Political News

గీత దాటితే .. తాట తీస్తారు

పోలింగ్ ముగిసిన అనంతరం ఏపీలో చెలరేగిన హింస నేపథ్యంలో మంగళవారం జరగనున్న ఓట్ల లెక్కింపు కోసం భద్రతాచర్యలు కట్టుదిట్టం చేశారు. ఏపీవ్యాప్తంగా పెద్దఎత్తున కేంద్ర బలగాల మోహరించారు. ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక స్ట్రైకింగ్‌ ఫోర్స్‌లు ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌ కేంద్రాల దగ్గర 144 సెక్షన్‌, పోలీస్‌ యాక్ట్‌ అమలు చేస్తున్నారు.

ఏపీవ్యాప్తంగా కొనసాగుతున్న కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించి రౌడీషీటర్లను బైండోవర్‌ చేసి కొందరిపై నగర బహిష్కరణ వేటు వేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు. కౌంటింగ్‌ తర్వాత కూడా 20 కంపెనీల బలగాలతో భద్రతను ఏర్పాటు చేశారు.

ఏపీ ఎన్నికల కమీషన్ 90వేల మంది భద్రతా బలగాలును మోహరించారు. దాదాపు 60వేల మంది సివిల్‌ పోలీసులు, 20 వేల మంది సిబ్బంది, 8వేల మంది సాయుధ బలగాలను సిద్దం చేశారు. 45వేల 960మంది ఏపీ ‌ పోలీసులతో పాటు 3500మంది కర్నాటక పోలీసులు, 4500మంది తమిళనాడు పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

1622మంది హోంగార్డులు, 3366మంది ఇతర పోలీస్‌ సిబ్బంది కౌంటింగ్‌ సెక్యూరిటీ విధుల్లో ఉంటారు. వీళ్లకు తోడుగా మరో 18,609 మందిని ఈసీ మోహరించింది. ఇందులో 3010మంది ఎన్‌సీసీ, 13వేల739మంది ఎన్‌ఎస్‌ఎస్‌ సిబ్బంది, 1614మంది ఎక్స్‌ సర్వీస్‌మెన్‌, 246మంది రిటైర్డ్‌ పోలీస్‌ సిబ్బంది విధుల్లో ఉంటారు. మద్యం దుకాణాలు, బార్‌ అండ్ రెస్టారెంట్లకు మూడు రోజులు సెలవులు ప్రకటించారు. ఫలితాల ప్రకటన తర్వాత ఊరేగింపులు, ర్యాలీలకు ఎన్నికల కమీషన్ అనుమతి నిరాకరించింది.

This post was last modified on June 3, 2024 4:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

42 minutes ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

1 hour ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

3 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

8 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

8 hours ago