పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ జోరు చూపిస్తున్నారు. ఇక్కడ రెండో రౌండ్ ముగిసిన తర్వాత పవన్ 8500 ఓట్ల లీడ్లో ఉన్నారు. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధిక్యంలో ఉన్నారు. 1549 ఓట్లతో లీడింగ్లో కొనసాగుతున్నారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థి భరత్ వెనుకంజలో ఉన్నారు. పులివెందులలో జగన్ ఆధిక్యంలో కొనసాగుతున్నాడు.
2004 నుండి గుడివాడ ఎమ్మెల్యేగా రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న కొడాలి నాని తాజాగా ఓట్ల లెక్కింపులో వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి 13 వేల ఓట్ల ఆధిక్యంలో ఉండడం విశేషం. మంత్రి రోజా నగరిలో వెనకంజలో ఉన్నారు. రాజమండ్రిలో ఎంపీ అభ్యర్థి పురంధేశ్వరి, మంగళగిరిలో నారా లోకేష్ ముందజంలో ఉన్నారు. 90 స్థానాలలో టీడీపీ, 20 స్థానాలలో వైసీపీ, జనసేన 12, బీజేపీ 5 స్థానాలలో అధిక్యంలో కొనసాగుతున్నాయి.
రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాలలో టీడీపీ కూటమి స్పష్టమయిన ఆధిక్యం ప్రదర్శిస్తున్నది. జనసేన 9 చోట్ల ఆధిక్యం ప్రదర్శిస్తున్న నేపథ్యంలో టీడీపీ ఓట్లు జనసేన అభ్యర్థులకు పడ్డాయని అర్ధం అవుతున్నది.
This post was last modified on June 4, 2024 9:54 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…