ఏపీలో ట్రెండ్స్ కొనసాగుతున్నాయి. గత నెల 13న జరిగిన హోరా హోరీ ఎన్నికల ఫలితం.. ఉత్కంఠగా ఉంటుందని.. నరాలు తెంపేస్తుందని అనుకున్నా.. ఆ ట్రెండ్ ఎక్కడా కనిపించలేదు. అంతేకాదు.. కనీసం ఎక్కడా వైసీపీ పోటీ కూడా ఇవ్వలేక పోయింది. మంగళవారం ఉదయం 8 గంటల తర్వాత.. ప్రారంభమైన కౌంటింగ్లో తొలి ట్రెండ్ టీడీపీతోనే ప్రారంభమైంది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ మోస్ట్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి లీడ్ లో కొనసాగారు.
ఇక, అక్కడి నుంచి ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. ఉదయం 11.30 నిమిషాలకే రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో కౌంటింగ్ పూర్తయిపోయింది. ఈ క్రమంలో బుచ్చయ్య చౌదరి విజయం దక్కించుకోవా లి. ఏకంగా 61 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీని ఆయన దక్కించుకున్నారు. అన్నగారు ఎన్టీఆర్ హయాం నుంచి కూడా.. టీడీపీలోనే ఉన్న బుచ్చయ్యకు ఈ సారి అసలు టికెట్ దక్కడమే సందేహంలో పడిపోయింది. జనసేన నాయకుడు.. కందుల దుర్గేష్ పోటీ ఇచ్చారు.
చివరి నిముషం వరకు తన సీటును తనకు ఇవ్వాలంటూ.. బుచ్చయ్య బ్రతిమాలుకునే పరిస్థితి.. ఒకానొక దశలో ఆయన అలిగారు కూడా. మొత్తంగా చూస్తే.. చివరకు దక్కించుకున్నారు. దక్కించుకున్నప్పుడు కూడా.. ఆయనపై ఆశలు లేవు. కానీ, ఇప్పుడు ఆయన భారీ మెజారిటీతో విజయం దక్కించుకున్నారు. అన్నగారి హయాంలో బుచ్చయ్య మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు కూడా ఆయన మంత్రివర్గ రేసులో ఉన్నారు. మరి ఆయనకు దక్కుతుందా లేదా అనేది చూడాలి.
This post was last modified on June 4, 2024 11:58 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…