జనసేన పార్టీ ఏపీ ఎన్నికల్లో సూపర్ హిట్ కొట్టింది. పోటీ చేసిన 21 స్థానాలకు గాను 21 స్థానాలు గెలుచుకుని 100 కు వంద శాతం విజయాలు సాధించబోతున్నది. ఇప్పటికే రాజనగరం, నర్పాపురం స్థానాలలో ఫలితాలు వెల్లడి కాగా, మిగిలిన 19 స్థానాలలో స్పష్టమైన ఆధిక్యాలతో ముందుకుసాగుతుంది. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 64,492 ఓట్ల ఆధిక్యంతో భారీ విజయం దిశగా దూసుకుపోతున్నాడు.
ఏపీలో కూటమి ఏర్పాటులో పవన్ కళ్యాణ్ కీలకపాత్ర పోషించాడు. బీజేపీ, టీడీపీలను కలపడంలో ఎంతో సంయమనంతో వ్యవహరించాడు. తనకు ఇచ్చిన స్థానాలను తగ్గించుకుని మరీ పోటీ చేశాడు. 21 శాసనసభ, 2 లోక్ సభ స్థానాలకు పరిమితం అయ్యాడు. తనకు కేటాయించిన అన్ని శాసనసభ, లోక్ సభ స్థానాలలో పవన్ విజయం సాధించబోతున్నాడు.
పాలకొండలో 8736, నెల్లిమర్లలో 19,246, విశాఖ సౌత్ లో 61,563, అనకాపల్లిలో 25,156, పెందుర్తిలో 47,646, యలమంచిలిలో 24,193, కాకినాడ రూరల్ లో 38,199, రాజోలులో 36,099, గన్నవరంలో 22,558, నిడదవోలులో 26,729, భీమవరంలో 66,974, తాడేపల్లిగూడెంలో 61,510, ఉంగుటూరులో 40,337, పోలవరంలో 3213, ఆవనిగడ్డలో 28,560, తెనాలిలో 46,484, కోడూరులో 11,439, తిరుపతిలో 17,119 ఓట్ల ఆధిక్యంలో జనసేన అభ్యర్థులు ఉన్నారు.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…