Political News

చేతులెత్తేసిన‌ వైసీపీ నాయ‌కులు..!!

ఒక‌వైపు ఎన్నిక‌ల కౌంటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే వైసీపీనాయ‌కులు, అభ్య‌ర్తులు కూడా.. ఆయా కేంద్రాల నుంచి వెళ్లిపోయారు. ప్ర‌ధానంగా కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గాల‌లో గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయ మ‌ని అనుకున్న నాయ‌కులు.. ఉద్ధండ నేత‌లు కూడా.. కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్లిపోయారు. ముఖ్యం గా కీల‌క‌మైన గుడివాడ‌, గ‌న్న‌వ‌రం, పెన‌మ‌లూరు, మ‌చిలీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన అభ్య‌ర్థులు కౌంటింగ్ కేంద్రాల న‌నుంచి వెళ్లిపోయారు.

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. వ‌ల్ల‌భ‌నేని వంశీ, మంత్రి జోగి ర‌మేష్, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి స‌హా.. అంద‌రూ కూడా.. కౌంటింగ్ కేంద్రాలకు మంగ‌ళ‌వారం ఉద‌య‌మే చేరుకున్నా రు. ఫ‌లితాలు త‌మ‌కు అనుకూలంగా వ‌స్తాయని అనుకున్నారు.. అయితే.. తొలి రౌండ్ నుంచే టీడీపీ పుంజుకోవ‌డం.. జ‌న‌సేన అభ్య‌ర్థులు పుంజుకోవ‌డంతో వైసీపీ అభ్య‌ర్థులు ఒక్కొక్క‌రుగా కాదు.. ఉమ్మ‌డిగానే కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్లిపోయారు.

ఇక‌, మ‌రోవైపు మొండిగా మ‌రికొంద‌రు కౌంటింగ్ కేంద్రాల వ‌ద్దే వేచి చూస్తున్నారు. వీరిలో మాజీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్‌, మంత్రి రోజాలు త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాలు విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌, న‌గ‌రిలో వేచి చూస్తున్నారు. అదేవిధంగా స‌త్త‌నప‌ల్లిలో మంత్రి అంబ‌టి రాంబాబు బాగా వెనుక బ‌డ్డారు. అయితే.. వ‌చ్చే రౌండ్ నుంచి త‌న ఓట్లు పెరుగుతాయంటూ.. ఆయ‌న వేచి చూస్తున్నారు. కానీ, మొత్తంగా చూస్తే.. 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో 100 స్థానాల్లో అభ్య‌ర్థులు త‌మ ఏజెంట్ల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించి.. వెళ్లిపోవ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on June 4, 2024 11:59 am

Share
Show comments

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

23 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago