Political News

చేతులెత్తేసిన‌ వైసీపీ నాయ‌కులు..!!

ఒక‌వైపు ఎన్నిక‌ల కౌంటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే వైసీపీనాయ‌కులు, అభ్య‌ర్తులు కూడా.. ఆయా కేంద్రాల నుంచి వెళ్లిపోయారు. ప్ర‌ధానంగా కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గాల‌లో గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయ మ‌ని అనుకున్న నాయ‌కులు.. ఉద్ధండ నేత‌లు కూడా.. కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్లిపోయారు. ముఖ్యం గా కీల‌క‌మైన గుడివాడ‌, గ‌న్న‌వ‌రం, పెన‌మ‌లూరు, మ‌చిలీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన అభ్య‌ర్థులు కౌంటింగ్ కేంద్రాల న‌నుంచి వెళ్లిపోయారు.

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. వ‌ల్ల‌భ‌నేని వంశీ, మంత్రి జోగి ర‌మేష్, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి స‌హా.. అంద‌రూ కూడా.. కౌంటింగ్ కేంద్రాలకు మంగ‌ళ‌వారం ఉద‌య‌మే చేరుకున్నా రు. ఫ‌లితాలు త‌మ‌కు అనుకూలంగా వ‌స్తాయని అనుకున్నారు.. అయితే.. తొలి రౌండ్ నుంచే టీడీపీ పుంజుకోవ‌డం.. జ‌న‌సేన అభ్య‌ర్థులు పుంజుకోవ‌డంతో వైసీపీ అభ్య‌ర్థులు ఒక్కొక్క‌రుగా కాదు.. ఉమ్మ‌డిగానే కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్లిపోయారు.

ఇక‌, మ‌రోవైపు మొండిగా మ‌రికొంద‌రు కౌంటింగ్ కేంద్రాల వ‌ద్దే వేచి చూస్తున్నారు. వీరిలో మాజీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్‌, మంత్రి రోజాలు త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాలు విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌, న‌గ‌రిలో వేచి చూస్తున్నారు. అదేవిధంగా స‌త్త‌నప‌ల్లిలో మంత్రి అంబ‌టి రాంబాబు బాగా వెనుక బ‌డ్డారు. అయితే.. వ‌చ్చే రౌండ్ నుంచి త‌న ఓట్లు పెరుగుతాయంటూ.. ఆయ‌న వేచి చూస్తున్నారు. కానీ, మొత్తంగా చూస్తే.. 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో 100 స్థానాల్లో అభ్య‌ర్థులు త‌మ ఏజెంట్ల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించి.. వెళ్లిపోవ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on June 4, 2024 11:59 am

Share
Show comments

Recent Posts

ప్యారడైజ్ పరుగులు పెట్టాల్సిందే

పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…

50 minutes ago

రజినీకాంత్ భయపడ్డాడా? జాగ్రత్తపడ్డాడా?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…

3 hours ago

వాషింగ్టన్ డీసీని… మనమ్మాయి శాసిస్తుందా?

ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…

3 hours ago

పార్టీ పేరుతో పాటు గుర్తుతోనూ స్ట్రోక్ ఇవ్వనున్న కవిత?

బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయ‌కురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌విత త‌న దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వ‌రలోనే…

3 hours ago

భానుప్రియ మతిస్థిమితం కోల్పోయిందా?

ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో భానుప్రియ ఒకరు. 80వ దశకంలో తెలుగులో ఉన్న అందరు అగ్రకథానాయికులతోనూ ఆమె…

4 hours ago

బ్లాక్ బస్టర్ స్ట్రీక్‌కు బ్రేక్ పడబోతోందా?

అనామకుడైన ఒక కుర్రాడు హీరోగా నటించిన తొలి సినిమాతోనే వంద కోట్ల వసూళ్లు రాబట్టడమే అనూహ్యం. అలాంటిది ఆ హీరో తర్వాతి…

4 hours ago