కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారు? ఎవరు ఢిల్లీ గద్దెనెక్కుతారు? అనే విషయం కూడా ఈ సారి ఉత్కంఠకు గురిచేసింది. అధికార పార్టీ బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్లు ఈ దఫా కూడా కూటమిగానే ముందుకు వచ్చాయి. అంతేకాదు.. ప్రచారాన్ని పరుగు లు పెట్టించాయి. దీనిలో ప్రధానంగాపీఎం మోడీ పరివారం అంతా కూడా.. “ఔర్ ఏక్బార్-4 సౌ.. పార్!” నినాదం వినిపించింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా.. ఈ కూటమి ఇదే నినాదంతో ముందుకు వెళ్లింది. ఇక, కాంగ్రెస్ కూడా.. తమకు 300 సీట్లు ఖాయమని తెలిపింది.
ప్రచారం ముగిసింది.. ఎన్నికలు కూడా ముగిశాయి. ఇక, ఫలితం మాత్రమే మిగిలి ఉంది. అయితే.. ఈ మధ్య గ్యాప్లో ఎగ్జిట్ పోల్ ఫలితం వచ్చింది. ప్రజల నాడిని పట్టుకున్న అనేక సంస్థలు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే విషయం వెల్లడించింది. దీని ప్రకారం.. ఏ సంస్థను చూసుకున్నా.. ఒక్కటే మాట వినిపించింది.. ఒక్కటే ఫలితం కనిపించింది. కేంద్రంలో మరోసారి కూడా మోడీదే అధికారం. దీనిలో తిరుగులేదు. అని తేల్చి చెప్పాయి. జాతీయస్థాయి అన్ని సర్వేలు కూడా.. ఇదే విషయాన్ని తేల్చి చెప్పాయి. ఇక, ఇదే సమయంలో వారు చెప్పిన చార్ సౌ పార్ అనే విషయాన్ని మాత్రం పక్కన పెట్టాయి.
325-370 మధ్య మాత్రమే.. నరేంద్ర మోడీ కూటమి సీట్లు దక్కించుకుంటుందని సర్వే సంస్థలు పేర్కొన్నాయి. అంటే.. కూటమి పక్షాలు ప్రచారం చేసుకున్నట్టుగా ఎక్కడా వారు 543 సీట్లలో 400 సీట్లు అయితే దక్కించుకోవడం లేదు. కానీ, గెలుపు గుర్రం మాత్రం ఎక్కుతున్నారు. 400 సీట్లు రాకపోయినా.. మూడో సారి అధికారంలోకి వస్తున్నారన్న అంచనా నిజమైతే.. బీజేపీకి తిరుగులేని విజయం దక్కినట్టే అవుతుంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ మాత్రమే ఈ దేశంలో మూడు సార్లు వరుసగా అధికారంలోకి వచ్చింది. అది కూడా.. 1970లకు ముందు. ఆ రికార్డును మోడీ ఇప్పుడు సమం చేయనున్నారు.
మరోవైపు అనేక పార్టీలతో జతకట్టి .. వాటితో వేగలేకపోయినా.. ఏదో ఒక విధంగా ముందుకు సాగిన కాంగ్రెస్ పార్టీ.. ఈ దఫా 110-190 మధ్య మాత్రమే మిగిలిపోతుందని చెబుతున్నారు. దీనిలో నూ తగ్గేవే ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. మొత్తంగా చూస్తే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి మాత్రం కనిపించడం లేదని అంటున్నారు. ఈ ప్రభావం రాహుల్ గాంధీ నాయకత్వంపైనే ఎక్కువగా కనిపించనుంది. ఇక, కూటమి పార్టీలు కూడా.. కాంగ్రెస్కు సహకరించింది లేదనే విషయం బహిరంగ రహస్యం. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా ఇవ్వని మమత, ఢిల్లీలో ఆది నుంచి వివాదాలతోనే ముందుకు సాగిన ఆప్ వంటివి కూటమికి సెగ పెట్టాయి.
This post was last modified on June 2, 2024 10:15 am
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని బలోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మరింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మక అడుగులు…
తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వర్గాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో ఒక వర్గానికి ఇంకో వర్గానికి అస్సలు…
ఒకప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావడం, ఇక్కడ పెద్ద స్థాయిలో రిలీజ్ కావడమే ఉండేది తప్ప.. తెలుగు చిత్రాలు…
మాజీ మంత్రి మల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెరవాల్సిందే. అది రాజకీయ సభ అయినా.. సినిమా…
మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…
అల్లు అర్జున్ అంటే ఒకప్పుడు మెగా హీరోల్లో ఒకడు. అతను మెగాస్టార్ చిరంజీవినో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్నో పొగిడితేనో..…