ఏపీ అధికారపార్టీ వైసీపీకి కీలకమైన ఎన్నికల ఓట్ల కౌంటింగ్కు కొన్ని గంటల ముందు.. సుప్రీం కోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఉద్యోగులు, ఇంటి నుంచి ఓట్లేసిన వృద్ధులు, దివ్యాంగుల ఓట్ల విషయంలో వైసీపీ ఆందోళనగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలపై కోర్టును ఆశ్రయించింది. ఇప్పటికే దీనిపై రాష్ట్ర హైకోర్టులో వైసీపీకి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. దీనిని సుప్రీంకోర్టులోనూ వైసీపీ సవాల్ చేసింది.
వివాదం.. ఏంటంటే.. రాష్ట్రంలోని ఉద్యోగులు 3.9 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకు న్నా రు. అయితే.. వీరంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని వైసీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో నిబంధనల ను పాటించాలని తేల్చి చెప్పింది. అయితే.. ఈ సారి కేంద్ర ఎన్నికల సంఘం ఈ విషయంలో కొంత వెసు లుబాటు కల్పించింది. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే ఉద్యోగిని నిర్ధారిస్తూ.. సంబంధిత అధికారి ఫాం 13(ఏ) ఇస్తారు. దీని తర్వాతే .. ఉద్యోగి తన ఓటు ను వేసే అవకాశం ఉంది.
అయితే.. ఫాం 13(ఏ)లో సంతకం చేసి.. సీటు వేయాల్సి ఉంటుంది. కానీ.. తాజాగా ఎన్నికల సంఘం సం తకం చేస్తే చాటు.. సీలు వేయకపోయినా.. ఇతర వివరాలు రాకపోయినా.. ఫర్వాలేదని తేల్చి చెప్పింది. ఇది వివాదానికి దారితీసింది. సీలు, వివరాలు లేని ఫామ్ 13(ఏ) ఆధారంగా వేసే ఓటును చెల్లనివిగా పరిగణించాలని కోరింది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులు కొట్టేయాలని కూడా అభ్యర్థించింది. దీనిపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు పిటిషన్ను కొట్టేసింది.
ఇక, ఇప్పుడు తాజాగా సుప్రీం కోర్టులోనూ వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. ఎన్నికల సంఘం నిబంధనలు, ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేది లేదని తేల్చి చెప్పింది. అంతేకాదు.. ఈ సమయంలో జోక్యం చేసు కుంటే ఎన్నికల ప్రక్రియపై ప్రభావం పడుతుందని తేల్చిచెప్పింది. దీంతో వైసీపీకి భారీ ఎదురు దెబ్బ తగిలినట్టు అయింది.
This post was last modified on June 3, 2024 5:09 pm
దేశంలో ఐదు రాష్ట్రాలకు (ఒకటి కేంద్ర పాలిత అసెంబ్లీ ఉన్న పుదుచ్చేరి) జరిగిన ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో అప్రతిహత…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…
సమంత మా ఇంటి బంగారం మే 15 రావడం లేదు. ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ ప్రమోషన్స్ నాలుగైదు…
అదేంటి రాజకీయాల్లో గెలిచిన తర్వాత విజయ్ ఇక సినిమాల్లో నటించడు కదా, మరి నిర్మాతలకు పండగ ఏమిటనుకుంటున్నారా. తమిళనాడు ముఖ్యమంత్రిగా…
కొత్త ఏడాదిలో అయిదో నెల వచ్చేసింది. సంక్రాంతి తర్వాత మళ్ళీ సరైన ఊపు కోసం ఎదురు చూస్తున్న బాక్సాఫీస్ కు…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ డీఎంకే, ప్రతిపక్ష పార్టీ ఏఐడీఎంకేలకు టీవీకే పెద్ద షాకిచ్చిన సంగతి తెలిసిందే.…