తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవికి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామాను ఆమోదించమంటూ టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి భూమన లేఖ రాశారు. గత ఆగస్టులో భూమన టీటీడీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు.
ఈ ఎన్నికల్లో తిరుపతి నుండి పోటీ చేసిన భూమన కుమారుడు అభినయ్ రెడ్డి ఓటమి పాలయ్యాడు. ఆయన తిరుపతి నుంచి పోటీ చేశారు కానీ జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు చేతిలో ఓడిపోయారు. కుమారుడి విజయం కోసం భూమన కష్టపడ్డా ఫలితం లేకపోయింది. టీడీపీ కూటమి సునామీకి దాదాపు మంత్రులందరూ ఓటమి పాలయ్యారు. దీంతో అధికార వైసీపీ సింగిల్ డిజిట్కే పరిమితం కావలసి వచ్చింది.
దివంగత నేత వైఎస్ హయాంలో 2004-2006 వరకు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ (తుడా) చైర్మన్గా పని చేసిన భూమన 2006 నుంచి 2008 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా వ్యవహరించాడు. 2019లో తిరుపతి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఈసారి తన కుమారుడిని బరిలో దింపాడు.
This post was last modified on June 4, 2024 9:41 pm
సెలబ్రిటీలు ఏదైనా విషయం గురించి స్పందిస్తే చాలు దాన్ని చిలవలు పలవలు చేయడానికో టీమ్ సోషల్ మీడియాలో రెడీగా ఉంటుంది.…
సినిమా విడుదల ఎప్పుడో తేలకుండానే పైరసీ బారిన పడిన జన నాయకుడు గొడవ రకరకాల మలుపులు తిరుగుతోంది. ముందు లాయర్ తరపున…
సౌత్ మ్యూజిక్ లో సెన్సేషన్ అంటే అనిరుధ్ రవిచందర్ పేరే ముందు గుర్తొస్తుంది. తను పని చేస్తున్నాడని తెలిస్తే చాలు…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…