తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలో పరాజయం పాలయింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని దిగిన ఈ పోటీలో కాంగ్రెస్ పార్టీని విజయం వరించలేదు. గత శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కల్వకుర్తి శాసనసభ్యుడిగా ఎన్నిక కావడంతో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి ఉప ఎన్నిక అనివార్యమయింది.
దీంతో ఎన్నికల కమీషన్ మార్చి 28న ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించింది. రాష్ట్రంలో అధికార మార్పిడి అనంతరం జరిగిన ఎమ్మెల్సీ ఉపఎన్నికను బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రముఖ పారిశ్రామికవేత్త జీవన్ రెడ్డిని ఎన్నికల బరిలో దించింది. బీఆర్ఎస్ తరపున మాజీ ఉమ్మడి జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ నవీన్ కుమార్ రెడ్డిని బరిలోకి దింపింది. అయితే ఈ ఎన్నిక ఫలితాలు లోక్ సభ ఎన్నికల మీద ప్రభావం చూపుతాయని లెక్కింపును ఈసీ నేటికి వాయిదా వేసింది.
ఈ రోజు జరిగిన ఓట్ల లెక్కింపులో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిపై 111 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 1,437 ఓట్లు పోల్ కాగా 21 ఓట్లు చెల్లనివిగా అధికారులు నిర్ధారించారు. బీఆర్ఎస్ కు 763 ఓట్లురాగా, కాంగ్రెస్ కు 652 ఓట్లు పోలయ్యాయి.
This post was last modified on June 2, 2024 1:30 pm
దేశంలో రెండు కీలక అంశాలను తేల్చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు సిద్ధమైంది. 1) జమిలి ఎన్నికలు. 2) పార్లమెంటు…
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. చాలా వేగంగా కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఏర్పడిన కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణాలను…
జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జీవన్ రెడ్డి తాజాగా బీఆర్ ఎస్ కండువా కప్పుకున్నారు. ఆ పార్టీ అధినేత…
జనాలను నవ్వించడం కోసం సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాల్లోకి దూరితే.. పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఈ ఉదంతం ఉదాహరణ. హైదరాబాద్కు…
దేశవ్యాప్తంగా మరో రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిలో ప్రధానంగా బిజెపి ఎక్కువగా ఆశలు పెట్టుకున్న రాష్ట్రం…
అప్పులు.. వివాదాలు.. అక్రమ తుపాకులు.. డ్రగ్స్ వ్యవహారం.. పన్నుల ఎగవేత- ఇవీ ఇతమిత్థంగా అమెరికా మాజీ అధ్యక్షు డు జోబైడెన్…