Political News

పాతికేళ్ల ప్ర‌స్థానానికి అడ్డుక‌ట్ట‌.. ఒడిశా తీర్పు

ఏపీకి పొరుగున ఉన్న ఒడిశా ప్ర‌జ‌లు వినూత్న తీర్పు ఇచ్చారు. గ‌త 25 సంవ‌త్స‌రాలుగా. ఇక్క‌డ విజ‌య విహారం చేసిన బిజు జ‌న‌తాద‌ళ్ పార్టీని ఇక్క‌డి ప్ర‌జ‌లు ఓట‌మి దిశ‌గా న‌డిపిస్తున్నారు. మొత్తం స్థానాల్లో బీజేపీ 77 చోట్ల లీడ్‌లో ఉంది. అది కూడా వేల సంఖ్య‌లో ఓట్ల‌లో దూసుకుపోతోంది. ఇక‌, అధికార పార్టీ బీజేడీ మాత్రం కేవ‌లం 51 స్థానాల్లో మాత్ర‌మే లీడ్‌లో ఉంది. అది కూడా స్వ‌ల్పంగా ఉండ‌డం తో ఇక్క‌డ మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

ఆది నుంచి అంటే.. గ‌డిచిన 25 సంవ‌త్స‌రాలుగా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ పార్టీకి ఇక్క‌డి ప్ర‌జ‌లు జై కొట్టారు. దీంతో ఆయ‌న పాతిక సంవ‌త్స‌రాలుగా.. న‌వీన్ అధికారంలో ఉన్నారు. ఆయ‌నే సీఎంగా వ్య‌వ‌హ‌రించారు.అయితే.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను అందిపుచ్చుకోవ‌డంలో కాంగ్రెస్ పూర్తిగా విఫ‌ల‌మైంది. మ‌రోవైపు.. దీనిని తమ‌కు అనుకూలంగా మార్చుకున్న బీజేపీ అందిపుచ్చుకుంది. ఎన్నిక‌ల వేళ‌.. ముఖ్య మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ అనారోగ్యాన్ని ప్రచారం చేసుకుంది.

మాజీ ఐఏఎస్ పాండ్య‌న్ కు దాదాపు అధికారాన్ని అప్ప‌గించి.. చివ‌రి రెండు సంవ‌త్స‌రాలు కూడా.. న‌వీన్ యాక్టింగ్ సీఎంగానే వ్య‌వ‌హ‌రించారు.. దీంతో ఈ వ్య‌వ‌హారం బీజేపీకి క‌లిసి వ‌చ్చింది. దీంతో ఇదే విష‌యాన్ని ప్ర‌చారంలోకి తీసుకువ‌చ్చింది. దీనికి తోడు పాతికేళ్లుగా న‌వీన్ సీఎంగా ఉన్న‌ప్ప‌టికీ త‌మ జీవితాల్లో మార్పులేకుండా పోయింద‌న్న ప్ర‌జానాడిని ప‌ట్టుకోవ‌డంలోనూ బీజేపీ స‌క్సెస్ అయింది.

దీనికితోడు పూరి జ‌గ‌న్నాథుడి ఆల‌య తాళాల వ్య‌వ‌హారం కూడా.. న‌వీన్‌కు ఇబ్బందిగా మారింది. మొత్తంగా చూస్తే.. పాతికేళ్ల ప్ర‌స్తానం ఇక్క‌డ బీజేడీకి ముగిసిపోయి.. బీజేపీ అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం ఏర్ప‌డింది.

This post was last modified on June 4, 2024 12:36 pm

Share

Recent Posts

ఫౌజీ ప్లానింగ్ విభిన్నంగా ఉంటుందా?

డిసెంబర్ 3 ఎప్పుడెప్పుడు వస్తుందాని ప్రభాస్ అభిమానులు కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ముందు రోజే ప్రీమియర్లు ఉంటాయని…

14 minutes ago

రోలెక్స్… ఏమో తెలియదన్న సూర్య

లోకనాయకుడు కమల్ హాసన్ పనైపోయిందనుకున్న సమయంలో ఆయన అదిరిపోయే కమ్ బ్యాక్‌‌ ఇచ్చిన సినిమా.. విక్రమ్. ఆ సినిమాతోనే సౌత్…

2 hours ago

మాజీ ముఖ్యమంత్రి తనయుడు అరెస్టు… అక్కడ పొలిటికల్ హీట్!

తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…

2 hours ago

ఆ వైరస్ యమ డేంజర్… ఇప్పటికే 22 మంది పిల్లలు మృతి

గుజరాత్‌లో చాందిపుర వైరస్‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…

3 hours ago

సినిమా చూడాలంటే మ‌నోళ్ల త‌ర్వాతే ఎవ‌రైనా…

సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వ‌రైనా ఒప్పుకోవాల్సిందే. త‌మ సినిమాల‌ను ప్ర‌మోట్ చేయ‌డం కోసం తెలుగు రాష్ట్రాల‌కు…

3 hours ago

సూపర్ స్టార్ కూతురు ఎలా చేసింది

మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…

4 hours ago