ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత.. తొలి రౌండ్లలో 36 స్థానాలను ప్రకటించే సరికి వైసీపీకి ఒక్క సీటులో మాత్రమే లీడ్ కనిపించింది. 2019 ఎన్నికల్లో తొలి రౌండ్ నుంచి కూడా వైసీపీ దూకుడు ప్రదర్శించింది. పైగా.. వేల సంఖ్యలో లీడ్ కూటమి వైపు కనిపిస్తుండడం గమనార్హం. ఈ పరిణామం గమనిస్తే.. వైసీపీ వైపు ప్రజలు తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కూట మి దూకుడు ప్రదర్శించినట్టు స్పష్టంగా కనిపిస్తోంది.
ఇలా.. రౌండ్లు ముందుకు సాగుతున్న కొద్దీకూటమి అభ్యర్థులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. నిజానికి గత ఎన్నికల్లో కడప, అనంతపురంలో మాత్రం టీడీపీ దూకుడు కనిపించలేదు. ఇప్పుడు వచ్చిన ట్రెండ్స్తో పోలిస్తే… టీడీపీ దూసుకుపోతోంది. జనసేన పార్టీలో ఇద్దరు అగ్రనేతలు కూడా లీడ్లో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ 28 స్థానాల్లో లీడ్లో ఉంది. ఈ పరిణామాలు గమనిస్తే.. కూటమి ఏకపక్షంగా దూసుకుపోతుం డడం గమనార్హం.
పిఠాపురంలో..
పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్.. లీడ్లో ఉన్నారు. తొలి రెండు రౌండ్లు.. దాటే సరికి.. 4 వేల 500 ఓట్ల లీడ్లో కొనసాగుతున్నారు. వంగాగీతకు ఇంకా బోణీ పడలేదు. కూటమికి 35 స్థానాలు దక్కే అవకా శం కనిపిస్తోంది. ఈ పరిణామాలు గమనిస్తే.. పిఠాపురం సహా తెనాలిలో జనసేన అభ్యర్థి దూసుకుపోతు న్నారు. కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత.. గంట సమయం వరకు లీడ్లు కూటమి వైపే ఉండడంతో గెలుపుపై ధీమా దిశగా కూటమి అభ్యర్థులు సంబరాలు చేసుకునేందుకు రెడీ అవుతున్నారు.
This post was last modified on June 4, 2024 9:26 am
బాలీవుడ్లో బలమైన ముద్ర వేసిన దక్షిణాది దర్శకుల్లో ప్రియదర్శన్ ఒకరు. ఆయన అక్కడ ఎన్నో కామెడీ సినిమాలు తీసి హిట్లు…
నాలుగు నెలల నుంచి విజయ్ అభిమానులు ఎదురు చూస్తున్న జన నాయకుడు వ్యవహారాలు మెల్లగా ఒక్కొక్కటి కొలిక్కి వస్తున్నాయి. మే…
జెట్లీ ఫలితం ఏమైందనేది కాసేపు పక్కనపెడితే కమెడియన్ సత్య క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఏంటో నిన్న ఓపెనింగ్స్ తో అర్థమయ్యింది.…
జనసేన అధినేత,ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను సీఎం చంద్రబాబు పరామర్శించారు. కొన్నాళ్ల కిందట ముక్కుకు ఆపరేషన్ అయిన నేపథ్యంలో…
రెండేళ్ల క్రితం 'ప్రేమలు' విడుదలైనప్పుడు అందులో హీరోకన్నా ఎక్కువ పేరు వచ్చింది మమిత బైజుకే. హుషారైన నటన, జెన్ జీని…
సినీ రంగంలో తమకు అవకాశాలు ఇచ్చిన వాళ్ల మీద కొందరు ఎంతో అభిమానం, కృతజ్ఞత చూపిస్తుంటారు. అందులో ఒక్కొక్కరు ఒక్కో…