తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కచ్చితంగా 14 సీట్లు గెలుస్తుందని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమాగా చెప్పారు. ఎన్నికల ప్రచారంలోనూ ఇదే విషయాన్ని పదేపదే ప్రస్తావించారు.
కానీ ఇప్పుడు రేవంత్ లెక్క తప్పిందని, కాంగ్రెస్కు బీజేపీ షాక్ ఇచ్చిందనే టాక్ వినిపిస్తోంది. తాజాగా వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్కు డబుల్ డిజిట్ సీట్లు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
బీఆర్ఎస్కు ఒక్క సీటు రాదని చెబుతున్న ఎగ్జిట్ పోల్స్ ఎంఐఎం ఒక చోట గెలుస్తుందని తెలిపాయి. ఇక మిగిలిన 16 స్థానాలను బీజేపీ, కాంగ్రెస్ పంచుకునే అవకాశముంది.
ఇందులో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఏమో కాంగ్రెస్కు 7 నుంచి 8, బీజేపీకి 8 నుంచి 9 స్థానాలు దక్కే అవకాశముందని తెలిపాయి. గతేడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో కాంగ్రెస్ జోరుమీదుంది.
ఇదే ఉత్సాహంతో లోక్సభ ఎన్నికల్లోనూ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవాలనే చూసింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రచార భారాన్ని భుజాలపై మోశారు. పార్టీ అత్యధిక స్థానాలు గెలవాలనే లక్ష్యంతో సాగారు. కానీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్కు షాక్ తప్పదనే చెప్పాలి.
ఓ వైపు బీజేపీ తెలంగాణలో పుంజుకుంటోంది. దేశవ్యాప్తంగా మోదీ చరిష్మా కారణంగా ఇక్కడా లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ మెరుగైన ఫలితాల దిశగా సాగుతోంది. మరోవైపు కాంగ్రెస్లో రేవంత్ తప్పా మిగతా సీనియర్ నాయకులు ప్రచారంలో అంటీముట్టనట్లుగా ఉన్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ప్రచార సమయంలోనే దీనిపై అధిష్ఠానం వార్మింగ్ ఇచ్చినా నాయకుల్లో మార్పు రాలేదని అంటున్నారు. మరోవైపు పొలం బాట, బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళ్లిన కేసీఆర్ కాంగ్రెస్పై చేసిన విమర్శలు, ఆరోపణలు కూడా నష్టం చేశాయనే చెప్పాలి. కేంద్రంలో ఎలాగో మరోసారి బీజేపీనే అధికారంలోకి వస్తుందనే భావనతో జనాలూ ఆ పార్టీకే మద్దతుగా నిలిచారు.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…