ఒకవైపు ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న సమయంలోనే వైసీపీనాయకులు, అభ్యర్తులు కూడా.. ఆయా కేంద్రాల నుంచి వెళ్లిపోయారు. ప్రధానంగా కీలకమైన నియోజకవర్గాలలో గెలుపు గుర్రం ఎక్కడం ఖాయ మని అనుకున్న నాయకులు.. ఉద్ధండ నేతలు కూడా.. కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్లిపోయారు. ముఖ్యం గా కీలకమైన గుడివాడ, గన్నవరం, పెనమలూరు, మచిలీపట్నం నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రాల ననుంచి వెళ్లిపోయారు.
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. వల్లభనేని వంశీ, మంత్రి జోగి రమేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సహా.. అందరూ కూడా.. కౌంటింగ్ కేంద్రాలకు మంగళవారం ఉదయమే చేరుకున్నా రు. ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయని అనుకున్నారు.. అయితే.. తొలి రౌండ్ నుంచే టీడీపీ పుంజుకోవడం.. జనసేన అభ్యర్థులు పుంజుకోవడంతో వైసీపీ అభ్యర్థులు ఒక్కొక్కరుగా కాదు.. ఉమ్మడిగానే కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్లిపోయారు.
ఇక, మరోవైపు మొండిగా మరికొందరు కౌంటింగ్ కేంద్రాల వద్దే వేచి చూస్తున్నారు. వీరిలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మంత్రి రోజాలు తమ తమ నియోజకవర్గాలు విజయవాడ సెంట్రల్, నగరిలో వేచి చూస్తున్నారు. అదేవిధంగా సత్తనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు బాగా వెనుక బడ్డారు. అయితే.. వచ్చే రౌండ్ నుంచి తన ఓట్లు పెరుగుతాయంటూ.. ఆయన వేచి చూస్తున్నారు. కానీ, మొత్తంగా చూస్తే.. 175 నియోజకవర్గాల్లో 100 స్థానాల్లో అభ్యర్థులు తమ ఏజెంట్లకు బాధ్యతలు అప్పగించి.. వెళ్లిపోవడం గమనార్హం.
This post was last modified on June 4, 2024 11:59 am
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని బలోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మరింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మక అడుగులు…
తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వర్గాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో ఒక వర్గానికి ఇంకో వర్గానికి అస్సలు…
ఒకప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావడం, ఇక్కడ పెద్ద స్థాయిలో రిలీజ్ కావడమే ఉండేది తప్ప.. తెలుగు చిత్రాలు…
మాజీ మంత్రి మల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెరవాల్సిందే. అది రాజకీయ సభ అయినా.. సినిమా…
మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…
అల్లు అర్జున్ అంటే ఒకప్పుడు మెగా హీరోల్లో ఒకడు. అతను మెగాస్టార్ చిరంజీవినో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్నో పొగిడితేనో..…