దేశవ్యాపితంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ హంగామా మొదలయింది. దేశంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది ఎన్డీఎ అని మెజారిటీ సంస్థలు వెల్లడిస్తున్నాయి.
అయితే ఎగ్జిట్ పోల్ అంచనాలు తప్పు అని, అశాస్త్రీయం అని ఇండియా కూటమి వర్గాలు వాదిస్తున్నాయి. ఇండియా కూటమి గరిష్టంగా 150 స్థానాలకు పరిమితం అవుతుందని సర్వేలు చెబుతుండగా, 295 స్థానాలు గెలుచుకుంటామని అంటున్నాయి.
ఎన్డీఎ కూటమికి సర్వే సంస్థలన్నీ 281 స్థానాల నుండి 401 స్థానాల వరకు వస్తాయని అంచనా వేశాయి. అయితే అన్నింటిలో ఆసక్తికర పరిణామం ఏమిటంటే ఈసారి కేరళలో బీజేపీ ఖాతా తెరుస్తుందని సర్వేలు అంచనా వేస్తున్నాయి. కమ్యూనిస్టుల ఖిల్లా అయిన కేరళలో ఈసారి తప్పక ఒకటి నుండి మూడు స్థానాలు బీజేపీ గెలుస్తుందని చెబుతున్నారు.
కేరళ రాజధాని తిరువనంతపురంలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ శశిథరూర్ ను బీజేపీ అభ్యర్థి, కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఓడిస్తారని ఇండియా టుడే – యాక్సిస్ మే ఇండియా సంస్థ వెల్లడించింది. త్రిస్సూర్ లో నటుడు, బీజేపీ అభ్యర్థి సురేష్ గోపి గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని టైమ్స్ నౌ వెల్లడించింది. తమిళనాడులో కూడా ఒకటి నుండి మూడు స్థానాలు బీజేపీకి వస్తాయని చెబుతుండడం విశేషం.
This post was last modified on June 2, 2024 10:03 am
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…