ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన జరిగి.. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు తీరి.. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి న రోజు.. జూన్ 2. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సహా.. అక్కడి రాజకీయ పక్షాలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఇక, ఏపీలో మాత్రం అందరూ సైలెంట్గా ఉన్నారు. ఏ కార్యక్రమం కూడా లేదు. గతంలో చంద్రబాబు హయంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ప్రతిజ్ఞా కార్యక్రమం నిర్వహించేవారు. జగన్ సర్కారు ఇలాంటి కార్యక్రమాలు మానేసింది.
కాగా.. ఈ అవతరణ వేడుకలను పురస్కరించుకుని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రెసిడెంట్.. నారా చంద్ర బాబు రియాక్ట్ అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అభివృద్ధిలో ముందుకు సాగాలని కోరుకుంటు న్నట్టు తెలిపారు.
ఇరు రాష్ట్రాల్లోని 10 కోట్ల మంది తెలుగు ప్రజలు అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ప్రభుత్వ విధానాల ద్వారా సంక్షేమం, అభివృద్ధి జరిగాయన్నారు. ముఖ్యంగా ఆర్థిక సంస్కరణల ద్వారా సంపద సృష్టి జరిగిందని చంద్రబాబు తెలిపారు.
ఇక, అక్కడి నుంచి ప్రజల జీవితాల్లో మార్పులు వచ్చాయన్నారు. ఆర్థిక విజ్ఞానంతో అవకాశాలు మరింత పెరిగాయన్నారు. వీటిని అందిపుచ్చుకున్న తెలుగు వారు… ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని చంద్రబా బు తెలిపారు.
పేదరికం లేని సమాజం దిశగా రెండు రాష్ట్రాల ప్రయాణం సాగాలని ఆకాంక్షించారు. తెలుగు ప్రజల విజయాలు, కీర్తి విశ్వం మొత్తం తెలియాలని, తెలిసేలా ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. 2047 నాటికి.. ఈదేశం, మన రెండు రాష్ట్రాలు కూడా.. పురోగమించాలని కోరుకుంటున్నట్టు బాబు వ్యాఖ్యానించారు.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…