Political News

కౌంటింగ్ రోజు ఏమైనా జర‌గొచ్చు..

“కౌంటింగ్ రోజు ఏమైనా జ‌ర‌గొచ్చు.. అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాలి“-ఇది ఏపీలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. త‌న కూట‌మి పార్టీల అధినేత ల నుంచి నాయ‌కుల వ‌ర‌కు చెబుతున్న మాట‌.

అయితే.. ఇదే మాట‌ను కాంగ్రెస్ పార్టీ జాతీయ‌స్థాయిలోనూ వినిపించింది. అంతేకాదు.. ప‌శ్చిమ బెంగాల్‌, త‌మిళ‌నాడు స‌హా.. బీజేపీయేత‌ర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ వినిపిం చింది.

ముఖ్యంగా త‌మిళ‌నాడు, ప‌శ్చిమ బెంగాల్‌లో అయితే..ముఖ్య‌మంత్రులే ఈ ప్ర‌క‌ట‌న చేశారు. దీంతో అస‌లు ఏం జ‌రుగుతుంది?  కౌంటింగ్ రోజు ఏమైనా అద్భుతాలు జ‌రుగుతాయా?  గెలిచే వారిని ఓడించ‌డం సాధ్య‌మేనా? అనే చ‌ర్చ సాగుతోంది.

నిజానికి ఒక‌ప్పుడు బ్యాలెట్ ప‌త్రాల‌పై ఓటు వేసిన స‌మ‌యంలో త‌ప్పుల త‌డ‌క‌ల‌ను కూడా.. కౌంట్ చేసేవార‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చే వి. దీంతోపాటు.. బ్యాలెట్ బాక్సుల్లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రుగుతున్నాయ‌న్న విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చేవి. కానీ..ఈ వీఎంలు వ‌చ్చిన త‌ర్వాత‌.. కౌంటింగ్ త్వ‌ర‌గా పూర్తి కావ‌డం.. ఇలాంటి విమ‌ర్శ‌ల‌కు వివాదాల‌కు అవ‌కాశం లేకుండా పోవ‌డం గ‌మ‌నార్హం.

అయితే.. ఇప్పుడు అనూహ్యంగా ఈవీఎంల ఓట్ల లెక్కింపు రోజు కూడా.. అప్ర‌మ‌త్తంగా ఉండాలంటూ.. ప్ర‌తిప‌క్షాలు.. ముఖ్యంగా బీజేపీయే త‌ర పార్టీలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. దీనికి వారు చెబుతున్న కార‌ణాలు చూస్తే.. నిజ‌మేనా అనే సందేహం వ‌స్తుంది.

 కౌంటింగ్ జ‌రిగే రోజు కూడా.. ఓట్లు వేసుకునే అవ‌కాశం ఉంద‌ని మ‌మ‌త చెబుతున్నారు. ఇది సాధ్యం కాదు. ఎందుకంటే.. ఆప్ష‌న్ ను వెంట‌నే తీసేస్తారు. కేవ‌లం లెక్కింపు ఆప్ష‌న్ మాత్ర‌మే ఉంచుతారు. ఈవీఎంల‌ను ట్యాంప‌ర్ చేసి ఓట్లు లెక్కిస్తార‌ని త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ కూడా.. అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఇది సాధ్య‌మేనా? అన్న‌దానిపై నిపుణులు త‌లోమాట చెబుతున్నారు.

సాధ్య‌మేన‌ని.. ట్యాంపరింగ్ చేయొచ్చ‌ని ఐఐటీ నిపుణులు చెబుతున్నారు. ఎన్ ఐటీనిపుణులు మాత్రం కాద‌ని అంటున్నారు. దీంతో ఈ రెండు వాద‌న‌ల్లో ఏది నిజ‌మో తెలియ‌డం లేదు.

ఇక‌, కేంద్రంలో అధికారంలోకి రావాల‌ని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా.. తాజాగా కౌంటింగ్ కేంద్రాల వ‌ద్ద అప్ర‌మ‌త్తంగా ఉండాల ని ఇండియా కూట‌మి పార్టీల‌కు సూచించింది. త‌న పార్టీ నాయ‌కుల‌కు కూడా తేల్చి చెప్పింది. ఏమాత్రం అప్ర‌మ‌త్తంగా లేక‌పోయి నా.. బీజేపీ ఏమైనా చేయొచ్చ‌న్న‌ది ఈ పార్టీ చెబుతున్న మాట‌. కానీ, ఏం చేస్తుందో మాత్రం చెప్ప‌డం లేదు.

ఇక‌, ఏపీలోనూ చంద్ర‌బాబు వైసీపీ నేత‌ల‌పై అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఈవీఎంల‌ను ట్యాంప‌ర్ చేసే అవ‌కాశం ఉంద‌ని చంద్ర‌బాబు కూడా.. త‌న పార్టీ నాయ‌కుల‌కు చెబుతున్నారు. అదేస‌మ‌యంలో ర‌గ‌డ‌ను సృష్టించి కౌంటింగ్ నిలిచిపోయేలా చేసే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. అయితే.. ఇంత ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్నా.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం మాత్రం ఈవీఎంల‌పై ఎలాంటి అనుమానాలు అవ‌స‌రం లేద‌ని చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి కౌంటింగ్ రోజు ఏం జ‌రుగుతుందో చూడాలి.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

9 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

11 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

13 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

13 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

14 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

14 hours ago