకడు. తెలుగు వరకు చూస్తే కొన్నేళ్ల నుంచి అతనే నంబర్ వన్.…
స్టార్ హీరోలు లేని బాక్సాఫీస్ క్లాష్ మాములుగా అయితే అంత ఆసక్తికరంగా ఉండదు. కానీ జూలై మొదటి మూడో తేదీ…
దురంధర్ ది రివెంజ్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ బాక్సాఫీస్ కు…
అరవింద సమేత వీరరాఘవ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.…