Political News

పాతికేళ్ల ప్ర‌స్థానానికి అడ్డుక‌ట్ట‌.. ఒడిశా తీర్పు

ఏపీకి పొరుగున ఉన్న ఒడిశా ప్ర‌జ‌లు వినూత్న తీర్పు ఇచ్చారు. గ‌త 25 సంవ‌త్స‌రాలుగా. ఇక్క‌డ విజ‌య విహారం చేసిన బిజు జ‌న‌తాద‌ళ్ పార్టీని ఇక్క‌డి ప్ర‌జ‌లు ఓట‌మి దిశ‌గా న‌డిపిస్తున్నారు. మొత్తం స్థానాల్లో బీజేపీ 77 చోట్ల లీడ్‌లో ఉంది. అది కూడా వేల సంఖ్య‌లో ఓట్ల‌లో దూసుకుపోతోంది. ఇక‌, అధికార పార్టీ బీజేడీ మాత్రం కేవ‌లం 51 స్థానాల్లో మాత్ర‌మే లీడ్‌లో ఉంది. అది కూడా స్వ‌ల్పంగా ఉండ‌డం తో ఇక్క‌డ మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

ఆది నుంచి అంటే.. గ‌డిచిన 25 సంవ‌త్స‌రాలుగా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ పార్టీకి ఇక్క‌డి ప్ర‌జ‌లు జై కొట్టారు. దీంతో ఆయ‌న పాతిక సంవ‌త్స‌రాలుగా.. న‌వీన్ అధికారంలో ఉన్నారు. ఆయ‌నే సీఎంగా వ్య‌వ‌హ‌రించారు.అయితే.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను అందిపుచ్చుకోవ‌డంలో కాంగ్రెస్ పూర్తిగా విఫ‌ల‌మైంది. మ‌రోవైపు.. దీనిని తమ‌కు అనుకూలంగా మార్చుకున్న బీజేపీ అందిపుచ్చుకుంది. ఎన్నిక‌ల వేళ‌.. ముఖ్య మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ అనారోగ్యాన్ని ప్రచారం చేసుకుంది.

మాజీ ఐఏఎస్ పాండ్య‌న్ కు దాదాపు అధికారాన్ని అప్ప‌గించి.. చివ‌రి రెండు సంవ‌త్స‌రాలు కూడా.. న‌వీన్ యాక్టింగ్ సీఎంగానే వ్య‌వ‌హ‌రించారు.. దీంతో ఈ వ్య‌వ‌హారం బీజేపీకి క‌లిసి వ‌చ్చింది. దీంతో ఇదే విష‌యాన్ని ప్ర‌చారంలోకి తీసుకువ‌చ్చింది. దీనికి తోడు పాతికేళ్లుగా న‌వీన్ సీఎంగా ఉన్న‌ప్ప‌టికీ త‌మ జీవితాల్లో మార్పులేకుండా పోయింద‌న్న ప్ర‌జానాడిని ప‌ట్టుకోవ‌డంలోనూ బీజేపీ స‌క్సెస్ అయింది.

దీనికితోడు పూరి జ‌గ‌న్నాథుడి ఆల‌య తాళాల వ్య‌వ‌హారం కూడా.. న‌వీన్‌కు ఇబ్బందిగా మారింది. మొత్తంగా చూస్తే.. పాతికేళ్ల ప్ర‌స్తానం ఇక్క‌డ బీజేడీకి ముగిసిపోయి.. బీజేపీ అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం ఏర్ప‌డింది.

This post was last modified on June 4, 2024 12:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

5 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

49 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

2 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago