Political News

జాతీయ మీడియా స‌ర్వేలే నిజ‌మ‌య్యాయా?

ఏపీలో వ‌చ్చిన ఫ‌లితాన్ని గ‌మ‌నిస్తే…. ఏడో ద‌శ పోలింగ్ అనంతరం.. జాతీయ మీడియా వెల్ల‌డించిన ఎగ్జి ట్ పోల్స్ దాదాపు స‌క్సెస్ అయ్యాయ‌నే మాట వినిపిస్తోంది. రాష్ట్రంలోని 25 పార్ల‌మెంటు స్థానాల్లో కూట‌మి 18-20 స్థానాల వ‌ర‌కు ద‌క్కించుకుంటాయ‌ని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించాయి. అంతేకాదు.. వైసీపీ కేవ‌లం.. 2-4 స్థానాల్లో మాత్రమే పుంజుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. వాస్త‌వానికి ఇదే విష‌యాన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించాయి.

రాష్ట్ర స్థాయిలో చేసిన స‌ర్వేల్లో.. పార్ల‌మెంటుస్థానాల విష‌యంలో కూట‌మికి 14-16 వ‌స్తాయ‌ని చెప్పినా.. జాతీయ మీడియా స‌ర్వేల్లో మాత్రం 20-22 వ‌ర‌కు వ‌స్తాయ‌ని చెప్పాయి. అంతేకాదు.. మ‌రికొన్ని 18-20 వ‌ర‌కు వ‌స్తాయ‌ని తెలిపాయి. అయితే.. వీటిపై వైసీపీ అనుకూల వ‌ర్గాల నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. పైగా.. బీజేపీ ఆరు చోట్ల పోటీ చేయ‌గా.. 4 చోట్లలీడ్‌లో ఉంది. దీంతో ఎగ్జిట్ పోల్స్ విష‌యంలో జాతీయ మీడియా చెప్పింది అక్ష‌ర స‌త్యంగా మారింద‌నే వాద‌న వినిపిస్తోంది.

మ‌రీ ముఖ్యంగా ఆరా మ‌స్తాన్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్ స‌ర్వేపై రోజుల త‌ర‌బ‌డి చ‌ర్చ సాగింది. అంతేకాదు.. పెద్ద ఎత్తున రాజకీయ దుమారం కూడా రేగింది. దీంతో ఆయ‌న స‌ర్వే విష‌యాన్ని ఇప్పుడు ప‌రిశీలిస్తే.. అది ఇప్పుడు దాదాపు ఫెయిల్ అయిపోయింది. అంతేకాదు.. ఆది నుంచి అంద‌రూ అనుకున్న ట‌ఫ్ ఫైట్ కూడా ఎక్క‌డా క‌నిపించ‌లేదు. న‌రాలు తెగే ఉత్కంఠ కూడా.. లేదు. అంతా ఏక‌ప‌క్షంగానే ఓటింగ్ జ‌రిగిపోయింది. దీంతో వైసీపీ శిబిరంలో క‌ళ పోయింది.

This post was last modified on June 4, 2024 11:42 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రాంతీయ పార్టీల్లో టీడీపీదే అగ్రస్థానం

దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…

3 minutes ago

‘పాదయాత్ర చేసినా వైఎస్ వారసులు కాలేరు’

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పాద‌యాత్ర…

18 minutes ago

ఈ బీజేపీ ఎంపీకి ఏమైంది?

ధర్మపురి అరవింద్.. తండ్రి కాంగ్రెస్ పార్టీతో ఉన్నా తాను మాత్రం బీజేపీలో సొంతంగా ఎంపీ స్థాయికి ఎదిగిన నేత. బీఆర్ఎస్…

41 minutes ago

కొణిదెల నిహారిక: ఫ్రేమ్ మారినా, గ్లామర్ మాత్రం అలాగే..

యాంకర్‌గా మొదలై, హీరోయిన్‌గా తెరపై కనిపించి, ఇప్పుడు నిర్మాతగా మారింది నిహారిక కొణిదెల. ప్రతి దశలోనూ కొత్తగా ట్రై చేస్తూనే…

42 minutes ago

తారక్ అభిమానులు లైట్ తీసుకున్నారు

స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎమోషన్స్ క్యాష్ చేసుకోవడానికి ఈ మధ్య డిస్ట్రిబ్యూటర్లు వాడుతున్న ఆయుధం రీ రిలీజులు. ఏదో కొత్త…

4 hours ago

బీజేపీ కేంద్ర మంత్రికి కాంగ్రెస్ ఎంపీ మద్దతు

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఫ్యామిలీ ఇప్పుడు పెను వివాదంలో చిక్కుకుంది. మంత్రి కుమారుడు బండి భగీరథ్ ఓ…

4 hours ago