Political News

బాబు.. పవన్.. లోకేశ్.. బాలయ్య.. అందరూ ముందుకే

తొలి గంట గడిచింది. హోరాహోరీగా సాగిన ఏపీ ఎన్నికల విషయానికి వస్తే.. ఓట్ల లెక్కింపు మొదలైన మొదటి గంట పూర్తి అయ్యే నాటికి ఫలితాల తీరు ఎలా ఉంటుందన్న దానిపై ఒక అవగాహన వచ్చినట్లుగా చెప్పాలి. మొదటి గంటలో ఏపీ అధికారపక్షం.. అప్పటివరకు వెల్లడైన అధిక్యతల్లో ఏ ఒక్క స్థానంలోనూ ముందుకు లేకపోవటం గమనార్హం. అదే సమయంలో విపక్ష టీడీపీ.. జనసేన.. బీజేపీలు ముందంజలో ఉన్నాయి. ఇదే తీరు.. ఏపీ లోక్ సభ స్థానాల విషయంలోనూ కనిపిస్తోంది. టీడీపీ.. జనసేన.. బీజేపీలు ముందంజలో ఉండగా.. వైసీపీ ఒక్క స్థానంలోనూ అధిక్యతను ప్రదర్శించని పరిస్థితి.

ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు తీవ్రమైన ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నట్లుగా కొన్ని కథనాలు వెలువడ్డాయి. అయితే.. ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం చంద్రబాబు.. పవన్ కల్యాణ్ లకు మంచి మెజార్టీ ఖాయమని చెప్పటం తెలిసిందే. చంద్రబాబు కుమారుడు లోకేశ్ సైతం ఈసారి గెలుపు ఖాయమని అంచనాలు వ్యక్తమయ్యాయి.

అందుకు తగ్గట్లే.. తాజాగా వెల్లడవుతున్న ఫలితాలు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కౌంటింగ్ మొదలైన మొదటి గంట గడిచేసరికి.. చంద్రబాబు.. పవన్ కల్యాణ్.. లోకేశ్ తో పాటు.. టీడీపీకి చెందిన పలువురు ప్రముఖులు.. బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా అధిక్యతలో నిలిచారు. షాకింగ్ అంశం ఏమంటే.. ఏపీ మంత్రులు ఎవరూ కూడా ఇప్పటివరకు అధిక్యతలో లేరు. వారు తిరుగమనంలో ఉన్నట్లుగా చెబుతున్నారు. దీనికి తోడు అధికార వైసీపీ ఇప్పటివరకు అధిక్యతకు సంబంధించి ఒక్క స్థానంలోనూ లేకపోవటం షాకింగ్ గా మారింది.

This post was last modified on June 4, 2024 9:31 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నానిని టార్గెట్ చేయడం రైటేనా

సెలబ్రిటీలు ఏదైనా విషయం గురించి స్పందిస్తే చాలు దాన్ని చిలవలు పలవలు చేయడానికో టీమ్ సోషల్ మీడియాలో రెడీగా ఉంటుంది.…

1 hour ago

ఎటెటో వెళ్తున్న జన నాయకుడు గొడవ

సినిమా విడుదల ఎప్పుడో తేలకుండానే పైరసీ బారిన పడిన జన నాయకుడు గొడవ రకరకాల మలుపులు తిరుగుతోంది. ముందు లాయర్ తరపున…

2 hours ago

తేడా కొడుతోంది అనిరుధ్ భాయ్

సౌత్ మ్యూజిక్ లో సెన్సేషన్ అంటే అనిరుధ్ రవిచందర్ పేరే ముందు గుర్తొస్తుంది. తను పని చేస్తున్నాడని తెలిస్తే చాలు…

3 hours ago

బీఆర్ఎస్‌లో పూర్తి ప్ర‌క్షాళ‌న… కారణమేంటి?

తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…

3 hours ago

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

6 hours ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

6 hours ago