Political News

చేతులెత్తేసిన‌ వైసీపీ నాయ‌కులు..!!

ఒక‌వైపు ఎన్నిక‌ల కౌంటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే వైసీపీనాయ‌కులు, అభ్య‌ర్తులు కూడా.. ఆయా కేంద్రాల నుంచి వెళ్లిపోయారు. ప్ర‌ధానంగా కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గాల‌లో గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయ మ‌ని అనుకున్న నాయ‌కులు.. ఉద్ధండ నేత‌లు కూడా.. కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్లిపోయారు. ముఖ్యం గా కీల‌క‌మైన గుడివాడ‌, గ‌న్న‌వ‌రం, పెన‌మ‌లూరు, మ‌చిలీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన అభ్య‌ర్థులు కౌంటింగ్ కేంద్రాల న‌నుంచి వెళ్లిపోయారు.

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. వ‌ల్ల‌భ‌నేని వంశీ, మంత్రి జోగి ర‌మేష్, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి స‌హా.. అంద‌రూ కూడా.. కౌంటింగ్ కేంద్రాలకు మంగ‌ళ‌వారం ఉద‌య‌మే చేరుకున్నా రు. ఫ‌లితాలు త‌మ‌కు అనుకూలంగా వ‌స్తాయని అనుకున్నారు.. అయితే.. తొలి రౌండ్ నుంచే టీడీపీ పుంజుకోవ‌డం.. జ‌న‌సేన అభ్య‌ర్థులు పుంజుకోవ‌డంతో వైసీపీ అభ్య‌ర్థులు ఒక్కొక్క‌రుగా కాదు.. ఉమ్మ‌డిగానే కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్లిపోయారు.

ఇక‌, మ‌రోవైపు మొండిగా మ‌రికొంద‌రు కౌంటింగ్ కేంద్రాల వ‌ద్దే వేచి చూస్తున్నారు. వీరిలో మాజీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్‌, మంత్రి రోజాలు త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాలు విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌, న‌గ‌రిలో వేచి చూస్తున్నారు. అదేవిధంగా స‌త్త‌నప‌ల్లిలో మంత్రి అంబ‌టి రాంబాబు బాగా వెనుక బ‌డ్డారు. అయితే.. వ‌చ్చే రౌండ్ నుంచి త‌న ఓట్లు పెరుగుతాయంటూ.. ఆయ‌న వేచి చూస్తున్నారు. కానీ, మొత్తంగా చూస్తే.. 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో 100 స్థానాల్లో అభ్య‌ర్థులు త‌మ ఏజెంట్ల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించి.. వెళ్లిపోవ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on June 4, 2024 11:59 am

Share

Recent Posts

ఈ బంధాలే టీడీపీ బలం!

భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…

2 hours ago

ఏ పోస్ట్ అయినా పెడతా… ఎలాంటి ఫోటో అయినా దిగుతా

టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…

2 hours ago

హీరో కంటే దర్శకుడికే డ్యామేజ్

ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…

4 hours ago

జ‌గ‌న్‌కు సెగ‌: వైసీపీలో నిర‌స‌న స్వ‌రాలు.. !

వైసీపీలో జ‌గ‌న్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నార‌ని, ఆయ‌న గీసిన గీత దాట‌బోర‌ని చెప్పే వారు క‌నిపిస్తారు. అయితే.. తాజాగా…

5 hours ago

బ్రేకప్ బాధ నుంచి బ‌య‌ట‌ప‌డ్డ‌ట్లేనా?

క‌థానాయిక‌గా మ‌ల‌యాళంలో ప‌రిచ‌యం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవ‌కాశాలు అందుకున్న అమ్మాయి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్. ఆమె కెరీర్లో ఎక్కువ…

9 hours ago

ఎయిర్ పోర్టు లేకపోతే పిల్లనివ్వరా..?

వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…

9 hours ago