టీడీపీ వైపు ఏపీ ప్రజలు ఏకపక్షంగా నిలబడ్డారు. కనీ వినీ ఎరుగని విజయం దక్కించారు. అయితే… ఈ విషయం వెనుక కారణాలు చూస్తే.. ప్రధానంగా సూపర్ సిక్స్ బాగా పనిచేసినట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే టీడీపీ ‘సూపర్ సిక్స్’ పథకాలను చంద్రబాబు ప్రకటించారు. వీటి వైపు మెజారిటీ ప్రజలు మొగ్గు చూపించారని తెలుస్తోంది. ప్రధానంగా ఈ సూపర్ సిక్స్.. పథకాల్లో ఎక్కువగా మహిళలనే టార్గెట్ చేసుకున్నారు.
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని చంద్రబాబు ప్రకటించారు. 2023లో జరిగినమహానాడులో తొలి ప్రకటన ఇదే కావడం గమనార్హం. అంతేకాదు.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత.. చేసే తొలి పని కూడా ఇదేనన్నారు. ఇక, నెల నెలా రూ.1500 ఇస్తామన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతిమహిళకు.. ఈ సొమ్ములు అందిస్తామన్నారు. ఇక, అమ్మ ఒడి కింద వైసీపీరూ.15000 ఇస్తుంటే.. తాము అధికారంలోకి వస్తే.. ప్రతిఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ తాము రూ.15000 ఇస్తామన్నారు.
ఇక, మరీ ముఖ్యంగా ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. రైతు లకు రూ.20 వేల వరకు పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. దీంతో మెజారిటీ మహిళలు అని కాదు.. గుండుగుత్తగా మహిళలు టీడీపీ వైపే నిలబడ్డారు. 128 స్థానాల్లో టీడీపీ ఏకపక్షంగా విజయం ఇచ్చారు. మొత్తంగా చూస్తే.. ఈ పరిణామం.. టీడీపీకి జేజేలు కొట్టేలా చేసిందనే విశ్లేషణలు వస్తున్నాయి.
ఇంత భారీ విజయానికి కారణం..సూపర్ సిక్స్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారని అంటున్నారు. యువత ఎక్కువగా ఓటేయడానికి కారణం.. తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనే ఉంటుందని చంద్రబాబు చెప్పడం. మొత్తంగా చూస్తే.. టీడీపీ విజయానికి సూపర్ సిక్సే కారణమని అంటున్నారు.
This post was last modified on June 4, 2024 2:41 pm
కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…
తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…
ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…
ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…
కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…