Political News

జాతీయ మీడియా స‌ర్వేలే నిజ‌మ‌య్యాయా?

ఏపీలో వ‌చ్చిన ఫ‌లితాన్ని గ‌మ‌నిస్తే…. ఏడో ద‌శ పోలింగ్ అనంతరం.. జాతీయ మీడియా వెల్ల‌డించిన ఎగ్జి ట్ పోల్స్ దాదాపు స‌క్సెస్ అయ్యాయ‌నే మాట వినిపిస్తోంది. రాష్ట్రంలోని 25 పార్ల‌మెంటు స్థానాల్లో కూట‌మి 18-20 స్థానాల వ‌ర‌కు ద‌క్కించుకుంటాయ‌ని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించాయి. అంతేకాదు.. వైసీపీ కేవ‌లం.. 2-4 స్థానాల్లో మాత్రమే పుంజుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. వాస్త‌వానికి ఇదే విష‌యాన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించాయి.

రాష్ట్ర స్థాయిలో చేసిన స‌ర్వేల్లో.. పార్ల‌మెంటుస్థానాల విష‌యంలో కూట‌మికి 14-16 వ‌స్తాయ‌ని చెప్పినా.. జాతీయ మీడియా స‌ర్వేల్లో మాత్రం 20-22 వ‌ర‌కు వ‌స్తాయ‌ని చెప్పాయి. అంతేకాదు.. మ‌రికొన్ని 18-20 వ‌ర‌కు వ‌స్తాయ‌ని తెలిపాయి. అయితే.. వీటిపై వైసీపీ అనుకూల వ‌ర్గాల నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. పైగా.. బీజేపీ ఆరు చోట్ల పోటీ చేయ‌గా.. 4 చోట్లలీడ్‌లో ఉంది. దీంతో ఎగ్జిట్ పోల్స్ విష‌యంలో జాతీయ మీడియా చెప్పింది అక్ష‌ర స‌త్యంగా మారింద‌నే వాద‌న వినిపిస్తోంది.

మ‌రీ ముఖ్యంగా ఆరా మ‌స్తాన్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్ స‌ర్వేపై రోజుల త‌ర‌బ‌డి చ‌ర్చ సాగింది. అంతేకాదు.. పెద్ద ఎత్తున రాజకీయ దుమారం కూడా రేగింది. దీంతో ఆయ‌న స‌ర్వే విష‌యాన్ని ఇప్పుడు ప‌రిశీలిస్తే.. అది ఇప్పుడు దాదాపు ఫెయిల్ అయిపోయింది. అంతేకాదు.. ఆది నుంచి అంద‌రూ అనుకున్న ట‌ఫ్ ఫైట్ కూడా ఎక్క‌డా క‌నిపించ‌లేదు. న‌రాలు తెగే ఉత్కంఠ కూడా.. లేదు. అంతా ఏక‌ప‌క్షంగానే ఓటింగ్ జ‌రిగిపోయింది. దీంతో వైసీపీ శిబిరంలో క‌ళ పోయింది.

This post was last modified on June 4, 2024 11:42 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

2 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

4 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

4 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

4 hours ago

లోకేష్ ఆక‌స్మిక త‌నిఖీ.. టీడీపీలో క‌ల‌వ‌రం!

మంత్రి నారా లోకేష్‌.. మంగ‌ళ‌వారం ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని ఓ పాఠ‌శాల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఈ విష‌యాన్ని అత్యంత గోప్యంగా…

4 hours ago

మా సీఎం స్టాలినే.. త‌మిళ‌నాట ‘ఏపీ పాలిటిక్స్’ రిపీట్‌!

ఏపీకి పొరుగునే ఉన్న త‌మిళ‌నాడులో ఇప్పుడు ఇదే త‌ర‌హా రాజ‌కీయాలు కూడా క‌నిపిస్తున్నాయి. పార్టీలు లెక్క‌కు మిక్కిలిగా ఉన్నా.. నాయ‌కులు…

4 hours ago