Political News

  ఒడిశాలో బీజేపీ స‌ర్కార్.. న‌వీన్‌బాబు ఓట‌మి!

ఒడిశాలో సంచ‌ల‌నం చోటు చేసుకుంది. ఇక్క‌డ పాతిక సంవ‌త్స‌రాలుగా రాజ్య‌మేలుతున్న ముఖ్య‌మంత్రి న‌వీన్ బాబు ఇంటి ముఖం ప‌ట్టారు. ఆయ‌న పాల‌న‌కు ప్ర‌జ‌లు వ్య‌తిరేక ఓటు వేశారు. ప‌లితంగా అస‌లు క‌ల‌లో కూడా ఊహించ‌ని విధంగా ఒడిశాలో బీజేపీ అధికారంలోకి వ‌చ్చింది. 80 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకున్న ఆ పార్టీ మ‌రో 5 నుంచి 6 స్థానాలు ద‌క్కించుకునే అవ‌కా శం ఉంది. ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు అధికారంలో ఉన్న బిజు జ‌న‌తాద‌ళ్ పార్టీ(బీజేడీ).. ఇప్పుడు ఓట‌మిని అంగీక‌రించాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. గ‌త ఐదేళ్ల కింద‌టే.. బీజేపీ ఇక్క‌డ గెలుపున‌కు సంక‌ల్పం చెప్పుకొంది.

గ‌త 2019 ఎన్నిక‌ల్లోనే బ‌ల‌మైన పోటీ ఇచ్చింది. దీనిని పాతికేళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న న‌వీన్ ప‌ట్నాయ‌క్ గ్ర‌హించినా.. రాష్ట్ర అవ‌స‌రాలు.. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల నేప‌థ్యంలో బీజేపీని నిలువ‌రించ‌లేక పోయారు. అంతేకాదు.. ప‌నిగ‌ట్టుకుని ప‌లు సంద‌ర్భా ల్లో ఆయ‌న బీజేపీని, ప్ర‌ధానిని కూడా కొనియాడారు. ఈ ప‌రిణామం.. అప్ప‌ట్లో బీజేపీవైపు చూస్తున్న ప్ర‌జ‌ల‌ను ప్ర‌భావితం చేసిం ది. దీంతో బీజేపీ మ‌రింత చెల‌రేగిపోయింది. సీఎం న‌వీన్ బాబు అభివృధ్ధి చేయ‌డం లేద‌ని.. తీవ్ర ప్ర‌చారం చేప‌ట్టింది. అంతేకా దు..ఎన్నిక‌ల వేళ‌కు సీఎం న‌వీన్ అనారోగ్యాన్ని ప్ర‌ధాని మోడీ వంటి అగ్ర‌నేత‌లు ప్ర‌చారం చేశారు. న‌వీన్ అనారోగ్యంతో ఇబ్బంది ప‌డుతున్నార‌ని.. పాల‌న చేయ‌లే క‌పోతున్నార‌ని ప్ర‌చారంలో చెప్పుకొచ్చారు.

దీనికితోడు త‌మిళ‌నాడుకు చెందిన ఐఏఎస్ అధికారి పాండియ‌న్‌తో రిజైన్ చేయించి మ‌రీ త‌న పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించేప్ర‌య‌త్నం చేశారు. దీంతో న‌వీన్ స్థానంలో పాండియ‌న్ చక్రం తిప్ప‌డాన్ని అక్క‌డి బీజేడీ నాయ‌కులు స‌హించ‌లేక పోయారు. దీంతో పార్టీలోనూ అంత‌ర్గ‌తంగా కొంద‌రు బీజేపీకి స‌హ‌క‌రించారు. ఇక‌, బీజేపీ విస్తృతంగా ప్ర‌క‌టించిన సంక్షేమ కార్య‌క్ర‌మాలు.. పూరి జ‌గ‌న్నాధుడి ఆల‌యం కేంద్రంగా సాగించిన ప్ర‌చారం వంటివి కూడా న‌వీన్‌కు సెగ పెట్టాయి.

ఫ‌లితంగా 141 స్థానాలున్న ఒడిశా అసెంబ్లీలో బీజేపీ 80 మార్కును దాటేసి అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించింది. ఇక‌, బీజేడీ.. పాతికేళ్ల ప్ర‌స్తానాన్ని ముగించి.. 50 సీట్ల‌కే ప‌రిమితం అయింది. కాంగ్రెస్ మిగిలిన స్థానాల్లో ప‌రుగులు పెడుతోంది. మొత్తానికి ఒక‌చ‌రిత్ర సృష్టించిన బిజు కుటుంబ వార‌సుడు.. బ్యాచ‌లర్ న‌వీన్‌బాబు మ‌రో ఐదేళ్ల వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే. 

Satya

Recent Posts

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

55 minutes ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

1 hour ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

2 hours ago

చిరు దిగాడు… పంచాయితీ ముగిసింది

తెలుగు టాప్ కొరియోగ్రాఫ‌ర్ల‌యిన జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ ప‌ర‌స్ప‌రం అరుచుకుంటూ ఒక‌రి మీదికి ఒక‌రు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…

2 hours ago

పాజిటివ్ టాక్ ఉన్నా పనవ్వడం లేదా

బాక్సాఫీస్ వద్ద లెనిన్ తప్ప జనాలకు వేరే ఆప్షన్ కనిపించడం లేదు. ఇతర కొత్త సినిమాలు విడుదలైనా వాటి గురించి…

2 hours ago

బీఆర్ఎస్ `బ్లెడ్` పాలిటిక్స్‌.. ఇంత అవ‌స‌ర‌మా?

తెలంగాణ‌లో రైతుల‌ను ఆదుకునేందుకు ప్ర‌భుత్వం ముందుకు రావ‌డం లేద‌ని, ప్రాజెక్టుల‌కు నీటిని విడుద‌ల చేయ‌డం లేద‌ని ఆరోపిస్తూ.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం…

2 hours ago