Political News

తెలంగాణ మీద బాబు పోసిటీవ్ రియాక్ష‌న్ !

ఉమ్మ‌డి ఆంధ్ర ప్ర‌దేశ్ విభ‌జ‌న జ‌రిగి.. తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు తీరి.. ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్ప‌డి న రోజు.. జూన్ 2. ఈ నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం స‌హా.. అక్క‌డి రాజ‌కీయ ప‌క్షాలు పెద్ద ఎత్తున సంబ‌రాలు చేసుకున్నారు. ఇక‌, ఏపీలో మాత్రం అంద‌రూ సైలెంట్‌గా ఉన్నారు. ఏ కార్య‌క్ర‌మం కూడా లేదు. గ‌తంలో చంద్ర‌బాబు హ‌యంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ప్ర‌తిజ్ఞా కార్య‌క్ర‌మం నిర్వ‌హించేవారు. జ‌గ‌న్ స‌ర్కారు ఇలాంటి కార్య‌క్ర‌మాలు మానేసింది.

కాగా.. ఈ అవ‌త‌ర‌ణ వేడుక‌ల‌ను పుర‌స్క‌రించుకుని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రెసిడెంట్‌.. నారా చంద్ర బాబు రియాక్ట్ అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అభివృద్ధిలో ముందుకు సాగాల‌ని కోరుకుంటు న్నట్టు తెలిపారు.

ఇరు రాష్ట్రాల్లోని 10 కోట్ల మంది తెలుగు ప్ర‌జ‌లు అభివృద్ధి ప‌థంలో దూసుకుపోవాల‌ని కోరుకుంటున్న‌ట్టు చెప్పారు. ప్ర‌భుత్వ విధానాల ద్వారా సంక్షేమం, అభివృద్ధి జ‌రిగాయ‌న్నారు. ముఖ్యంగా ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల ద్వారా సంప‌ద సృష్టి జ‌రిగింద‌ని చంద్ర‌బాబు తెలిపారు.

ఇక‌, అక్క‌డి నుంచి ప్ర‌జ‌ల జీవితాల్లో మార్పులు వ‌చ్చాయ‌న్నారు. ఆర్థిక విజ్ఞానంతో అవ‌కాశాలు మ‌రింత పెరిగాయ‌న్నారు. వీటిని అందిపుచ్చుకున్న తెలుగు వారు… ఉత్తమ ఫ‌లితాలు సాధిస్తున్నార‌ని చంద్ర‌బా బు తెలిపారు.

పేదరికం లేని సమాజం దిశగా రెండు రాష్ట్రాల ప్రయాణం సాగాలని ఆకాంక్షించారు. తెలుగు ప్రజల విజయాలు, కీర్తి విశ్వం మొత్తం తెలియాల‌ని, తెలిసేలా ప్ర‌తి ఒక్క‌రూ అభివృద్ధిలో ముందుకు సాగాల‌ని ఆకాంక్షించారు. 2047 నాటికి.. ఈదేశం, మ‌న రెండు రాష్ట్రాలు కూడా.. పురోగ‌మించాల‌ని కోరుకుంటున్న‌ట్టు బాబు వ్యాఖ్యానించారు.

  • కాగా… సీఎం జ‌గ‌న్ నుంచి మాత్రం ఎలాంటి రియాక్ష‌న్ రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on June 2, 2024 6:55 pm

Share
Show comments
Published by
Satya
Tags: Chandrababu

Recent Posts

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

2 hours ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

3 hours ago

ఊపిరి పీల్చుకుంటున్న తెలుగు థియేటర్లు

ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…

3 hours ago

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

5 hours ago

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

6 hours ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

6 hours ago