Political News

ఔర్ ఏక‌బార్ ఓకే.. ‘చార్ సౌ’ పార‌లేదు!!

కేంద్రంలో ఎవ‌రు అధికారంలోకి వ‌స్తారు? ఎవ‌రు ఢిల్లీ గ‌ద్దెనెక్కుతారు? అనే విష‌యం కూడా ఈ సారి ఉత్కంఠ‌కు గురిచేసింది. అధికార పార్టీ బీజేపీ, ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్‌లు ఈ ద‌ఫా కూడా కూట‌మిగానే ముందుకు వ‌చ్చాయి. అంతేకాదు.. ప్ర‌చారాన్ని ప‌రుగు లు పెట్టించాయి. దీనిలో ప్ర‌ధానంగాపీఎం మోడీ ప‌రివారం అంతా కూడా.. “ఔర్ ఏక్‌బార్‌-4 సౌ.. పార్‌!” నినాదం వినిపించింది. క‌శ్మీర్ నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కు కూడా.. ఈ కూట‌మి ఇదే నినాదంతో ముందుకు వెళ్లింది. ఇక‌, కాంగ్రెస్ కూడా.. త‌మ‌కు 300 సీట్లు ఖాయ‌మ‌ని తెలిపింది.

ప్ర‌చారం ముగిసింది.. ఎన్నిక‌లు కూడా ముగిశాయి. ఇక‌, ఫ‌లితం మాత్ర‌మే మిగిలి ఉంది. అయితే.. ఈ మ‌ధ్య గ్యాప్‌లో ఎగ్జిట్ పోల్ ఫ‌లితం వ‌చ్చింది. ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకున్న అనేక సంస్థ‌లు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వ‌స్తాయ‌నే విష‌యం వెల్ల‌డించింది. దీని ప్ర‌కారం.. ఏ సంస్థను చూసుకున్నా.. ఒక్క‌టే మాట వినిపించింది.. ఒక్క‌టే ఫ‌లితం క‌నిపించింది. కేంద్రంలో మ‌రోసారి కూడా మోడీదే అధికారం. దీనిలో తిరుగులేదు. అని తేల్చి చెప్పాయి. జాతీయ‌స్థాయి అన్ని స‌ర్వేలు కూడా.. ఇదే విష‌యాన్ని తేల్చి చెప్పాయి. ఇక‌, ఇదే స‌మ‌యంలో వారు చెప్పిన చార్ సౌ పార్‌ అనే విష‌యాన్ని మాత్రం ప‌క్క‌న పెట్టాయి.

325-370 మ‌ధ్య మాత్ర‌మే.. న‌రేంద్ర మోడీ కూట‌మి సీట్లు ద‌క్కించుకుంటుంద‌ని స‌ర్వే సంస్థ‌లు పేర్కొన్నాయి. అంటే.. కూట‌మి ప‌క్షాలు ప్ర‌చారం చేసుకున్న‌ట్టుగా ఎక్క‌డా వారు 543 సీట్ల‌లో 400 సీట్లు అయితే ద‌క్కించుకోవ‌డం లేదు. కానీ, గెలుపు గుర్రం మాత్రం ఎక్కుతున్నారు. 400 సీట్లు రాక‌పోయినా.. మూడో సారి అధికారంలోకి వ‌స్తున్నార‌న్న అంచ‌నా నిజ‌మైతే.. బీజేపీకి తిరుగులేని విజ‌యం ద‌క్కిన‌ట్టే అవుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్ మాత్ర‌మే ఈ దేశంలో మూడు సార్లు వ‌రుస‌గా అధికారంలోకి వ‌చ్చింది. అది కూడా.. 1970ల‌కు ముందు. ఆ రికార్డును మోడీ ఇప్పుడు స‌మం చేయ‌నున్నారు.

మ‌రోవైపు అనేక పార్టీలతో జ‌త‌కట్టి .. వాటితో వేగ‌లేక‌పోయినా.. ఏదో ఒక విధంగా ముందుకు సాగిన కాంగ్రెస్ పార్టీ.. ఈ ద‌ఫా 110-190 మ‌ధ్య మాత్ర‌మే మిగిలిపోతుంద‌ని చెబుతున్నారు. దీనిలో నూ త‌గ్గేవే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. మొత్తంగా చూస్తే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చే ప‌రిస్థితి మాత్రం క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు. ఈ ప్ర‌భావం రాహుల్ గాంధీ నాయ‌క‌త్వంపైనే ఎక్కువ‌గా క‌నిపించ‌నుంది. ఇక‌, కూట‌మి పార్టీలు కూడా.. కాంగ్రెస్‌కు స‌హ‌క‌రించింది లేద‌నే విష‌యం బ‌హిరంగ ర‌హ‌స్యం. ప‌శ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా ఇవ్వని మ‌మ‌త‌, ఢిల్లీలో ఆది నుంచి వివాదాల‌తోనే ముందుకు సాగిన ఆప్ వంటివి కూట‌మికి సెగ పెట్టాయి.

This post was last modified on June 2, 2024 10:15 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎటెటో వెళ్తున్న జన నాయకుడు గొడవ

సినిమా విడుదల ఎప్పుడో తేలకుండానే పైరసీ బారిన పడిన జన నాయకుడు గొడవ రకరకాల మలుపులు తిరుగుతోంది. ముందు లాయర్ తరపున…

30 minutes ago

తేడా కొడుతోంది అనిరుధ్ భాయ్

సౌత్ మ్యూజిక్ లో సెన్సేషన్ అంటే అనిరుధ్ రవిచందర్ పేరే ముందు గుర్తొస్తుంది. తను పని చేస్తున్నాడని తెలిస్తే చాలు…

59 minutes ago

బీఆర్ఎస్‌లో పూర్తి ప్ర‌క్షాళ‌న… కారణమేంటి?

తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…

1 hour ago

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

4 hours ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

5 hours ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

5 hours ago