ఒకవైపు ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న సమయంలోనే వైసీపీనాయకులు, అభ్యర్తులు కూడా.. ఆయా కేంద్రాల నుంచి వెళ్లిపోయారు. ప్రధానంగా కీలకమైన నియోజకవర్గాలలో గెలుపు గుర్రం ఎక్కడం ఖాయ మని అనుకున్న నాయకులు.. ఉద్ధండ నేతలు కూడా.. కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్లిపోయారు. ముఖ్యం గా కీలకమైన గుడివాడ, గన్నవరం, పెనమలూరు, మచిలీపట్నం నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రాల ననుంచి వెళ్లిపోయారు.
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. వల్లభనేని వంశీ, మంత్రి జోగి రమేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సహా.. అందరూ కూడా.. కౌంటింగ్ కేంద్రాలకు మంగళవారం ఉదయమే చేరుకున్నా రు. ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయని అనుకున్నారు.. అయితే.. తొలి రౌండ్ నుంచే టీడీపీ పుంజుకోవడం.. జనసేన అభ్యర్థులు పుంజుకోవడంతో వైసీపీ అభ్యర్థులు ఒక్కొక్కరుగా కాదు.. ఉమ్మడిగానే కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్లిపోయారు.
ఇక, మరోవైపు మొండిగా మరికొందరు కౌంటింగ్ కేంద్రాల వద్దే వేచి చూస్తున్నారు. వీరిలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మంత్రి రోజాలు తమ తమ నియోజకవర్గాలు విజయవాడ సెంట్రల్, నగరిలో వేచి చూస్తున్నారు. అదేవిధంగా సత్తనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు బాగా వెనుక బడ్డారు. అయితే.. వచ్చే రౌండ్ నుంచి తన ఓట్లు పెరుగుతాయంటూ.. ఆయన వేచి చూస్తున్నారు. కానీ, మొత్తంగా చూస్తే.. 175 నియోజకవర్గాల్లో 100 స్థానాల్లో అభ్యర్థులు తమ ఏజెంట్లకు బాధ్యతలు అప్పగించి.. వెళ్లిపోవడం గమనార్హం.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…