తెలంగాణ లోక్ సభ ఎన్నికలలో మొత్తం 17 స్థానాలలో కేవలం రెండు చోట్ల మినహా మిగిలిన 15 స్థానాలలో బీఆర్ఎస్ ఆశలు వదులుకున్న పరిస్థితి నెలకొంది. సామాజిక సమతూకం పాటిస్తూ అభ్యర్థులను ఎంపిక చేసినా కూడా ఈ లోక్ సభ ఎన్నికల్లో ఓటర్లు బీఆర్ఎస్ పార్టీని పరిగణనలోకి తీసుకోలేదని అర్ధమవుతున్నది.
ఈ ఎన్నికలలో నాగర్ కర్నూలు, మెదక్ స్థానాలలో మాత్రమే బీఆర్ఎస్ ప్రభావం చూపగలిగింది. మిగిలిన స్థానాలలో బాగా వెనకబడి పోయింది. మెదక్ లో 3311 ఓట్ల ఆధిక్యంలో ఉండగా, నాగర్ కర్నూలులో 1,25,112 ఓట్లతో మల్లురవి 16,403 ఓట్ల ఆధిక్యంలో ఉండగా, 1,08,709 ఓట్లతో రెండో స్థానంలో, బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 1,02,679 ఓట్లతో మూడోస్థానంలో గట్టి పోటీని ఇస్తున్నాడు. ఇక్కడ జరుగుతున్న ట్రయాంగిల్ పోటీలో ఎవ్వరు గెలిచినా 5 నుండి 15 వేల ఓట్ల మెజారిటీ మాత్రమే ఉండే అవకాశం ఉంది.
ఇవికాకుండా మిగతా స్థానాలలో బీఆర్ఎస్ ఎంతో వెనకబడింది. ఆదిలాబాద్ , భువనగిరి, చేవెళ్ల,హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, మల్కాజ్ గిరి, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, సికింద్రాబాద్, వరంగల్, జహీరాబాద్ లలో మూడో స్థానానికి పార్టీ పరిమితం అయింది.
This post was last modified on June 4, 2024 11:44 am
గత ఏడాది మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలు తెలుగులోనూ మంచి విజయం నమోదు చేసుకుంది. ఎస్ఎస్ కార్తికేయ తీసుకున్న ప్రత్యేక…
అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భారత్కు రానున్నారని సమాచారం. తొమ్మిది నెలల…
ఐపీఎల్ 2025 సీజన్లో అందరి దృష్టి ఒక చిన్న కుర్రాడిపై నిలిచింది. కేవలం 13 ఏళ్ల వయసులో ఐపీఎల్లో అడుగుపెడుతున్న…
సినిమాలు తగ్గించినా సరే దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఉన్న ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. డిసెంబర్లో పుష్ప 2 ది రూల్…
సల్మాన్ ఖాన్ సికిందర్ విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ మార్చి 30 వస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిందని…
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుబడిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మంగళవారం సురక్షితంగా భూమిపైకి చేరారు. సునీతతో…