ఏపీలో ప్రారంభమైన ఓట్ల కౌంటింగ్.. వేగంగా సాగుతోంది. కొన్ని చోట్ల ఈవీఎంలను ముందుగా లెక్కిస్తుండ గా.. మరికొన్ని చోట్ల పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తున్నారు. మొత్తంగా చూస్తే.. రాష్ట్ర వ్యాప్తగా కౌంటింగ్ కొనసాగు తోంది. తొలి అరగంటలోనే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన నేతల లీడ్ కొనసాగుతోంది. రాజమండ్రి రూరల్లో టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కుప్పంలో చంద్రబాబు, నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి పొంగూరు నారాయణ లీడ్లో ఉన్నారు.
రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి, నరసారావుపేట పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయులు లీడ్లో ఉన్నారు. మొత్తంగా చూసినా.. ఏపీలో కూటమి లీడ్లో కొనసాగుతోంది. తూర్పు గోదావరిలో కూటమి ఆధిక్యత స్పష్టంగా కనిపిస్తోంది. విజయనగరం నుంచి కూడా కూటమి అభ్యర్థి, టీడీపీ నేత శ్రీనివాసరావు ట్రెండ్లో ఉన్నారు. సో.. రాష్ట్రంలో కూటమి లీడ్లో కనిపిస్తోంది.
నిజానికి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలో కూటమి లీడ్లో ఉండడాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే.. వైసీపీకి బలమైన నెల్లూరు జిల్లాలోనూ కూటమి పుంజుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరోవైపు కర్నూలు జిల్లాలోని నంద్యాల పార్లమెంటు, పాణ్యం అసెంబ్లీ నియోజకవ ర్గంలోనూ.. కూటమి లీడ్లో కొనసాగుతోంది. నిజానికి తొలి ట్రెండ్లోనే.. కూటమి దూకుడు ప్రదర్శిస్తుం డడం గమనార్హం. దీనిని బట్టి కూటమి దూకుడు కొనసాగుతుందని తెలుస్తోంది.
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…