చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా తమ్ముడు పవన్ కళ్యాణ్ పట్ల ఉన్న ప్రేమ ఎన్నోసార్లు బయట పడినా జనసేనకు బహిరంగంగా మద్దతు తెలుపడం లేదనే అసంతృప్తి కొందరు అభిమానుల్లో ఉండేది. ఇటీవలే ప్రచార సమయంలో పార్టీకి అయిదు కోట్ల విరాళం ఇవ్వడంతో పాటు పవన్ గెలుపుని ఆకాంక్షిస్తూ ప్రత్యేకంగా ఒక వీడియో సందేశాన్ని విడుదల చేయడం ద్వారా మెగాస్టార్ వాటికి పూర్తిగా చెక్ పెట్టారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ సంశయాన్ని పూర్తిగా తొలగించి గాజు గ్లాసుకి ఓటు వేయమని పిలుపు ఇచ్చి తన మనసులో మాటని చెప్పుకున్నారు. ఇప్పుడాయన కోరుకున్నదే జరిగింది.
పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి జెండా పాతడమే కాదు జనసేనను అసెంబ్లీలో రెండో ప్రధాన పక్షంగా మార్చే స్థాయిలో తన అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా నిన్నటి దాకా అధికారంలో ఉన్న వైసిపిని మూడో స్థానానికి నెట్టేయడం పెను సంచలనం రేపుతోంది. ఒకప్పుడు టికెట్ రేట్ల పెంపు, పరిశ్రమకు ప్రోత్సాహకాల విషయంలో జగన్ ముందు చిరంజీవి నమస్కారం పెట్టి మరీ బ్రతిమాలిన వీడియో అప్పట్లో మెగా ఫ్యాన్స్ ని కదిలించింది. దీనికి బదులు మృదువుగా ఉండే అన్నయ్య చెప్పకపోయినా మొండోడు అయిన తమ్ముడు ఖచ్చితంగా చెబుతాడనే నమ్మకం అభిమానుల్లో పెరుగుతూ వచ్చింది.
ఈ గెలుపు తాలూకు భావోద్వేగం చిరంజీవి ట్వీట్ లో స్పష్టంగా కనిపిస్తున్న వైనం గురించి నెటిజెన్లు చర్చించుకుంటున్నారు. గేమ్ ఛేంజర్, మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అంటూ అందరూ పొగుడుతూ ఉంటే గర్వంగా ఉందని చెబుతూ ఈ కొత్త అధ్యాయంలో శుభం కలగాలని పవన్ ని మనసారా ఆశీర్వదిస్తూ సుదీర్ఘమైన మెసేజ్ పెట్టడం వైరలవుతోంది. ప్రజా రాజ్యం పెట్టి పద్దెనిమిది సీట్ల గెలిచినా ఏ ప్రభావం చూపించలేకపోయిన నాయకుడిగా తాను కోరుకున్న విజయాన్ని పవన్ కళ్యాణ్ రూపంలో చూస్తున్న చిరు మనసులో ఎమోషన్ ని పదాల రూపంలో పసిగట్టడం కష్టమే. మాటల కందని భావోద్వేగమది.
This post was last modified on June 4, 2024 5:29 pm
ఏపీ శాసన మండలి సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్ దాదాపుగా ఏడాదికి పైగానే వార్తల్లో వ్యక్తిగా నిలుస్తూ వస్తున్నారు. దువ్వాడకు సంబంధించి…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన మద్యం కుంభకోణానికి సంబంధించిన గుట్టు దాదాపుగా వీడిపోయినట్టేనని చెప్పాలి. ఈ వ్యవహారంలో కీలక భూమిక…
మే 1 విడుదలవుతున్న రెండు సినిమాలు హిట్ 3 ది థర్డ్ కేస్, రెట్రో దేనికవే ప్రత్యేక అంచనాలతో ప్రేక్షకుల…
ముంబై నటి కాదంబరీ జెత్వానీపై వేధింపుల కేసులో అరెస్టైన సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పి.సీతారామాంజనేయులు…
విశ్వంభర సంగతేమో కానీ చిరంజీవి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ఎగ్జైటింగ్ ప్రాజెక్టుల్లో ముందు వరసలో ఉన్న సినిమా దర్శకుడు శ్రీకాంత్…
పీక్ సమ్మర్లో థియేటర్లు జనాల్లేక వెలవెలబోతుండడం పట్ల టాలీవుడ్ తీవ్రంగా ఆందోళన చెందుతోంది. వేరే ఇండస్ట్రీల పరిస్థితి కూడా ఏమంత…