దేశవ్యాపితంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ హంగామా మొదలయింది. దేశంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది ఎన్డీఎ అని మెజారిటీ సంస్థలు వెల్లడిస్తున్నాయి.
అయితే ఎగ్జిట్ పోల్ అంచనాలు తప్పు అని, అశాస్త్రీయం అని ఇండియా కూటమి వర్గాలు వాదిస్తున్నాయి. ఇండియా కూటమి గరిష్టంగా 150 స్థానాలకు పరిమితం అవుతుందని సర్వేలు చెబుతుండగా, 295 స్థానాలు గెలుచుకుంటామని అంటున్నాయి.
ఎన్డీఎ కూటమికి సర్వే సంస్థలన్నీ 281 స్థానాల నుండి 401 స్థానాల వరకు వస్తాయని అంచనా వేశాయి. అయితే అన్నింటిలో ఆసక్తికర పరిణామం ఏమిటంటే ఈసారి కేరళలో బీజేపీ ఖాతా తెరుస్తుందని సర్వేలు అంచనా వేస్తున్నాయి. కమ్యూనిస్టుల ఖిల్లా అయిన కేరళలో ఈసారి తప్పక ఒకటి నుండి మూడు స్థానాలు బీజేపీ గెలుస్తుందని చెబుతున్నారు.
కేరళ రాజధాని తిరువనంతపురంలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ శశిథరూర్ ను బీజేపీ అభ్యర్థి, కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఓడిస్తారని ఇండియా టుడే – యాక్సిస్ మే ఇండియా సంస్థ వెల్లడించింది. త్రిస్సూర్ లో నటుడు, బీజేపీ అభ్యర్థి సురేష్ గోపి గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని టైమ్స్ నౌ వెల్లడించింది. తమిళనాడులో కూడా ఒకటి నుండి మూడు స్థానాలు బీజేపీకి వస్తాయని చెబుతుండడం విశేషం.
This post was last modified on June 2, 2024 10:03 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…