Political News

ఏపీలో షాకింగ్‌: ఎమ్మెల్సీ పై అన‌ర్హ‌త వేటు

ఏపీలో కీల‌క‌మైన ఓట్ల లెక్కింపున‌కు ముందు.. సంచ‌ల‌న సంఘ‌ట‌న చోటు చేసుకుంది. వైసీపీకి చెందిన స్థానిక సంస్థ‌ల ఎమ్మె ల్సీ ఇందుకూరి ర‌ఘురాజుపై శాస‌న మండ‌లి చైర్మ‌న్ మోషేన్ రాజు అన‌ర్హ‌త వేటు వేశారు. ఆయ‌న‌ పై వ‌చ్చిన అభియోగాల‌ను అన్ని కోణాల్లోనూ ప‌రిశీలించిన త‌ర్వాత‌.. ఈమేర‌కు నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు మోషేన్ రాజు తెలిపారు.

ఈ మేర‌కు శాస‌న మండ‌లి సెక్ర‌టేరియెట్ ఉత్త‌ర్వులు జారీ చేసింది. పార్టీ ఫిరాయింపుల చ‌ట్టం మేర‌కు.. ఇందుకూరి ర‌ఘురాజును అన‌ర్హుడిగా ప్ర‌క‌టిస్తున్న‌ట్టు తెలిపారు. దీంతో 2021లో మండ‌లికి ఎన్నికైన ర‌ఘురాజుకు స‌భ్య‌త్వం పోయిన‌ట్టు అయింది.

ఏం జ‌రిగింది?

విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన ఇందుకూరి ర‌ఘురాజు ఆది నుంచి వైసీపీలో ఉన్నారు. 2019లో పార్టీ విజ‌యం కోసం క‌ష్ట‌ప‌డి ప‌నిచేశారు. ఈ నేప‌థ్యంలోనే 2021లో జ‌రిగిన స్థానిక సంస్థ‌ల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ఆయ‌న‌కు పోటీ చేసే అవ‌కాశం ఇచ్చారు. ఈ క్ర‌మంలో కొంద‌రిని ప‌క్క‌న పెట్టి మ‌రీ రాజుకు ఛాన్స్ ఇచ్చార‌ని వైసీపీ నాయ‌కులు అప్ప‌ట్లో అలిగారు. అయితే.. ర‌ఘురాజు.. ఈ ఏడాది మార్చిలో త‌న స‌తీమ‌ణి ఇందుకూరి సుధారాణితో స‌హా 15 మంది జెడ్పీటీసీలు, 15 మంది సర్పంచుల‌తో స‌హా.. వైసీపీ నుంచి జంప్ చేసి టీడీపీలో చేరిపోయారు.

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ స‌మ‌క్షంలో ఇందుకూరి దంప‌తులు ప‌సుపు కండువా క‌ప్పుకొన్నారు. ఈ నేప‌థ్యంలో ర‌ఘురాజుపై అనర్హ‌త వేటు వేయాల‌ని వైసీపీ నాయ‌కుడు, మండ‌లిలో విప్‌గా ఉన్న పాల‌వ‌ల‌స విక్రాంత్ మండ‌లి చైర్మ‌న్ మోషేన్ రాజుకు ద‌ర‌ఖాస్తు చేశారు. ప‌లు దఫాలుగా దీనిపై విచార‌ణ చేసిన మోషేన్ రాజు ఓట్ల కౌంటింగ్‌కు ముందు రోజు సోమ‌వారం.. నిర్ణ‌యం ప్ర‌క‌టించారు. ఇందుకూరి ర‌ఘురాజును అన‌ర్హుడిగా ప్ర‌క‌టిస్తున్న‌ట్టు ఉత్త‌ర్వులు జారీ చేశారు. ప్ర‌జాప్రాతినిధ్య చ‌ట్టంలోని పార్టీ ఫిరాయింపుల స‌బ్జెక్ట్ మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు వివ‌రించారు.

అదేవిధంగా టీడీపీలో చేరిన త‌ర్వాత‌.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌హా వైసీపీకి చెందిన ప‌లువురు ముఖ్య నాయ‌కుల‌పైనా ర‌ఘురాజు తీవ్ర విమ‌ర్శ‌లు చేశార‌ని.. ఇవ‌న్నీ ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్ మీడియాల్లోనూ వ‌చ్చాయ‌ని.. ఈ నేప‌థ్యంలో వాటిని కూడా ప‌రిశీలించి నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు మండ‌లి చైర్మ‌న్ మోషేన్ రాజు పేర్కొన్నారు. అదేవిధంగా వైసీపీ అభ్య‌ర్థిగా ఉంటూ.. టీడీపీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నార‌ని.. దీనికి త‌గిన ఆధారాలు కూడా ఉన్నాయ‌ని తెలిపారు. ఇలా.. 33 పేజీల‌తో కూడిన ఉత్త‌ర్వుల‌ను మోషేన్ రాజు విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on June 4, 2024 7:14 am

Share
Show comments
Published by
Satya
Tags: YCP

Recent Posts

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

13 minutes ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

1 hour ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

2 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

3 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

5 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

7 hours ago