ఏపీకి పొరుగున ఉన్న ఒడిశా ప్రజలు వినూత్న తీర్పు ఇచ్చారు. గత 25 సంవత్సరాలుగా. ఇక్కడ విజయ విహారం చేసిన బిజు జనతాదళ్ పార్టీని ఇక్కడి ప్రజలు ఓటమి దిశగా నడిపిస్తున్నారు. మొత్తం స్థానాల్లో బీజేపీ 77 చోట్ల లీడ్లో ఉంది. అది కూడా వేల సంఖ్యలో ఓట్లలో దూసుకుపోతోంది. ఇక, అధికార పార్టీ బీజేడీ మాత్రం కేవలం 51 స్థానాల్లో మాత్రమే లీడ్లో ఉంది. అది కూడా స్వల్పంగా ఉండడం తో ఇక్కడ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.
ఆది నుంచి అంటే.. గడిచిన 25 సంవత్సరాలుగా సీఎం నవీన్ పట్నాయక్ పార్టీకి ఇక్కడి ప్రజలు జై కొట్టారు. దీంతో ఆయన పాతిక సంవత్సరాలుగా.. నవీన్ అధికారంలో ఉన్నారు. ఆయనే సీఎంగా వ్యవహరించారు.అయితే.. ప్రభుత్వ వ్యతిరేకతను అందిపుచ్చుకోవడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. మరోవైపు.. దీనిని తమకు అనుకూలంగా మార్చుకున్న బీజేపీ అందిపుచ్చుకుంది. ఎన్నికల వేళ.. ముఖ్య మంత్రి నవీన్ పట్నాయక్ అనారోగ్యాన్ని ప్రచారం చేసుకుంది.
మాజీ ఐఏఎస్ పాండ్యన్ కు దాదాపు అధికారాన్ని అప్పగించి.. చివరి రెండు సంవత్సరాలు కూడా.. నవీన్ యాక్టింగ్ సీఎంగానే వ్యవహరించారు.. దీంతో ఈ వ్యవహారం బీజేపీకి కలిసి వచ్చింది. దీంతో ఇదే విషయాన్ని ప్రచారంలోకి తీసుకువచ్చింది. దీనికి తోడు పాతికేళ్లుగా నవీన్ సీఎంగా ఉన్నప్పటికీ తమ జీవితాల్లో మార్పులేకుండా పోయిందన్న ప్రజానాడిని పట్టుకోవడంలోనూ బీజేపీ సక్సెస్ అయింది.
దీనికితోడు పూరి జగన్నాథుడి ఆలయ తాళాల వ్యవహారం కూడా.. నవీన్కు ఇబ్బందిగా మారింది. మొత్తంగా చూస్తే.. పాతికేళ్ల ప్రస్తానం ఇక్కడ బీజేడీకి ముగిసిపోయి.. బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఏర్పడింది.
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…
తెలంగాణ రాజకీయాలు వ్యూహాత్మక మలుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్, టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా జనసేన పార్టీపై…
మొన్నటిదాకా తమిళ సినీ పరిశ్రమలోనే కాక దేశంలోని ఇతర భాషాల్లోనూ ఓ స్టార్ హీరోగా ఎదిగిన జోసెఫ్ విజయ్… ఉన్నట్టుండి…