ఏపీలో అప్రతిహత విజయం దక్కించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు కేంద్రంలోనూ కీలకం కానున్నారు.
ఎందు కంటే.. కేంద్రంలో తమకు ఈ సారి 400 సీట్లు పక్కా అని చెప్పుకొన్న బీజేపీకి ప్రజలు 250-270 మధ్య పరిమితం చేయనున్నా రు. ప్రస్తుతం వస్తున్న ట్రెండ్లు కూడా.. అలానే ఉన్నాయి.
మరోవైపు.. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అసలు ప్రభావం చూపించదని బీజేపీ నేతలు అనుకున్నా.. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర, మణిపూర్ విధ్వంసం. మైనారిటీ ముస్లింల రిజర్వేషన్ ఎత్తేయడం వంటి కీలక అంశాలు పనిచేశాయి. దీంతో ఉత్తరాది ఓటర్లు కాంగ్రెస్ వైపు మళ్లారు.
దీంతో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి కూడా.. బలంగా సీట్లురాబట్టింది. ఇప్పటి వరకు ట్రెండ్స్ ప్రకారం 235 స్థానాల వరకు ఇండియా కూటమి వచ్చేసింది. మొత్తానికి ఇరు పక్షాలకు కూడా మెజారిటీ లేదా.. మేజిక్ ఫిగర్ 272 చేరుకునే స్థాయిలో సీట్లు దక్కేలా కనిపించడం లేదు.
దీంతో ఇరు పక్షాలకు కూడా.. ఇతర పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే.. ఎన్డీయేలో ఇప్పటికే భాగస్వామిగా ఉన్న టీడీపీకి ఈ అవకాశం కలిసి వస్తోంది. దీంతో చంద్రబాబు కేంద్రంలో కీ రోల్ పోషించే అవకాశం ఏర్పడింది. గతంలో చక్రం తిప్పినట్టుగానే ఇప్పుడు కూడా చంద్రబాబుకు చక్రం తిప్పే అవకాశం ఏర్పడింది.
ఇక, ఈ విషయం గ్రహించిన బీజేపీ పెద్దలు చంద్రబాబుకు వర్తమానాలు పంపుతున్నారు. ఎన్డీయే కన్వీనర్ పదవిని చేపట్టాలని చంద్రబాబుకు ఆఫర్ వచ్చినట్టు టీడీపీ వర్గాలు తెలిపాయి. అయితే.. మరో 48 గంటల తర్వాతే తాను నిర్ణయం తీసుకుంటానని.. అప్పటి వరకు వేచి చూడాలని చంద్రబాబు సూచించారు. ఇదిలావుంటే.. ఇండియా కూటమి కూడా చంద్రబాబు వైపు చూస్తున్న ట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
ఆయన తమకు మద్దతు ఇవ్వాలన్నది ఆ పార్టీ నేతల మాటగా వినిపిస్తోంది. చంద్రబాబుతో టచ్లో ఉండే కీలక నేతల ద్వారా కాంగ్రెస్ రాయబారాలు నడుపుతున్నట్టు సమాచారం. ఈనేపథ్యంలో చంద్రబాబు ఎటు మొగ్గు చూపుతారనేది ఆసక్తిగా మారింది.
This post was last modified on June 4, 2024 9:53 pm
ఈ శుక్రవారం మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తోంది ‘గాయపడ్డ సింహం’. డైరెక్టర్ టర్న్డ్ యాక్టర్ తరుణ్ భాస్కర్…
బిగ్ బాస్ ఫేమ్ ఆషు రెడ్డి పేరు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో మార్మోగుతున్న సంగతి తెలిసిందే. లండన్కు…
జాతిరత్నాలు సినిమాతో కథానాయికగా చాలా మంచి పేరు సంపాదించింది హైదరాబాద్ అమ్మాయి ఫరియా అబ్దుల్లా. లోకల్ హీరోయిన్లకు పెద్దగా ప్రాధాన్యం…
మే 8 రవిబాబు కొత్త సినిమా రేజర్ విడుదల కానుంది. హీరో దర్శకుడు రెండూ ఆయనే. దీంతో సహజంగా ప్రమోషన్ల…
ఆర్ఎక్స్ 100 మూవీతో టాలీవుడ్లోకి మెరుపులా దూసుకొచ్చింది ఉత్తరాది అమ్మాయి పాయల్ రాజ్పుత్. ఆ సినిమానే కాదు.. అందులో పాయల్…
ఇంకో మూడు రోజుల్లో రెండు కొత్త తెలుగు స్ట్రెయిట్ సినిమాలు రిలీజవుతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర సందడి లేక టికెట్ కౌంటర్లు…