ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత.. తొలి రౌండ్లలో 36 స్థానాలను ప్రకటించే సరికి వైసీపీకి ఒక్క సీటులో మాత్రమే లీడ్ కనిపించింది. 2019 ఎన్నికల్లో తొలి రౌండ్ నుంచి కూడా వైసీపీ దూకుడు ప్రదర్శించింది. పైగా.. వేల సంఖ్యలో లీడ్ కూటమి వైపు కనిపిస్తుండడం గమనార్హం. ఈ పరిణామం గమనిస్తే.. వైసీపీ వైపు ప్రజలు తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కూట మి దూకుడు ప్రదర్శించినట్టు స్పష్టంగా కనిపిస్తోంది.
ఇలా.. రౌండ్లు ముందుకు సాగుతున్న కొద్దీకూటమి అభ్యర్థులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. నిజానికి గత ఎన్నికల్లో కడప, అనంతపురంలో మాత్రం టీడీపీ దూకుడు కనిపించలేదు. ఇప్పుడు వచ్చిన ట్రెండ్స్తో పోలిస్తే… టీడీపీ దూసుకుపోతోంది. జనసేన పార్టీలో ఇద్దరు అగ్రనేతలు కూడా లీడ్లో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ 28 స్థానాల్లో లీడ్లో ఉంది. ఈ పరిణామాలు గమనిస్తే.. కూటమి ఏకపక్షంగా దూసుకుపోతుం డడం గమనార్హం.
పిఠాపురంలో..
పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్.. లీడ్లో ఉన్నారు. తొలి రెండు రౌండ్లు.. దాటే సరికి.. 4 వేల 500 ఓట్ల లీడ్లో కొనసాగుతున్నారు. వంగాగీతకు ఇంకా బోణీ పడలేదు. కూటమికి 35 స్థానాలు దక్కే అవకా శం కనిపిస్తోంది. ఈ పరిణామాలు గమనిస్తే.. పిఠాపురం సహా తెనాలిలో జనసేన అభ్యర్థి దూసుకుపోతు న్నారు. కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత.. గంట సమయం వరకు లీడ్లు కూటమి వైపే ఉండడంతో గెలుపుపై ధీమా దిశగా కూటమి అభ్యర్థులు సంబరాలు చేసుకునేందుకు రెడీ అవుతున్నారు.
This post was last modified on June 4, 2024 9:26 am
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…