జనసేన పార్టీ ఏపీ ఎన్నికల్లో సూపర్ హిట్ కొట్టింది. పోటీ చేసిన 21 స్థానాలకు గాను 21 స్థానాలు గెలుచుకుని 100 కు వంద శాతం విజయాలు సాధించబోతున్నది. ఇప్పటికే రాజనగరం, నర్పాపురం స్థానాలలో ఫలితాలు వెల్లడి కాగా, మిగిలిన 19 స్థానాలలో స్పష్టమైన ఆధిక్యాలతో ముందుకుసాగుతుంది. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 64,492 ఓట్ల ఆధిక్యంతో భారీ విజయం దిశగా దూసుకుపోతున్నాడు.
ఏపీలో కూటమి ఏర్పాటులో పవన్ కళ్యాణ్ కీలకపాత్ర పోషించాడు. బీజేపీ, టీడీపీలను కలపడంలో ఎంతో సంయమనంతో వ్యవహరించాడు. తనకు ఇచ్చిన స్థానాలను తగ్గించుకుని మరీ పోటీ చేశాడు. 21 శాసనసభ, 2 లోక్ సభ స్థానాలకు పరిమితం అయ్యాడు. తనకు కేటాయించిన అన్ని శాసనసభ, లోక్ సభ స్థానాలలో పవన్ విజయం సాధించబోతున్నాడు.
పాలకొండలో 8736, నెల్లిమర్లలో 19,246, విశాఖ సౌత్ లో 61,563, అనకాపల్లిలో 25,156, పెందుర్తిలో 47,646, యలమంచిలిలో 24,193, కాకినాడ రూరల్ లో 38,199, రాజోలులో 36,099, గన్నవరంలో 22,558, నిడదవోలులో 26,729, భీమవరంలో 66,974, తాడేపల్లిగూడెంలో 61,510, ఉంగుటూరులో 40,337, పోలవరంలో 3213, ఆవనిగడ్డలో 28,560, తెనాలిలో 46,484, కోడూరులో 11,439, తిరుపతిలో 17,119 ఓట్ల ఆధిక్యంలో జనసేన అభ్యర్థులు ఉన్నారు.
This post was last modified on June 4, 2024 3:36 pm
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…