Political News

ఏపీలో షాకింగ్‌: ఎమ్మెల్సీ పై అన‌ర్హ‌త వేటు

ఏపీలో కీల‌క‌మైన ఓట్ల లెక్కింపున‌కు ముందు.. సంచ‌ల‌న సంఘ‌ట‌న చోటు చేసుకుంది. వైసీపీకి చెందిన స్థానిక సంస్థ‌ల ఎమ్మె ల్సీ ఇందుకూరి ర‌ఘురాజుపై శాస‌న మండ‌లి చైర్మ‌న్ మోషేన్ రాజు అన‌ర్హ‌త వేటు వేశారు. ఆయ‌న‌ పై వ‌చ్చిన అభియోగాల‌ను అన్ని కోణాల్లోనూ ప‌రిశీలించిన త‌ర్వాత‌.. ఈమేర‌కు నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు మోషేన్ రాజు తెలిపారు.

ఈ మేర‌కు శాస‌న మండ‌లి సెక్ర‌టేరియెట్ ఉత్త‌ర్వులు జారీ చేసింది. పార్టీ ఫిరాయింపుల చ‌ట్టం మేర‌కు.. ఇందుకూరి ర‌ఘురాజును అన‌ర్హుడిగా ప్ర‌క‌టిస్తున్న‌ట్టు తెలిపారు. దీంతో 2021లో మండ‌లికి ఎన్నికైన ర‌ఘురాజుకు స‌భ్య‌త్వం పోయిన‌ట్టు అయింది.

ఏం జ‌రిగింది?

విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన ఇందుకూరి ర‌ఘురాజు ఆది నుంచి వైసీపీలో ఉన్నారు. 2019లో పార్టీ విజ‌యం కోసం క‌ష్ట‌ప‌డి ప‌నిచేశారు. ఈ నేప‌థ్యంలోనే 2021లో జ‌రిగిన స్థానిక సంస్థ‌ల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ఆయ‌న‌కు పోటీ చేసే అవ‌కాశం ఇచ్చారు. ఈ క్ర‌మంలో కొంద‌రిని ప‌క్క‌న పెట్టి మ‌రీ రాజుకు ఛాన్స్ ఇచ్చార‌ని వైసీపీ నాయ‌కులు అప్ప‌ట్లో అలిగారు. అయితే.. ర‌ఘురాజు.. ఈ ఏడాది మార్చిలో త‌న స‌తీమ‌ణి ఇందుకూరి సుధారాణితో స‌హా 15 మంది జెడ్పీటీసీలు, 15 మంది సర్పంచుల‌తో స‌హా.. వైసీపీ నుంచి జంప్ చేసి టీడీపీలో చేరిపోయారు.

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ స‌మ‌క్షంలో ఇందుకూరి దంప‌తులు ప‌సుపు కండువా క‌ప్పుకొన్నారు. ఈ నేప‌థ్యంలో ర‌ఘురాజుపై అనర్హ‌త వేటు వేయాల‌ని వైసీపీ నాయ‌కుడు, మండ‌లిలో విప్‌గా ఉన్న పాల‌వ‌ల‌స విక్రాంత్ మండ‌లి చైర్మ‌న్ మోషేన్ రాజుకు ద‌ర‌ఖాస్తు చేశారు. ప‌లు దఫాలుగా దీనిపై విచార‌ణ చేసిన మోషేన్ రాజు ఓట్ల కౌంటింగ్‌కు ముందు రోజు సోమ‌వారం.. నిర్ణ‌యం ప్ర‌క‌టించారు. ఇందుకూరి ర‌ఘురాజును అన‌ర్హుడిగా ప్ర‌క‌టిస్తున్న‌ట్టు ఉత్త‌ర్వులు జారీ చేశారు. ప్ర‌జాప్రాతినిధ్య చ‌ట్టంలోని పార్టీ ఫిరాయింపుల స‌బ్జెక్ట్ మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు వివ‌రించారు.

అదేవిధంగా టీడీపీలో చేరిన త‌ర్వాత‌.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌హా వైసీపీకి చెందిన ప‌లువురు ముఖ్య నాయ‌కుల‌పైనా ర‌ఘురాజు తీవ్ర విమ‌ర్శ‌లు చేశార‌ని.. ఇవ‌న్నీ ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్ మీడియాల్లోనూ వ‌చ్చాయ‌ని.. ఈ నేప‌థ్యంలో వాటిని కూడా ప‌రిశీలించి నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు మండ‌లి చైర్మ‌న్ మోషేన్ రాజు పేర్కొన్నారు. అదేవిధంగా వైసీపీ అభ్య‌ర్థిగా ఉంటూ.. టీడీపీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నార‌ని.. దీనికి త‌గిన ఆధారాలు కూడా ఉన్నాయ‌ని తెలిపారు. ఇలా.. 33 పేజీల‌తో కూడిన ఉత్త‌ర్వుల‌ను మోషేన్ రాజు విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

స‌మంత స్టార్ ప‌వర్ క‌నిపిస్తోంది

తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్ల‌కు మాత్ర‌మే సాధ్య‌మైన స్టార్ ఇమేజ్ సంపాదించింది స‌మంత‌. విజ‌య‌శాంతి, అనుష్క‌ల త‌ర్వాత హీరోల‌తో…

15 minutes ago

ఇండియాలో ఆల్ టైం రికార్డు దిశ‌గా అబ్సెష‌న్

కేవ‌లం ప‌ది కోట్ల బ‌డ్జెట్లో తెర‌కెక్కిన సినిమా.. అబ్సెష‌న్. ఈ హాలీవుడ్ హార్ర‌ర్ మూవీ విడుద‌లైన‌ప్ప‌టి నుంచి వ‌ర‌ల్డ్ వైడ్…

2 hours ago

తొందరపాటు ఎందుకు పెద్ది

స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…

4 hours ago

వరప్రసాద్ స్నేహితులకు క్లాష్ తప్పదా

సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…

5 hours ago

ఫౌజీ బాటలో ముళ్లచెట్ల బ్రేకులు

హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…

5 hours ago

ఆంధ్రాకి ఆరు ఆడ పులులు కోరిన పవన్

రాష్ట్రంలో అట‌వీ సంప‌ద‌ను కాపాడ‌డంతోపాటు.. వన్య‌ప్రాణుల సంర‌క్ష‌ణ‌కు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్య‌మంత్రి, అట‌వీ శాఖ మంత్రి ప‌వ‌న్…

6 hours ago