ఏపీలో వచ్చిన ఫలితాన్ని గమనిస్తే…. ఏడో దశ పోలింగ్ అనంతరం.. జాతీయ మీడియా వెల్లడించిన ఎగ్జి ట్ పోల్స్ దాదాపు సక్సెస్ అయ్యాయనే మాట వినిపిస్తోంది. రాష్ట్రంలోని 25 పార్లమెంటు స్థానాల్లో కూటమి 18-20 స్థానాల వరకు దక్కించుకుంటాయని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అంతేకాదు.. వైసీపీ కేవలం.. 2-4 స్థానాల్లో మాత్రమే పుంజుకున్నట్టు కనిపిస్తోంది. వాస్తవానికి ఇదే విషయాన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.
రాష్ట్ర స్థాయిలో చేసిన సర్వేల్లో.. పార్లమెంటుస్థానాల విషయంలో కూటమికి 14-16 వస్తాయని చెప్పినా.. జాతీయ మీడియా సర్వేల్లో మాత్రం 20-22 వరకు వస్తాయని చెప్పాయి. అంతేకాదు.. మరికొన్ని 18-20 వరకు వస్తాయని తెలిపాయి. అయితే.. వీటిపై వైసీపీ అనుకూల వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. పైగా.. బీజేపీ ఆరు చోట్ల పోటీ చేయగా.. 4 చోట్లలీడ్లో ఉంది. దీంతో ఎగ్జిట్ పోల్స్ విషయంలో జాతీయ మీడియా చెప్పింది అక్షర సత్యంగా మారిందనే వాదన వినిపిస్తోంది.
మరీ ముఖ్యంగా ఆరా మస్తాన్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్ సర్వేపై రోజుల తరబడి చర్చ సాగింది. అంతేకాదు.. పెద్ద ఎత్తున రాజకీయ దుమారం కూడా రేగింది. దీంతో ఆయన సర్వే విషయాన్ని ఇప్పుడు పరిశీలిస్తే.. అది ఇప్పుడు దాదాపు ఫెయిల్ అయిపోయింది. అంతేకాదు.. ఆది నుంచి అందరూ అనుకున్న టఫ్ ఫైట్ కూడా ఎక్కడా కనిపించలేదు. నరాలు తెగే ఉత్కంఠ కూడా.. లేదు. అంతా ఏకపక్షంగానే ఓటింగ్ జరిగిపోయింది. దీంతో వైసీపీ శిబిరంలో కళ పోయింది.
This post was last modified on June 4, 2024 11:42 am
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
గత ఏడాది లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ మీట్లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం…