Political News

విప్ల‌వ‌మా.. తిరుగుబాటా.. ఏపీలో ఏం జ‌రిగింది?

సునామీని మించిన ఓట్ల వ‌ర‌ద‌.. గంగా ప్ర‌వాహాన్ని మించిన ఫ‌లితాల వెల్లువ‌.. చూస్తే.. ఏపీలో ఏం జ‌రిగింది? విప్ల‌వ‌మా? లేక ప్ర‌జ‌ల తిరుగుబాటా? అనేది ఆస‌క్తిగా మారింది.

1970ల‌లో కేంద్రంలో అధికారంలో ఉన్న ఇందిరాగాంధీ దేశ‌వ్యాప్తంగా ఎమ‌ర్జెన్సీ విధించారు. పార్టీల‌తో సంబంధం లేకుండా.. ప్ర‌శ్నించిన వారిని జైళ్ల‌కు త‌రిమికొట్టారు. దీంతో జైళ్ల‌న్నీ కిక్కిరిసిపోయాయి.

దీనిని క‌శ్మీర్ నుంచి క‌న్యాకుమారి వ‌రకు ప్ర‌జ‌లు తిర‌స్క‌రించారు. ఆమె తీసుకున్న నిర్ణ‌యాల‌ను తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేకించారు. ఫ‌లితంగా..త‌ర్వాత వ‌చ్చిన ఎన్నిక‌ల్లో ఇందిరా గాంధీని ఆమె పార్టీని కూడా.. చిత్తుచిత్తుగా ఓడించారు.

దీనిని అప్ప‌ట్లో ప్ర‌ముఖ ప‌త్రిక‌లు.. ప్ర‌జ‌ల్లో వ‌చ్చిన తిరుగుబాటుగా పేర్కొన్నాయి. ఇవే విష‌యాన్ని బ్యాన‌ర్ హెడ్డింగుల‌తో ఫ‌స్ట్ పేజీల్లో ముద్రించాయి. క‌ట్ చేస్తే.. 1990ల‌లో త‌మిళ‌నాడులో జ‌రిగిన ఎన్నిక‌ల్లో జ‌య‌ల‌లిత పార్టీ ఘోరంగా ఓడిపోయింది. కేవ‌లం ఇద్ద‌రు మాత్ర‌మే గెలిచారు.

దీనికి కార‌ణం.. అప్ప‌ట్లో క‌రుణానిధి పార్టీ డీఎంకే భారీ ఎత్తున ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించింది. ఇంటింటికీ 25 కిలోల బియ్యంతోపాటు.. పిల్ల‌ల‌కు ఉచితంగా కార్పొరేట్ విద్య‌, ప్ర‌తి ఇంటికీనెల‌కు 500 అంటూ పెద్ద ఎత్తున హామీలు గుప్పించారు. దీంతో జ‌య‌ల‌లిత ఘోర ప‌రాజ‌యం చ‌విచూశారు.

ఈ ఫ‌లితం త‌ర్వాత‌.. ఆ నాటి ప‌త్రిక‌లు.. ప్ర‌జ‌ల్లో వ‌చ్చిన విప్ల‌వం అంటూ క‌థ‌నాలు రాశాయి. మ‌రి ఇప్పుడు ఏపీలో ఏం జ‌రిగింది? తిరుగుబాటు వ‌చ్చిందా? లేక విప్ల‌వం వ‌చ్చిందా? లేక‌.. ఈ రెండూ క‌లిసి వ‌చ్చాయా? అనేది ఆస‌క్తిక‌ర విష‌యం. ఎందుకంటే.. ప్ర‌తిప‌క్షం ఉండ‌కూడ‌ద‌న్న దుగ్ధ‌తో చంద్ర‌బాబును అరెస్టు చేయించి జైల్లో పెట్టించారు. 74 ఏళ్ల వ‌య‌సులో చంద్ర‌బాబును అరెస్టుచేయ‌డాన్ని ఎవ‌రూ జీర్ణించుకోలేక పోయారు.

ఇక‌, ఇత‌ర నేత‌ల‌ను అణిచేయ‌డం.. ఎస్సీల‌పై దాడులు.. డ్రైవ‌ర్‌ను చంపి.. డోర్ డెలివ‌రీ చేసిన ఎమ్మెల్సీని వేటు వేయ‌క‌పోవ‌డం, డాక్ట‌ర్ సుధాక‌ర్‌ను దారుణంగా బంధించ‌డం.. ఇలా.. అనేకానేక ఘ‌ట‌న‌లతో ప్ర‌జ‌లు ఇక్క‌డ కూడా తిరుగుబాటు చేశార‌ని కొంద‌రు చెబుతున్నారు.

ఇదేస‌మ‌యంలో కూట‌మి పార్టీలు ఇచ్చిన సూప‌ర్ సిక్స్ వంటి ప‌థ‌కాలు.. ప్ర‌జ‌ల‌ను ముఖ్యంగా మ‌హిళ‌ల‌ను మంత్ర ముగ్ధుల‌ను చేశాయ‌నే వాద‌న ఉంది. దీంతో విప్ల‌వం వ‌చ్చింద‌ని మ‌రికొంద‌రు చెబుతున్నారు. ఈ రెండు ప‌రిణామాల కార‌ణంగానే.. ఇప్పుడు ఈవీఎంలు బ‌ద్ద‌లై.. టీడీపీ కూట‌మి.. అంబ‌ర‌మంత విజ‌యాన్ని కైవ‌సం చేసుకుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on June 4, 2024 5:35 pm

Share
Show comments
Published by
Satya
Tags: YSRCP

Recent Posts

నానిని టార్గెట్ చేయడం రైటేనా

సెలబ్రిటీలు ఏదైనా విషయం గురించి స్పందిస్తే చాలు దాన్ని చిలవలు పలవలు చేయడానికో టీమ్ సోషల్ మీడియాలో రెడీగా ఉంటుంది.…

2 hours ago

ఎటెటో వెళ్తున్న జన నాయకుడు గొడవ

సినిమా విడుదల ఎప్పుడో తేలకుండానే పైరసీ బారిన పడిన జన నాయకుడు గొడవ రకరకాల మలుపులు తిరుగుతోంది. ముందు లాయర్ తరపున…

3 hours ago

తేడా కొడుతోంది అనిరుధ్ భాయ్

సౌత్ మ్యూజిక్ లో సెన్సేషన్ అంటే అనిరుధ్ రవిచందర్ పేరే ముందు గుర్తొస్తుంది. తను పని చేస్తున్నాడని తెలిస్తే చాలు…

3 hours ago

బీఆర్ఎస్‌లో పూర్తి ప్ర‌క్షాళ‌న… కారణమేంటి?

తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…

4 hours ago

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

7 hours ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

7 hours ago