ఏపీలో వచ్చిన ఫలితాన్ని గమనిస్తే…. ఏడో దశ పోలింగ్ అనంతరం.. జాతీయ మీడియా వెల్లడించిన ఎగ్జి ట్ పోల్స్ దాదాపు సక్సెస్ అయ్యాయనే మాట వినిపిస్తోంది. రాష్ట్రంలోని 25 పార్లమెంటు స్థానాల్లో కూటమి 18-20 స్థానాల వరకు దక్కించుకుంటాయని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అంతేకాదు.. వైసీపీ కేవలం.. 2-4 స్థానాల్లో మాత్రమే పుంజుకున్నట్టు కనిపిస్తోంది. వాస్తవానికి ఇదే విషయాన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.
రాష్ట్ర స్థాయిలో చేసిన సర్వేల్లో.. పార్లమెంటుస్థానాల విషయంలో కూటమికి 14-16 వస్తాయని చెప్పినా.. జాతీయ మీడియా సర్వేల్లో మాత్రం 20-22 వరకు వస్తాయని చెప్పాయి. అంతేకాదు.. మరికొన్ని 18-20 వరకు వస్తాయని తెలిపాయి. అయితే.. వీటిపై వైసీపీ అనుకూల వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. పైగా.. బీజేపీ ఆరు చోట్ల పోటీ చేయగా.. 4 చోట్లలీడ్లో ఉంది. దీంతో ఎగ్జిట్ పోల్స్ విషయంలో జాతీయ మీడియా చెప్పింది అక్షర సత్యంగా మారిందనే వాదన వినిపిస్తోంది.
మరీ ముఖ్యంగా ఆరా మస్తాన్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్ సర్వేపై రోజుల తరబడి చర్చ సాగింది. అంతేకాదు.. పెద్ద ఎత్తున రాజకీయ దుమారం కూడా రేగింది. దీంతో ఆయన సర్వే విషయాన్ని ఇప్పుడు పరిశీలిస్తే.. అది ఇప్పుడు దాదాపు ఫెయిల్ అయిపోయింది. అంతేకాదు.. ఆది నుంచి అందరూ అనుకున్న టఫ్ ఫైట్ కూడా ఎక్కడా కనిపించలేదు. నరాలు తెగే ఉత్కంఠ కూడా.. లేదు. అంతా ఏకపక్షంగానే ఓటింగ్ జరిగిపోయింది. దీంతో వైసీపీ శిబిరంలో కళ పోయింది.
This post was last modified on June 4, 2024 11:42 am
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
రేపు కొత్త శుక్రవారం వచ్చేస్తోంది. సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తిగా అయిపోవడంతో ఇప్పుడు మూవీ లవర్స్ దృష్టి వీటివైపు వెళ్లాల్సి…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…