జనసేన పార్టీ ఏపీ ఎన్నికల్లో సూపర్ హిట్ కొట్టింది. పోటీ చేసిన 21 స్థానాలకు గాను 21 స్థానాలు గెలుచుకుని 100 కు వంద శాతం విజయాలు సాధించబోతున్నది. ఇప్పటికే రాజనగరం, నర్పాపురం స్థానాలలో ఫలితాలు వెల్లడి కాగా, మిగిలిన 19 స్థానాలలో స్పష్టమైన ఆధిక్యాలతో ముందుకుసాగుతుంది. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 64,492 ఓట్ల ఆధిక్యంతో భారీ విజయం దిశగా దూసుకుపోతున్నాడు.
ఏపీలో కూటమి ఏర్పాటులో పవన్ కళ్యాణ్ కీలకపాత్ర పోషించాడు. బీజేపీ, టీడీపీలను కలపడంలో ఎంతో సంయమనంతో వ్యవహరించాడు. తనకు ఇచ్చిన స్థానాలను తగ్గించుకుని మరీ పోటీ చేశాడు. 21 శాసనసభ, 2 లోక్ సభ స్థానాలకు పరిమితం అయ్యాడు. తనకు కేటాయించిన అన్ని శాసనసభ, లోక్ సభ స్థానాలలో పవన్ విజయం సాధించబోతున్నాడు.
పాలకొండలో 8736, నెల్లిమర్లలో 19,246, విశాఖ సౌత్ లో 61,563, అనకాపల్లిలో 25,156, పెందుర్తిలో 47,646, యలమంచిలిలో 24,193, కాకినాడ రూరల్ లో 38,199, రాజోలులో 36,099, గన్నవరంలో 22,558, నిడదవోలులో 26,729, భీమవరంలో 66,974, తాడేపల్లిగూడెంలో 61,510, ఉంగుటూరులో 40,337, పోలవరంలో 3213, ఆవనిగడ్డలో 28,560, తెనాలిలో 46,484, కోడూరులో 11,439, తిరుపతిలో 17,119 ఓట్ల ఆధిక్యంలో జనసేన అభ్యర్థులు ఉన్నారు.
This post was last modified on June 4, 2024 3:36 pm
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…