ఏపీ అధికారపార్టీ వైసీపీకి కీలకమైన ఎన్నికల ఓట్ల కౌంటింగ్కు కొన్ని గంటల ముందు.. సుప్రీం కోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఉద్యోగులు, ఇంటి నుంచి ఓట్లేసిన వృద్ధులు, దివ్యాంగుల ఓట్ల విషయంలో వైసీపీ ఆందోళనగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలపై కోర్టును ఆశ్రయించింది. ఇప్పటికే దీనిపై రాష్ట్ర హైకోర్టులో వైసీపీకి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. దీనిని సుప్రీంకోర్టులోనూ వైసీపీ సవాల్ చేసింది.
వివాదం.. ఏంటంటే.. రాష్ట్రంలోని ఉద్యోగులు 3.9 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకు న్నా రు. అయితే.. వీరంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని వైసీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో నిబంధనల ను పాటించాలని తేల్చి చెప్పింది. అయితే.. ఈ సారి కేంద్ర ఎన్నికల సంఘం ఈ విషయంలో కొంత వెసు లుబాటు కల్పించింది. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే ఉద్యోగిని నిర్ధారిస్తూ.. సంబంధిత అధికారి ఫాం 13(ఏ) ఇస్తారు. దీని తర్వాతే .. ఉద్యోగి తన ఓటు ను వేసే అవకాశం ఉంది.
అయితే.. ఫాం 13(ఏ)లో సంతకం చేసి.. సీటు వేయాల్సి ఉంటుంది. కానీ.. తాజాగా ఎన్నికల సంఘం సం తకం చేస్తే చాటు.. సీలు వేయకపోయినా.. ఇతర వివరాలు రాకపోయినా.. ఫర్వాలేదని తేల్చి చెప్పింది. ఇది వివాదానికి దారితీసింది. సీలు, వివరాలు లేని ఫామ్ 13(ఏ) ఆధారంగా వేసే ఓటును చెల్లనివిగా పరిగణించాలని కోరింది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులు కొట్టేయాలని కూడా అభ్యర్థించింది. దీనిపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు పిటిషన్ను కొట్టేసింది.
ఇక, ఇప్పుడు తాజాగా సుప్రీం కోర్టులోనూ వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. ఎన్నికల సంఘం నిబంధనలు, ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేది లేదని తేల్చి చెప్పింది. అంతేకాదు.. ఈ సమయంలో జోక్యం చేసు కుంటే ఎన్నికల ప్రక్రియపై ప్రభావం పడుతుందని తేల్చిచెప్పింది. దీంతో వైసీపీకి భారీ ఎదురు దెబ్బ తగిలినట్టు అయింది.
This post was last modified on June 3, 2024 5:09 pm
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…