……………………………..
ఏపీ ఓటర్లకు బుర్రా , బుద్ది ఉందా ?
ఏపీ ఓటర్లు ఒట్టి మూర్ఖులు …!
ఏపీ ఓటర్లకు తిక్క కుదిరింది ….!
అయిదుళ్ళుగా ఇలా అనుకుంటున్న వారందరికీ జూన్ 4, 2024న ఈవీఎం బటన్ నొక్కి సమాధానం చెప్పారు ఏపీ ఓటర్లు.
ఓటరు ఎంత సైలెంటుగా ఉంటే రిజల్ట్ అంత వైలెంటుగా ఉంటుందని ప్రజాస్వామ్య జెండా ఎగరేసి మరీ చెప్పారు.
…….
ఏపీ ఓటర్లు ఓడించింది జగన్ ని కాదు … తలకెక్కిన అహంకారాన్ని !
ఏపీ ఓటర్లు ఊడ్చేసింది… వైసీపీని కాదు …. మదమెక్కిన అధికారాన్ని !
ఏపీ ఓటర్లు ఈడ్చి పడేసింది ప్రజలను హింసించే నాయకులనే కాదు … ప్రజాస్వామ్య కంఠకులను !
ఏపీ ఓటర్లు గెలిపించింది చంద్రబాబునే కాదు … భవిషత్తు దార్శనికతకు !
ఏపీ ఓటర్లు ఓటేసింది జనసేనకే కాదు …. ఎదురొడ్డిన ధైర్యానికి !
ఏపీ ఓటర్లు ఎగరేసింది కూటమి జెండాలనే కాదు …. సైకోల పీఠాలు కదిలిస్తామనే సందేశాన్ని !
అందుకే వారికి వందనం … శిరసా వందనం
………
పాలకులు ఎవరైనా కావొచ్చు…! పాలించేది ఏ పార్టీ అయినా కావొచ్చు !
ప్రజలే సుప్రీంలని చాటిచెప్పారు.
అన్యాయం జరిగినప్పుడు … అవమానం ఎదురైనప్పుడు …
అరాచకం విర్రవీగినప్పుడు ….
సోషల్ మీడియాలో అసంతృప్తి వెళ్లగక్కినా గొంతు నొక్కేవారి పీక పిసికేస్తామని గళమిప్పి చెప్పారు.
అధికారం ఉందని …. హత్యలు, అత్యాచారాలు చేసి…
అడిగితే అణచివేతకు దిగితే …
అతః పాతాళానికి తొక్కేస్తామని కాలరెగరేసి చెప్పారు.
పదవులున్నాయని నోరు పారేసుకుంటూ ….
పవర్ ఉందని చేయి పారేసుకుంటూ …
ఎంగిలి మెతుకులు పడేస్తే గొర్రెల్లా పడి ఉంటారనుకుంటే ….
ఓటుతో బుద్ది చెబుదామని ,
వేటు వేసి గద్దె దించుతామని ,
రాక్షస కోటలైనా బద్దలు కొడతామని …..
గుండె తట్టి చెప్పారు ….
తమకు బుర్రా , బుద్ది ఉన్నాయని దేశానికి రొమ్ము విరిచి చెప్పారు.
అందుకే ఏపీ ఓటరుకు వందనం ….
శిరసా వందనం.
This post was last modified on June 4, 2024 5:24 pm
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…