“కౌంటింగ్ రోజు ఏమైనా జరగొచ్చు.. అందరూ అప్రమత్తంగా ఉండాలి“-ఇది ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు.. తన కూటమి పార్టీల అధినేత ల నుంచి నాయకుల వరకు చెబుతున్న మాట.
అయితే.. ఇదే మాటను కాంగ్రెస్ పార్టీ జాతీయస్థాయిలోనూ వినిపించింది. అంతేకాదు.. పశ్చిమ బెంగాల్, తమిళనాడు సహా.. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ వినిపిం చింది.
ముఖ్యంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో అయితే..ముఖ్యమంత్రులే ఈ ప్రకటన చేశారు. దీంతో అసలు ఏం జరుగుతుంది? కౌంటింగ్ రోజు ఏమైనా అద్భుతాలు జరుగుతాయా? గెలిచే వారిని ఓడించడం సాధ్యమేనా? అనే చర్చ సాగుతోంది.
నిజానికి ఒకప్పుడు బ్యాలెట్ పత్రాలపై ఓటు వేసిన సమయంలో తప్పుల తడకలను కూడా.. కౌంట్ చేసేవారనే విమర్శలు వచ్చే వి. దీంతోపాటు.. బ్యాలెట్ బాక్సుల్లో అవకతవకలు జరుగుతున్నాయన్న విమర్శలు కూడా వచ్చేవి. కానీ..ఈ వీఎంలు వచ్చిన తర్వాత.. కౌంటింగ్ త్వరగా పూర్తి కావడం.. ఇలాంటి విమర్శలకు వివాదాలకు అవకాశం లేకుండా పోవడం గమనార్హం.
అయితే.. ఇప్పుడు అనూహ్యంగా ఈవీఎంల ఓట్ల లెక్కింపు రోజు కూడా.. అప్రమత్తంగా ఉండాలంటూ.. ప్రతిపక్షాలు.. ముఖ్యంగా బీజేపీయే తర పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి వారు చెబుతున్న కారణాలు చూస్తే.. నిజమేనా అనే సందేహం వస్తుంది.
కౌంటింగ్ జరిగే రోజు కూడా.. ఓట్లు వేసుకునే అవకాశం ఉందని మమత చెబుతున్నారు. ఇది సాధ్యం కాదు. ఎందుకంటే.. ఆప్షన్ ను వెంటనే తీసేస్తారు. కేవలం లెక్కింపు ఆప్షన్ మాత్రమే ఉంచుతారు. ఈవీఎంలను ట్యాంపర్ చేసి ఓట్లు లెక్కిస్తారని తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా.. అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది సాధ్యమేనా? అన్నదానిపై నిపుణులు తలోమాట చెబుతున్నారు.
సాధ్యమేనని.. ట్యాంపరింగ్ చేయొచ్చని ఐఐటీ నిపుణులు చెబుతున్నారు. ఎన్ ఐటీనిపుణులు మాత్రం కాదని అంటున్నారు. దీంతో ఈ రెండు వాదనల్లో ఏది నిజమో తెలియడం లేదు.
ఇక, కేంద్రంలో అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా.. తాజాగా కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాల ని ఇండియా కూటమి పార్టీలకు సూచించింది. తన పార్టీ నాయకులకు కూడా తేల్చి చెప్పింది. ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయి నా.. బీజేపీ ఏమైనా చేయొచ్చన్నది ఈ పార్టీ చెబుతున్న మాట. కానీ, ఏం చేస్తుందో మాత్రం చెప్పడం లేదు.
ఇక, ఏపీలోనూ చంద్రబాబు వైసీపీ నేతలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈవీఎంలను ట్యాంపర్ చేసే అవకాశం ఉందని చంద్రబాబు కూడా.. తన పార్టీ నాయకులకు చెబుతున్నారు. అదేసమయంలో రగడను సృష్టించి కౌంటింగ్ నిలిచిపోయేలా చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే.. ఇంత ఆందోళన వ్యక్తమవుతున్నా.. కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం ఈవీఎంలపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని చెబుతుండడం గమనార్హం. మరి కౌంటింగ్ రోజు ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on June 3, 2024 10:49 am
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…