Political News

జాతీయ మీడియా స‌ర్వేలే నిజ‌మ‌య్యాయా?

ఏపీలో వ‌చ్చిన ఫ‌లితాన్ని గ‌మ‌నిస్తే…. ఏడో ద‌శ పోలింగ్ అనంతరం.. జాతీయ మీడియా వెల్ల‌డించిన ఎగ్జి ట్ పోల్స్ దాదాపు స‌క్సెస్ అయ్యాయ‌నే మాట వినిపిస్తోంది. రాష్ట్రంలోని 25 పార్ల‌మెంటు స్థానాల్లో కూట‌మి 18-20 స్థానాల వ‌ర‌కు ద‌క్కించుకుంటాయ‌ని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించాయి. అంతేకాదు.. వైసీపీ కేవ‌లం.. 2-4 స్థానాల్లో మాత్రమే పుంజుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. వాస్త‌వానికి ఇదే విష‌యాన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించాయి.

రాష్ట్ర స్థాయిలో చేసిన స‌ర్వేల్లో.. పార్ల‌మెంటుస్థానాల విష‌యంలో కూట‌మికి 14-16 వ‌స్తాయ‌ని చెప్పినా.. జాతీయ మీడియా స‌ర్వేల్లో మాత్రం 20-22 వ‌ర‌కు వ‌స్తాయ‌ని చెప్పాయి. అంతేకాదు.. మ‌రికొన్ని 18-20 వ‌ర‌కు వ‌స్తాయ‌ని తెలిపాయి. అయితే.. వీటిపై వైసీపీ అనుకూల వ‌ర్గాల నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. పైగా.. బీజేపీ ఆరు చోట్ల పోటీ చేయ‌గా.. 4 చోట్లలీడ్‌లో ఉంది. దీంతో ఎగ్జిట్ పోల్స్ విష‌యంలో జాతీయ మీడియా చెప్పింది అక్ష‌ర స‌త్యంగా మారింద‌నే వాద‌న వినిపిస్తోంది.

మ‌రీ ముఖ్యంగా ఆరా మ‌స్తాన్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్ స‌ర్వేపై రోజుల త‌ర‌బ‌డి చ‌ర్చ సాగింది. అంతేకాదు.. పెద్ద ఎత్తున రాజకీయ దుమారం కూడా రేగింది. దీంతో ఆయ‌న స‌ర్వే విష‌యాన్ని ఇప్పుడు ప‌రిశీలిస్తే.. అది ఇప్పుడు దాదాపు ఫెయిల్ అయిపోయింది. అంతేకాదు.. ఆది నుంచి అంద‌రూ అనుకున్న ట‌ఫ్ ఫైట్ కూడా ఎక్క‌డా క‌నిపించ‌లేదు. న‌రాలు తెగే ఉత్కంఠ కూడా.. లేదు. అంతా ఏక‌ప‌క్షంగానే ఓటింగ్ జ‌రిగిపోయింది. దీంతో వైసీపీ శిబిరంలో క‌ళ పోయింది.

This post was last modified on June 4, 2024 11:42 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

42 minutes ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

1 hour ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

3 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

8 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

8 hours ago