Political News

కౌంటింగ్ రోజు ఏమైనా జర‌గొచ్చు..

“కౌంటింగ్ రోజు ఏమైనా జ‌ర‌గొచ్చు.. అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాలి“-ఇది ఏపీలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. త‌న కూట‌మి పార్టీల అధినేత ల నుంచి నాయ‌కుల వ‌ర‌కు చెబుతున్న మాట‌.

అయితే.. ఇదే మాట‌ను కాంగ్రెస్ పార్టీ జాతీయ‌స్థాయిలోనూ వినిపించింది. అంతేకాదు.. ప‌శ్చిమ బెంగాల్‌, త‌మిళ‌నాడు స‌హా.. బీజేపీయేత‌ర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ వినిపిం చింది.

ముఖ్యంగా త‌మిళ‌నాడు, ప‌శ్చిమ బెంగాల్‌లో అయితే..ముఖ్య‌మంత్రులే ఈ ప్ర‌క‌ట‌న చేశారు. దీంతో అస‌లు ఏం జ‌రుగుతుంది?  కౌంటింగ్ రోజు ఏమైనా అద్భుతాలు జ‌రుగుతాయా?  గెలిచే వారిని ఓడించ‌డం సాధ్య‌మేనా? అనే చ‌ర్చ సాగుతోంది.

నిజానికి ఒక‌ప్పుడు బ్యాలెట్ ప‌త్రాల‌పై ఓటు వేసిన స‌మ‌యంలో త‌ప్పుల త‌డ‌క‌ల‌ను కూడా.. కౌంట్ చేసేవార‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చే వి. దీంతోపాటు.. బ్యాలెట్ బాక్సుల్లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రుగుతున్నాయ‌న్న విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చేవి. కానీ..ఈ వీఎంలు వ‌చ్చిన త‌ర్వాత‌.. కౌంటింగ్ త్వ‌ర‌గా పూర్తి కావ‌డం.. ఇలాంటి విమ‌ర్శ‌ల‌కు వివాదాల‌కు అవ‌కాశం లేకుండా పోవ‌డం గ‌మ‌నార్హం.

అయితే.. ఇప్పుడు అనూహ్యంగా ఈవీఎంల ఓట్ల లెక్కింపు రోజు కూడా.. అప్ర‌మ‌త్తంగా ఉండాలంటూ.. ప్ర‌తిప‌క్షాలు.. ముఖ్యంగా బీజేపీయే త‌ర పార్టీలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. దీనికి వారు చెబుతున్న కార‌ణాలు చూస్తే.. నిజ‌మేనా అనే సందేహం వ‌స్తుంది.

 కౌంటింగ్ జ‌రిగే రోజు కూడా.. ఓట్లు వేసుకునే అవ‌కాశం ఉంద‌ని మ‌మ‌త చెబుతున్నారు. ఇది సాధ్యం కాదు. ఎందుకంటే.. ఆప్ష‌న్ ను వెంట‌నే తీసేస్తారు. కేవ‌లం లెక్కింపు ఆప్ష‌న్ మాత్ర‌మే ఉంచుతారు. ఈవీఎంల‌ను ట్యాంప‌ర్ చేసి ఓట్లు లెక్కిస్తార‌ని త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ కూడా.. అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఇది సాధ్య‌మేనా? అన్న‌దానిపై నిపుణులు త‌లోమాట చెబుతున్నారు.

సాధ్య‌మేన‌ని.. ట్యాంపరింగ్ చేయొచ్చ‌ని ఐఐటీ నిపుణులు చెబుతున్నారు. ఎన్ ఐటీనిపుణులు మాత్రం కాద‌ని అంటున్నారు. దీంతో ఈ రెండు వాద‌న‌ల్లో ఏది నిజ‌మో తెలియ‌డం లేదు.

ఇక‌, కేంద్రంలో అధికారంలోకి రావాల‌ని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా.. తాజాగా కౌంటింగ్ కేంద్రాల వ‌ద్ద అప్ర‌మ‌త్తంగా ఉండాల ని ఇండియా కూట‌మి పార్టీల‌కు సూచించింది. త‌న పార్టీ నాయ‌కుల‌కు కూడా తేల్చి చెప్పింది. ఏమాత్రం అప్ర‌మ‌త్తంగా లేక‌పోయి నా.. బీజేపీ ఏమైనా చేయొచ్చ‌న్న‌ది ఈ పార్టీ చెబుతున్న మాట‌. కానీ, ఏం చేస్తుందో మాత్రం చెప్ప‌డం లేదు.

ఇక‌, ఏపీలోనూ చంద్ర‌బాబు వైసీపీ నేత‌ల‌పై అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఈవీఎంల‌ను ట్యాంప‌ర్ చేసే అవ‌కాశం ఉంద‌ని చంద్ర‌బాబు కూడా.. త‌న పార్టీ నాయ‌కుల‌కు చెబుతున్నారు. అదేస‌మ‌యంలో ర‌గ‌డ‌ను సృష్టించి కౌంటింగ్ నిలిచిపోయేలా చేసే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. అయితే.. ఇంత ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్నా.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం మాత్రం ఈవీఎంల‌పై ఎలాంటి అనుమానాలు అవ‌స‌రం లేద‌ని చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి కౌంటింగ్ రోజు ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on June 3, 2024 10:49 am

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

3 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

4 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

4 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

4 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

5 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

6 hours ago