Political News

చేతులెత్తేసిన‌ వైసీపీ నాయ‌కులు..!!

ఒక‌వైపు ఎన్నిక‌ల కౌంటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే వైసీపీనాయ‌కులు, అభ్య‌ర్తులు కూడా.. ఆయా కేంద్రాల నుంచి వెళ్లిపోయారు. ప్ర‌ధానంగా కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గాల‌లో గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయ మ‌ని అనుకున్న నాయ‌కులు.. ఉద్ధండ నేత‌లు కూడా.. కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్లిపోయారు. ముఖ్యం గా కీల‌క‌మైన గుడివాడ‌, గ‌న్న‌వ‌రం, పెన‌మ‌లూరు, మ‌చిలీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన అభ్య‌ర్థులు కౌంటింగ్ కేంద్రాల న‌నుంచి వెళ్లిపోయారు.

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. వ‌ల్ల‌భ‌నేని వంశీ, మంత్రి జోగి ర‌మేష్, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి స‌హా.. అంద‌రూ కూడా.. కౌంటింగ్ కేంద్రాలకు మంగ‌ళ‌వారం ఉద‌య‌మే చేరుకున్నా రు. ఫ‌లితాలు త‌మ‌కు అనుకూలంగా వ‌స్తాయని అనుకున్నారు.. అయితే.. తొలి రౌండ్ నుంచే టీడీపీ పుంజుకోవ‌డం.. జ‌న‌సేన అభ్య‌ర్థులు పుంజుకోవ‌డంతో వైసీపీ అభ్య‌ర్థులు ఒక్కొక్క‌రుగా కాదు.. ఉమ్మ‌డిగానే కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్లిపోయారు.

ఇక‌, మ‌రోవైపు మొండిగా మ‌రికొంద‌రు కౌంటింగ్ కేంద్రాల వ‌ద్దే వేచి చూస్తున్నారు. వీరిలో మాజీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్‌, మంత్రి రోజాలు త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాలు విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌, న‌గ‌రిలో వేచి చూస్తున్నారు. అదేవిధంగా స‌త్త‌నప‌ల్లిలో మంత్రి అంబ‌టి రాంబాబు బాగా వెనుక బ‌డ్డారు. అయితే.. వ‌చ్చే రౌండ్ నుంచి త‌న ఓట్లు పెరుగుతాయంటూ.. ఆయ‌న వేచి చూస్తున్నారు. కానీ, మొత్తంగా చూస్తే.. 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో 100 స్థానాల్లో అభ్య‌ర్థులు త‌మ ఏజెంట్ల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించి.. వెళ్లిపోవ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on June 4, 2024 11:59 am

Share
Show comments

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

41 minutes ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

1 hour ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

3 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

3 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

4 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

5 hours ago