తెలంగాణ లోక్ సభ ఎన్నికలలో మొత్తం 17 స్థానాలలో కేవలం రెండు చోట్ల మినహా మిగిలిన 15 స్థానాలలో బీఆర్ఎస్ ఆశలు వదులుకున్న పరిస్థితి నెలకొంది. సామాజిక సమతూకం పాటిస్తూ అభ్యర్థులను ఎంపిక చేసినా కూడా ఈ లోక్ సభ ఎన్నికల్లో ఓటర్లు బీఆర్ఎస్ పార్టీని పరిగణనలోకి తీసుకోలేదని అర్ధమవుతున్నది.
ఈ ఎన్నికలలో నాగర్ కర్నూలు, మెదక్ స్థానాలలో మాత్రమే బీఆర్ఎస్ ప్రభావం చూపగలిగింది. మిగిలిన స్థానాలలో బాగా వెనకబడి పోయింది. మెదక్ లో 3311 ఓట్ల ఆధిక్యంలో ఉండగా, నాగర్ కర్నూలులో 1,25,112 ఓట్లతో మల్లురవి 16,403 ఓట్ల ఆధిక్యంలో ఉండగా, 1,08,709 ఓట్లతో రెండో స్థానంలో, బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 1,02,679 ఓట్లతో మూడోస్థానంలో గట్టి పోటీని ఇస్తున్నాడు. ఇక్కడ జరుగుతున్న ట్రయాంగిల్ పోటీలో ఎవ్వరు గెలిచినా 5 నుండి 15 వేల ఓట్ల మెజారిటీ మాత్రమే ఉండే అవకాశం ఉంది.
ఇవికాకుండా మిగతా స్థానాలలో బీఆర్ఎస్ ఎంతో వెనకబడింది. ఆదిలాబాద్ , భువనగిరి, చేవెళ్ల,హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, మల్కాజ్ గిరి, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, సికింద్రాబాద్, వరంగల్, జహీరాబాద్ లలో మూడో స్థానానికి పార్టీ పరిమితం అయింది.
This post was last modified on June 4, 2024 11:44 am
రెండేళ్ల క్రితం 'ప్రేమలు' విడుదలైనప్పుడు అందులో హీరోకన్నా ఎక్కువ పేరు వచ్చింది మమిత బైజుకే. హుషారైన నటన, జెన్ జీని…
సినీ రంగంలో తమకు అవకాశాలు ఇచ్చిన వాళ్ల మీద కొందరు ఎంతో అభిమానం, కృతజ్ఞత చూపిస్తుంటారు. అందులో ఒక్కొక్కరు ఒక్కో…
చిన్న సినిమాలకు రిలీజ్ రోజు కంటే ఒకటి రెండు రోజుల ముందే పెయిడ్ ప్రిమియర్స్ ఎప్పట్నుంచో చూస్తున్నాం. ఐతే పెద్ద…
బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో నిద్రలేదు.…
ప్రస్తుతం నైజామ్ సింగల్ స్క్రీన్లలో పర్సెంటెజ్ విధానం తీసుకురావడం గురించి టాలీవుడ్ ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు రెండుగా చీలిపోయిన సంగతి తెలిసిందే.…
తెలుగు సినిమా చరిత్రలో ఎంతోమంది దిగ్గజ దర్శకులున్నారు. వారిలో సింగీతం శ్రీనివాసరావుది ప్రత్యేకమైన శైలి. ఆయన చేసినన్ని ప్రయోగాలు ఇండియన్…