Political News

ఏపీలో షాకింగ్‌: ఎమ్మెల్సీ పై అన‌ర్హ‌త వేటు

ఏపీలో కీల‌క‌మైన ఓట్ల లెక్కింపున‌కు ముందు.. సంచ‌ల‌న సంఘ‌ట‌న చోటు చేసుకుంది. వైసీపీకి చెందిన స్థానిక సంస్థ‌ల ఎమ్మె ల్సీ ఇందుకూరి ర‌ఘురాజుపై శాస‌న మండ‌లి చైర్మ‌న్ మోషేన్ రాజు అన‌ర్హ‌త వేటు వేశారు. ఆయ‌న‌ పై వ‌చ్చిన అభియోగాల‌ను అన్ని కోణాల్లోనూ ప‌రిశీలించిన త‌ర్వాత‌.. ఈమేర‌కు నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు మోషేన్ రాజు తెలిపారు.

ఈ మేర‌కు శాస‌న మండ‌లి సెక్ర‌టేరియెట్ ఉత్త‌ర్వులు జారీ చేసింది. పార్టీ ఫిరాయింపుల చ‌ట్టం మేర‌కు.. ఇందుకూరి ర‌ఘురాజును అన‌ర్హుడిగా ప్ర‌క‌టిస్తున్న‌ట్టు తెలిపారు. దీంతో 2021లో మండ‌లికి ఎన్నికైన ర‌ఘురాజుకు స‌భ్య‌త్వం పోయిన‌ట్టు అయింది.

ఏం జ‌రిగింది?

విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన ఇందుకూరి ర‌ఘురాజు ఆది నుంచి వైసీపీలో ఉన్నారు. 2019లో పార్టీ విజ‌యం కోసం క‌ష్ట‌ప‌డి ప‌నిచేశారు. ఈ నేప‌థ్యంలోనే 2021లో జ‌రిగిన స్థానిక సంస్థ‌ల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ఆయ‌న‌కు పోటీ చేసే అవ‌కాశం ఇచ్చారు. ఈ క్ర‌మంలో కొంద‌రిని ప‌క్క‌న పెట్టి మ‌రీ రాజుకు ఛాన్స్ ఇచ్చార‌ని వైసీపీ నాయ‌కులు అప్ప‌ట్లో అలిగారు. అయితే.. ర‌ఘురాజు.. ఈ ఏడాది మార్చిలో త‌న స‌తీమ‌ణి ఇందుకూరి సుధారాణితో స‌హా 15 మంది జెడ్పీటీసీలు, 15 మంది సర్పంచుల‌తో స‌హా.. వైసీపీ నుంచి జంప్ చేసి టీడీపీలో చేరిపోయారు.

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ స‌మ‌క్షంలో ఇందుకూరి దంప‌తులు ప‌సుపు కండువా క‌ప్పుకొన్నారు. ఈ నేప‌థ్యంలో ర‌ఘురాజుపై అనర్హ‌త వేటు వేయాల‌ని వైసీపీ నాయ‌కుడు, మండ‌లిలో విప్‌గా ఉన్న పాల‌వ‌ల‌స విక్రాంత్ మండ‌లి చైర్మ‌న్ మోషేన్ రాజుకు ద‌ర‌ఖాస్తు చేశారు. ప‌లు దఫాలుగా దీనిపై విచార‌ణ చేసిన మోషేన్ రాజు ఓట్ల కౌంటింగ్‌కు ముందు రోజు సోమ‌వారం.. నిర్ణ‌యం ప్ర‌క‌టించారు. ఇందుకూరి ర‌ఘురాజును అన‌ర్హుడిగా ప్ర‌క‌టిస్తున్న‌ట్టు ఉత్త‌ర్వులు జారీ చేశారు. ప్ర‌జాప్రాతినిధ్య చ‌ట్టంలోని పార్టీ ఫిరాయింపుల స‌బ్జెక్ట్ మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు వివ‌రించారు.

అదేవిధంగా టీడీపీలో చేరిన త‌ర్వాత‌.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌హా వైసీపీకి చెందిన ప‌లువురు ముఖ్య నాయ‌కుల‌పైనా ర‌ఘురాజు తీవ్ర విమ‌ర్శ‌లు చేశార‌ని.. ఇవ‌న్నీ ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్ మీడియాల్లోనూ వ‌చ్చాయ‌ని.. ఈ నేప‌థ్యంలో వాటిని కూడా ప‌రిశీలించి నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు మండ‌లి చైర్మ‌న్ మోషేన్ రాజు పేర్కొన్నారు. అదేవిధంగా వైసీపీ అభ్య‌ర్థిగా ఉంటూ.. టీడీపీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నార‌ని.. దీనికి త‌గిన ఆధారాలు కూడా ఉన్నాయ‌ని తెలిపారు. ఇలా.. 33 పేజీల‌తో కూడిన ఉత్త‌ర్వుల‌ను మోషేన్ రాజు విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on June 4, 2024 7:14 am

Share
Show comments
Published by
Satya
Tags: YCP

Recent Posts

టాక్సిక్ అయోమయం ఇంకొకరికి వరం

కెజిఎఫ్ తర్వాత చాలా పెద్ద గ్యాప్ తీసుకున్న హీరో యష్ ఏరికోరి చేస్తున్న ప్యాన్ ఇండియా మూవీ టాక్సిక్. ఇలాంటి…

3 minutes ago

నానిని టార్గెట్ చేయడం రైటేనా

సెలబ్రిటీలు ఏదైనా విషయం గురించి స్పందిస్తే చాలు దాన్ని చిలవలు పలవలు చేయడానికో టీమ్ సోషల్ మీడియాలో రెడీగా ఉంటుంది.…

3 hours ago

ఎటెటో వెళ్తున్న జన నాయకుడు గొడవ

సినిమా విడుదల ఎప్పుడో తేలకుండానే పైరసీ బారిన పడిన జన నాయకుడు గొడవ రకరకాల మలుపులు తిరుగుతోంది. ముందు లాయర్ తరపున…

4 hours ago

తేడా కొడుతోంది అనిరుధ్ భాయ్

సౌత్ మ్యూజిక్ లో సెన్సేషన్ అంటే అనిరుధ్ రవిచందర్ పేరే ముందు గుర్తొస్తుంది. తను పని చేస్తున్నాడని తెలిస్తే చాలు…

4 hours ago

బీఆర్ఎస్‌లో పూర్తి ప్ర‌క్షాళ‌న… కారణమేంటి?

తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…

4 hours ago

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

7 hours ago