అరెస్ట్ నుండి హైకోర్టు ఉత్తర్వులతో తాత్కాలిక ఉపశమనం పొందిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కౌంటింగ్ రోజున సెంటర్కు వెళ్లొద్దని పిన్నెల్లిని ఆదేశించింది.
పోలింగ్ రోజున మే 13 మాచర్లలో ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దాంతోపాటు పిన్నెల్లి అరెస్ట్ కి మినహాయింపు ఇచ్చింది.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ టీడీపీ ఏజెంట్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై సోమవారం విచారించిన సర్వోన్నత న్యాయస్థానం కౌంటింగ్ రోజున సెంటర్కు వెళ్లొద్దని ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర రక్షణపై స్టే ఇవ్వకపోతే న్యాయవ్యవస్థను హేళన చేసినట్టేనని బెంచ్ అభిప్రాయపడింది.
విచారణ సందర్భంగా ఈవీఎం ధ్వంసం వీడియోను పిటిషనర్ తరఫు న్యాయవాదులు న్యాయమూర్తుల ఎదుట ప్రదర్శించారు. అయితే ఆ వీడియోలో ఉన్నది ఎవరో తెలియదు. ఇది అధికారిక వీడియో కాదు అంటూ పిన్నెల్లి తరఫున న్యాయవాది వికాస్ సింగ్ వాదించారు.
అక్కడ ఫొటోలు కూడా ఉన్నాయి అన్న బెంచ్ నిందితుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కౌంటింగ్ స్టేషన్లోకి ప్రవేశించకుండా నిషేధం విధిస్తున్నామని తెలిపింది. కౌంటింగ్ పరిసర ప్రాంతాలకు కూడా పిన్నెల్లి వెళ్లకూడదని ఆదేశించింది. పిన్నెల్లిని 6వ తేదీ వరకూ అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పుపట్టడం విశేషం.
This post was last modified on June 3, 2024 4:22 pm
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…