ఏపీలో వచ్చిన ఫలితాన్ని గమనిస్తే…. ఏడో దశ పోలింగ్ అనంతరం.. జాతీయ మీడియా వెల్లడించిన ఎగ్జి ట్ పోల్స్ దాదాపు సక్సెస్ అయ్యాయనే మాట వినిపిస్తోంది. రాష్ట్రంలోని 25 పార్లమెంటు స్థానాల్లో కూటమి 18-20 స్థానాల వరకు దక్కించుకుంటాయని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అంతేకాదు.. వైసీపీ కేవలం.. 2-4 స్థానాల్లో మాత్రమే పుంజుకున్నట్టు కనిపిస్తోంది. వాస్తవానికి ఇదే విషయాన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.
రాష్ట్ర స్థాయిలో చేసిన సర్వేల్లో.. పార్లమెంటుస్థానాల విషయంలో కూటమికి 14-16 వస్తాయని చెప్పినా.. జాతీయ మీడియా సర్వేల్లో మాత్రం 20-22 వరకు వస్తాయని చెప్పాయి. అంతేకాదు.. మరికొన్ని 18-20 వరకు వస్తాయని తెలిపాయి. అయితే.. వీటిపై వైసీపీ అనుకూల వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. పైగా.. బీజేపీ ఆరు చోట్ల పోటీ చేయగా.. 4 చోట్లలీడ్లో ఉంది. దీంతో ఎగ్జిట్ పోల్స్ విషయంలో జాతీయ మీడియా చెప్పింది అక్షర సత్యంగా మారిందనే వాదన వినిపిస్తోంది.
మరీ ముఖ్యంగా ఆరా మస్తాన్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్ సర్వేపై రోజుల తరబడి చర్చ సాగింది. అంతేకాదు.. పెద్ద ఎత్తున రాజకీయ దుమారం కూడా రేగింది. దీంతో ఆయన సర్వే విషయాన్ని ఇప్పుడు పరిశీలిస్తే.. అది ఇప్పుడు దాదాపు ఫెయిల్ అయిపోయింది. అంతేకాదు.. ఆది నుంచి అందరూ అనుకున్న టఫ్ ఫైట్ కూడా ఎక్కడా కనిపించలేదు. నరాలు తెగే ఉత్కంఠ కూడా.. లేదు. అంతా ఏకపక్షంగానే ఓటింగ్ జరిగిపోయింది. దీంతో వైసీపీ శిబిరంలో కళ పోయింది.
This post was last modified on June 4, 2024 11:42 am
తెలుగుదేశం పార్టీ నేతలకు సీఎం, పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు మీ…
గత వారం రోజులకు పైగా తిరుగుతున్న లీకులకు అధికారిక ముద్ర పడిపోయింది. టాక్సిక్ జూన్ 4 నుంచి వాయిదా వేస్తున్నట్టు…
నవ్యాంద్రప్రదేశ్ లో అధికార కూటమి రథ సారథి తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో బుదవారం నుంచి నవ శకం మొదలు…
లెనిన్ గురించి అప్డేట్స్ లేక అసహనానికి గురవుతున్న అభిమానులకు ఊరట కలిగిస్తూ నాగార్జున ట్వీట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్…
ఈ శుక్రవారం మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తోంది ‘గాయపడ్డ సింహం’. డైరెక్టర్ టర్న్డ్ యాక్టర్ తరుణ్ భాస్కర్…
బిగ్ బాస్ ఫేమ్ ఆషు రెడ్డి పేరు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో మార్మోగుతున్న సంగతి తెలిసిందే. లండన్కు…