ఏపీ అధికారపార్టీ వైసీపీకి కీలకమైన ఎన్నికల ఓట్ల కౌంటింగ్కు కొన్ని గంటల ముందు.. సుప్రీం కోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఉద్యోగులు, ఇంటి నుంచి ఓట్లేసిన వృద్ధులు, దివ్యాంగుల ఓట్ల విషయంలో వైసీపీ ఆందోళనగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలపై కోర్టును ఆశ్రయించింది. ఇప్పటికే దీనిపై రాష్ట్ర హైకోర్టులో వైసీపీకి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. దీనిని సుప్రీంకోర్టులోనూ వైసీపీ సవాల్ చేసింది.
వివాదం.. ఏంటంటే.. రాష్ట్రంలోని ఉద్యోగులు 3.9 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకు న్నా రు. అయితే.. వీరంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని వైసీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో నిబంధనల ను పాటించాలని తేల్చి చెప్పింది. అయితే.. ఈ సారి కేంద్ర ఎన్నికల సంఘం ఈ విషయంలో కొంత వెసు లుబాటు కల్పించింది. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే ఉద్యోగిని నిర్ధారిస్తూ.. సంబంధిత అధికారి ఫాం 13(ఏ) ఇస్తారు. దీని తర్వాతే .. ఉద్యోగి తన ఓటు ను వేసే అవకాశం ఉంది.
అయితే.. ఫాం 13(ఏ)లో సంతకం చేసి.. సీటు వేయాల్సి ఉంటుంది. కానీ.. తాజాగా ఎన్నికల సంఘం సం తకం చేస్తే చాటు.. సీలు వేయకపోయినా.. ఇతర వివరాలు రాకపోయినా.. ఫర్వాలేదని తేల్చి చెప్పింది. ఇది వివాదానికి దారితీసింది. సీలు, వివరాలు లేని ఫామ్ 13(ఏ) ఆధారంగా వేసే ఓటును చెల్లనివిగా పరిగణించాలని కోరింది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులు కొట్టేయాలని కూడా అభ్యర్థించింది. దీనిపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు పిటిషన్ను కొట్టేసింది.
ఇక, ఇప్పుడు తాజాగా సుప్రీం కోర్టులోనూ వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. ఎన్నికల సంఘం నిబంధనలు, ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేది లేదని తేల్చి చెప్పింది. అంతేకాదు.. ఈ సమయంలో జోక్యం చేసు కుంటే ఎన్నికల ప్రక్రియపై ప్రభావం పడుతుందని తేల్చిచెప్పింది. దీంతో వైసీపీకి భారీ ఎదురు దెబ్బ తగిలినట్టు అయింది.
This post was last modified on June 3, 2024 5:09 pm
నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…