Political News

విప్ల‌వ‌మా.. తిరుగుబాటా.. ఏపీలో ఏం జ‌రిగింది?

సునామీని మించిన ఓట్ల వ‌ర‌ద‌.. గంగా ప్ర‌వాహాన్ని మించిన ఫ‌లితాల వెల్లువ‌.. చూస్తే.. ఏపీలో ఏం జ‌రిగింది? విప్ల‌వ‌మా? లేక ప్ర‌జ‌ల తిరుగుబాటా? అనేది ఆస‌క్తిగా మారింది.

1970ల‌లో కేంద్రంలో అధికారంలో ఉన్న ఇందిరాగాంధీ దేశ‌వ్యాప్తంగా ఎమ‌ర్జెన్సీ విధించారు. పార్టీల‌తో సంబంధం లేకుండా.. ప్ర‌శ్నించిన వారిని జైళ్ల‌కు త‌రిమికొట్టారు. దీంతో జైళ్ల‌న్నీ కిక్కిరిసిపోయాయి.

దీనిని క‌శ్మీర్ నుంచి క‌న్యాకుమారి వ‌రకు ప్ర‌జ‌లు తిర‌స్క‌రించారు. ఆమె తీసుకున్న నిర్ణ‌యాల‌ను తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేకించారు. ఫ‌లితంగా..త‌ర్వాత వ‌చ్చిన ఎన్నిక‌ల్లో ఇందిరా గాంధీని ఆమె పార్టీని కూడా.. చిత్తుచిత్తుగా ఓడించారు.

దీనిని అప్ప‌ట్లో ప్ర‌ముఖ ప‌త్రిక‌లు.. ప్ర‌జ‌ల్లో వ‌చ్చిన తిరుగుబాటుగా పేర్కొన్నాయి. ఇవే విష‌యాన్ని బ్యాన‌ర్ హెడ్డింగుల‌తో ఫ‌స్ట్ పేజీల్లో ముద్రించాయి. క‌ట్ చేస్తే.. 1990ల‌లో త‌మిళ‌నాడులో జ‌రిగిన ఎన్నిక‌ల్లో జ‌య‌ల‌లిత పార్టీ ఘోరంగా ఓడిపోయింది. కేవ‌లం ఇద్ద‌రు మాత్ర‌మే గెలిచారు.

దీనికి కార‌ణం.. అప్ప‌ట్లో క‌రుణానిధి పార్టీ డీఎంకే భారీ ఎత్తున ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించింది. ఇంటింటికీ 25 కిలోల బియ్యంతోపాటు.. పిల్ల‌ల‌కు ఉచితంగా కార్పొరేట్ విద్య‌, ప్ర‌తి ఇంటికీనెల‌కు 500 అంటూ పెద్ద ఎత్తున హామీలు గుప్పించారు. దీంతో జ‌య‌ల‌లిత ఘోర ప‌రాజ‌యం చ‌విచూశారు.

ఈ ఫ‌లితం త‌ర్వాత‌.. ఆ నాటి ప‌త్రిక‌లు.. ప్ర‌జ‌ల్లో వ‌చ్చిన విప్ల‌వం అంటూ క‌థ‌నాలు రాశాయి. మ‌రి ఇప్పుడు ఏపీలో ఏం జ‌రిగింది? తిరుగుబాటు వ‌చ్చిందా? లేక విప్ల‌వం వ‌చ్చిందా? లేక‌.. ఈ రెండూ క‌లిసి వ‌చ్చాయా? అనేది ఆస‌క్తిక‌ర విష‌యం. ఎందుకంటే.. ప్ర‌తిప‌క్షం ఉండ‌కూడ‌ద‌న్న దుగ్ధ‌తో చంద్ర‌బాబును అరెస్టు చేయించి జైల్లో పెట్టించారు. 74 ఏళ్ల వ‌య‌సులో చంద్ర‌బాబును అరెస్టుచేయ‌డాన్ని ఎవ‌రూ జీర్ణించుకోలేక పోయారు.

ఇక‌, ఇత‌ర నేత‌ల‌ను అణిచేయ‌డం.. ఎస్సీల‌పై దాడులు.. డ్రైవ‌ర్‌ను చంపి.. డోర్ డెలివ‌రీ చేసిన ఎమ్మెల్సీని వేటు వేయ‌క‌పోవ‌డం, డాక్ట‌ర్ సుధాక‌ర్‌ను దారుణంగా బంధించ‌డం.. ఇలా.. అనేకానేక ఘ‌ట‌న‌లతో ప్ర‌జ‌లు ఇక్క‌డ కూడా తిరుగుబాటు చేశార‌ని కొంద‌రు చెబుతున్నారు.

ఇదేస‌మ‌యంలో కూట‌మి పార్టీలు ఇచ్చిన సూప‌ర్ సిక్స్ వంటి ప‌థ‌కాలు.. ప్ర‌జ‌ల‌ను ముఖ్యంగా మ‌హిళ‌ల‌ను మంత్ర ముగ్ధుల‌ను చేశాయ‌నే వాద‌న ఉంది. దీంతో విప్ల‌వం వ‌చ్చింద‌ని మ‌రికొంద‌రు చెబుతున్నారు. ఈ రెండు ప‌రిణామాల కార‌ణంగానే.. ఇప్పుడు ఈవీఎంలు బ‌ద్ద‌లై.. టీడీపీ కూట‌మి.. అంబ‌ర‌మంత విజ‌యాన్ని కైవ‌సం చేసుకుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on June 4, 2024 5:35 pm

Share

Recent Posts

జోగి ఫ్యామిలీలో `కోడ‌లి` కుదుపు!

వైసీపీ నేత‌, ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, మాజీ మంత్రి జోగి ర‌మేష్ ఫ్యామిలీలో కోడ‌లు చేసిన ఆరోప‌ణలు పెను కుదుపున‌కు…

35 minutes ago

కొత్త సినిమాల్లో పొలిటికల్ పంచులు చూశారా?

సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…

1 hour ago

థియేటర్ చెక్స్… నాయకుడి పద్దతి బాగుంది

జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…

1 hour ago

రఘురామ వెరీ హ్యాపీ: ఆకివీడు రామాల‌యానికి సుప్రీం ఓకే!

ఏపీలో గ‌త 2 మాసాల కింద‌టి వ‌ర‌కు తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ‌నీయాంశం అయిన ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా, ఉండి నియోజ‌క‌వ‌ర్గం…

1 hour ago

కొట్టే హ‌క్కు పోలీసుల‌కు ఉందా?: సుప్రీంకోర్టు ఘాటు ప్ర‌శ్న‌

ప్ర‌జ‌లు, శాంతియుతంగా నిర‌స‌న చేస్తున్న‌వారిని కొట్టే హ‌క్కు పోలీసుల‌కు ఉందా? అని సుప్రీంకోర్టు ప్ర‌శ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…

2 hours ago

సొంత పార్టీ లేన‌ట్టే… సాయిరెడ్డి వెనుక‌డుగు రీజ‌నిదేనా?

వైసీపీ మాజీ నాయ‌కుడు, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు వి. విజ‌యసాయిరెడ్డి కొత్తగా రాజకీయ పార్టీని పెడ‌తాన‌ని కొన్నాళ్ల కింద‌టే ప్ర‌క‌టించారు.…

2 hours ago