ఏపీ అధికార పార్టీ వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఈ నెల 4న వెలువడనున్న ఎన్నికల ఫలితాల్లో అత్యంత కీలకమైన పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో ఆ పార్టీ వేసిన పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. పోస్టల్ బ్యాలెట్ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అని తేల్చి చెప్పింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకునేది లేదని పేర్కొంది. దీంతో కీలకమైన ఎన్నికల ఫలితాల ముందు వైసీపీకి భారీ షాక్ తగిలినట్టయింది.
ఏం జరిగింది?
రాష్ట్రంలో 5.6 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. వీరిలో ఉద్యోగులు 3.6 లక్షల మంది ఉన్నారు. అయితే.. వీరు వేసిన ఓట్ల విషయంలో వివాదం రేగింది. వారు వేసే ఓటు సమయంలో బ్యాలెట్ పత్రంపై సంతకం చేస్తే సరిపోతుందని.. సంబంధిత అటెస్టెడ్ సంతకం, సీలు లేకపోయినప్పటికీ అవి చెల్లుతాయని ఎన్నికల సంఘం పేర్కొంది. దీనికి ఫాం 13(ఏ)ని ఉటంకించింది. అయితే.. దీనిని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. సంతకంతోపాటు సంబంధిత రిటర్నింగ్ అదికారి.. లేదా అటెస్టెడ్ అధికారి సంతకం ఉండాలని.. ఇది నిబంధన అని పేర్కొంది.
ఎన్నికల సంఘం పక్షపాతంతో వ్యవహరిస్తూ.. కీలక మార్పులు చేసిందని.. ఇలా చేయడం వల్ల వైసీపీకి సమాన అవకాశాలు తగ్గుతాయని కోర్టుకు వెల్లడించింది. దీనిని విచారించిన హైకోర్టు.. సుదీర్ఘ వాదనల అనంతరం.. తీర్పును రిజర్వ్ చేసింది. ముఖ్యంగా ఈ సమయంలో ఎన్నికల సంఘం తరఫున న్యాయవాది పేర్కొన్న విషయాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఎన్నికల సంఘం కార్యకలాపాల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదన్న వాదనను అనుమతించింది. ఈ క్రమంలో వైసీపీ దాఖలు చేసిన పిటిషన్ను తాజాగా తోసిపుచ్చింది. దీంతో ఎన్నికల ఫలితం సమయంలో అన్ని పోస్టల్ బ్యాలెట్లను లెక్కించేందుకు మార్గం సుగమం అయింది.
ఈ మేరకు హై కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విజయ్, జస్టిస్ కిరణ్మయి తీర్పు వెలువరించారు. పోస్టల్ బ్యాలెట్ ల లెక్కింపు కి సంభందించి ఎన్నికల కమిషన్ ఇచ్చిన మెమో లో కలుగ జేసుకోబోమని పేర్కొంది. అటువంటి వివాదాలు కేవలం ఎలక్షన్ పిటిషన్ ద్వారా మాత్రమే పరిష్కరించాలని చట్టం చెబుతోందని తెలిపింది. పిటిషనర్ లకు చట్ట రీత్యా ఉన్న ఇతర అవకాశాలు పొందటానికి అవకాశం కల్పిస్తున్నట్టు ధర్మాసనం వెల్లడించింది.
This post was last modified on June 2, 2024 10:16 am
నటుడిగా విజయ్ దేవరకొండ.. దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ కెరీర్లను మార్చేసిన సినిమా.. అర్జున్ రెడ్డి. ట్రెండ్ సెట్టర్ అనే…
ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…