ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన జరిగి.. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు తీరి.. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి న రోజు.. జూన్ 2. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సహా.. అక్కడి రాజకీయ పక్షాలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఇక, ఏపీలో మాత్రం అందరూ సైలెంట్గా ఉన్నారు. ఏ కార్యక్రమం కూడా లేదు. గతంలో చంద్రబాబు హయంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ప్రతిజ్ఞా కార్యక్రమం నిర్వహించేవారు. జగన్ సర్కారు ఇలాంటి కార్యక్రమాలు మానేసింది.
కాగా.. ఈ అవతరణ వేడుకలను పురస్కరించుకుని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రెసిడెంట్.. నారా చంద్ర బాబు రియాక్ట్ అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అభివృద్ధిలో ముందుకు సాగాలని కోరుకుంటు న్నట్టు తెలిపారు.
ఇరు రాష్ట్రాల్లోని 10 కోట్ల మంది తెలుగు ప్రజలు అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ప్రభుత్వ విధానాల ద్వారా సంక్షేమం, అభివృద్ధి జరిగాయన్నారు. ముఖ్యంగా ఆర్థిక సంస్కరణల ద్వారా సంపద సృష్టి జరిగిందని చంద్రబాబు తెలిపారు.
ఇక, అక్కడి నుంచి ప్రజల జీవితాల్లో మార్పులు వచ్చాయన్నారు. ఆర్థిక విజ్ఞానంతో అవకాశాలు మరింత పెరిగాయన్నారు. వీటిని అందిపుచ్చుకున్న తెలుగు వారు… ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని చంద్రబా బు తెలిపారు.
పేదరికం లేని సమాజం దిశగా రెండు రాష్ట్రాల ప్రయాణం సాగాలని ఆకాంక్షించారు. తెలుగు ప్రజల విజయాలు, కీర్తి విశ్వం మొత్తం తెలియాలని, తెలిసేలా ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. 2047 నాటికి.. ఈదేశం, మన రెండు రాష్ట్రాలు కూడా.. పురోగమించాలని కోరుకుంటున్నట్టు బాబు వ్యాఖ్యానించారు.
This post was last modified on June 2, 2024 6:55 pm
మొన్న శుక్రవారం విడుదలైన సినిమాల్లో ప్రమోషన్ల పరంగా బాగా హడావిడి చేసింది హే బలవంత్ ఒక్కటే. మిగిలినవి కూడా పబ్లిసిటీ…
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేశ్కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను కూటమి సర్కార్ ఏర్పాటు చేసిన…
తమిళ రాజకీయాల్లో తన అరంగేట్రం చేస్తున్న నటుడు విజయ్ (తమిళగ వెట్రి కళగం), గతంలో ఏపీలో పవన్ కళ్యాణ్ అనుసరించిన…
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా నుంచి పాట వస్తోందంటే అభిమానులకు ఎక్కడ లేని హుషారు పుట్టుకొస్తుంది. అందులోనూ గబ్బర్ సింగ్…
నెల్లూరు పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వ్యవహారం వైసీపీలో హాట్ టాపిక్గా మారింది. ఇటీ వల వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి,…
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…