తెలంగాణ లోక్ సభ ఎన్నికలలో మొత్తం 17 స్థానాలలో కేవలం రెండు చోట్ల మినహా మిగిలిన 15 స్థానాలలో బీఆర్ఎస్ ఆశలు వదులుకున్న పరిస్థితి నెలకొంది. సామాజిక సమతూకం పాటిస్తూ అభ్యర్థులను ఎంపిక చేసినా కూడా ఈ లోక్ సభ ఎన్నికల్లో ఓటర్లు బీఆర్ఎస్ పార్టీని పరిగణనలోకి తీసుకోలేదని అర్ధమవుతున్నది.
ఈ ఎన్నికలలో నాగర్ కర్నూలు, మెదక్ స్థానాలలో మాత్రమే బీఆర్ఎస్ ప్రభావం చూపగలిగింది. మిగిలిన స్థానాలలో బాగా వెనకబడి పోయింది. మెదక్ లో 3311 ఓట్ల ఆధిక్యంలో ఉండగా, నాగర్ కర్నూలులో 1,25,112 ఓట్లతో మల్లురవి 16,403 ఓట్ల ఆధిక్యంలో ఉండగా, 1,08,709 ఓట్లతో రెండో స్థానంలో, బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 1,02,679 ఓట్లతో మూడోస్థానంలో గట్టి పోటీని ఇస్తున్నాడు. ఇక్కడ జరుగుతున్న ట్రయాంగిల్ పోటీలో ఎవ్వరు గెలిచినా 5 నుండి 15 వేల ఓట్ల మెజారిటీ మాత్రమే ఉండే అవకాశం ఉంది.
ఇవికాకుండా మిగతా స్థానాలలో బీఆర్ఎస్ ఎంతో వెనకబడింది. ఆదిలాబాద్ , భువనగిరి, చేవెళ్ల,హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, మల్కాజ్ గిరి, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, సికింద్రాబాద్, వరంగల్, జహీరాబాద్ లలో మూడో స్థానానికి పార్టీ పరిమితం అయింది.
వరసగా మూడు సూపర్ హిట్స్ లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ సాధించి హ్యాట్రిక్ హీరో అనిపించుకున్న ప్రదీప్ రంగనాథన్ కి…
116 ఏళ్ల వయసులోనూ తన ఇష్ట దైవం తిరుమల శ్రేవేంకటేశ్వర స్వామి దర్శనానికి కాలి నడకన వచ్చిన వృద్ధురాలికి తిరుమల…
టాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లోనూ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న బ్యూటీ రెజీనా కసాండ్రా లేటెస్ట్ గా నెట్టింట…
ఇంకో అయిదు రోజుల్లో లెనిన్ విడుదల కానుంది. జూలై 10 కోసం అక్కినేని అభిమానులే కాదు సగటు మూవీ లవర్స్…
థియేటర్లలో విడుదలయ్యే సినిమాలకు సెన్సార్ అడ్డంకులు రావడం సహజం. ఒక్కోసారి నెలలు సంవత్సరాల తరబడి రిలీజులు ఆగిపోతాయి. కానీ ఓటిటిలో…
టాలీవుడ్లో బాగా ఔట్ స్పోకెన్ అని పేరున్న నిర్మాత సూర్యదేవర నాగవంశీ. సోషల్ మీడియాలో ఆయనకున్న పాపులారిటీనే వేరు. ప్రస్తుతం…