ఏపీలో అప్రతిహత విజయం దక్కించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు కేంద్రంలోనూ కీలకం కానున్నారు.
ఎందు కంటే.. కేంద్రంలో తమకు ఈ సారి 400 సీట్లు పక్కా అని చెప్పుకొన్న బీజేపీకి ప్రజలు 250-270 మధ్య పరిమితం చేయనున్నా రు. ప్రస్తుతం వస్తున్న ట్రెండ్లు కూడా.. అలానే ఉన్నాయి.
మరోవైపు.. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అసలు ప్రభావం చూపించదని బీజేపీ నేతలు అనుకున్నా.. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర, మణిపూర్ విధ్వంసం. మైనారిటీ ముస్లింల రిజర్వేషన్ ఎత్తేయడం వంటి కీలక అంశాలు పనిచేశాయి. దీంతో ఉత్తరాది ఓటర్లు కాంగ్రెస్ వైపు మళ్లారు.
దీంతో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి కూడా.. బలంగా సీట్లురాబట్టింది. ఇప్పటి వరకు ట్రెండ్స్ ప్రకారం 235 స్థానాల వరకు ఇండియా కూటమి వచ్చేసింది. మొత్తానికి ఇరు పక్షాలకు కూడా మెజారిటీ లేదా.. మేజిక్ ఫిగర్ 272 చేరుకునే స్థాయిలో సీట్లు దక్కేలా కనిపించడం లేదు.
దీంతో ఇరు పక్షాలకు కూడా.. ఇతర పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే.. ఎన్డీయేలో ఇప్పటికే భాగస్వామిగా ఉన్న టీడీపీకి ఈ అవకాశం కలిసి వస్తోంది. దీంతో చంద్రబాబు కేంద్రంలో కీ రోల్ పోషించే అవకాశం ఏర్పడింది. గతంలో చక్రం తిప్పినట్టుగానే ఇప్పుడు కూడా చంద్రబాబుకు చక్రం తిప్పే అవకాశం ఏర్పడింది.
ఇక, ఈ విషయం గ్రహించిన బీజేపీ పెద్దలు చంద్రబాబుకు వర్తమానాలు పంపుతున్నారు. ఎన్డీయే కన్వీనర్ పదవిని చేపట్టాలని చంద్రబాబుకు ఆఫర్ వచ్చినట్టు టీడీపీ వర్గాలు తెలిపాయి. అయితే.. మరో 48 గంటల తర్వాతే తాను నిర్ణయం తీసుకుంటానని.. అప్పటి వరకు వేచి చూడాలని చంద్రబాబు సూచించారు. ఇదిలావుంటే.. ఇండియా కూటమి కూడా చంద్రబాబు వైపు చూస్తున్న ట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
ఆయన తమకు మద్దతు ఇవ్వాలన్నది ఆ పార్టీ నేతల మాటగా వినిపిస్తోంది. చంద్రబాబుతో టచ్లో ఉండే కీలక నేతల ద్వారా కాంగ్రెస్ రాయబారాలు నడుపుతున్నట్టు సమాచారం. ఈనేపథ్యంలో చంద్రబాబు ఎటు మొగ్గు చూపుతారనేది ఆసక్తిగా మారింది.
This post was last modified on June 4, 2024 9:53 pm
రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తయింది. అయితే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ అధికారం ఎవరికి దక్కుతుంది? అనే…
ఏపీ విపక్షం(ప్రధాన కాదు) వైసీపీలో అంతర్గత పోరు ఎక్కువగా సాగుతోంది. దీనికి తోడు.. వైసీపీ అధినేత జగన్కు అత్యంత సన్నిహితంగా…
ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా వేలు.. లక్షల్లోనే ఉద్యోగాలకు ప్రతిష్టాత్మక సంస్థలు మంగళం పాడుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత ఫోక్స్…
ఇండియాలో ఓటీటీల హవా మొదలయ్యాక పాన్ ఇండియా స్థాయిలో అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకున్న వెబ్ సిరీస్ల్లో ‘మీర్జాపూర్’ ఒకటి. ఇండియాలో…
తెలుగు వారికి అత్యంత ప్రీతిపాత్రమైన టీవీ ఛానెళ్లలో ఈటీవీ ఒకటి. 90వ దశకంలో ప్రైవేటు టీవీ ఛానెళ్ల జోరు పెరుగుతున్న…
టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జంధ్యాల దర్శకత్వంలో సీనియర్ నటుడు నరేష్, దివంగత నటుడు కోటా శ్రీనివాసరావులు నటించిన ‘హై హై…