ఏపీలో నరాలు తెగే ఉత్కంఠకు కారణమైన అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తున్నారు? ఎవరు ఓడుతున్నారనే విషయాలు.. సర్వత్రా ఆసక్తిగా మారాయి. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ కోసం .. అందరూ ఎదురు చూశారు. తాజాగా శనివారం సాయంత్రం 6.30 తర్వాత.. పలు సంస్థలు ఆయా వివరాలు వెల్లడించాయి. అయితే.. మెజారిటీ సంస్థలు.. కూటమి(టీడీపీ+బీజేపీ+జనసేన)కే జై కొట్టాయి. ఆ పార్టీల కూటమే అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పాయి. దాదాపు 12-15 సంస్తలు చేసిన సర్వేల్లో మెజారిటీ సంస్థలు.. కూటమి పక్షానే నిలవడం గమనార్హం.
ఇదీ.. ఎగ్జిట్ పోల్(అసెంబ్లీ)
ఏపీబీ సీ ఓటర్: ఎన్డీఏ కూటమికి 52.9 శాతం ఓట్లు, వైఎస్సార్ సీపీ 41.7 శాతం ఓట్లు, కాంగ్రెస్ కు 3.3 శాతం ఓట్లు, ఇతరులు 2.1 శాతం ఓట్లు.
పీపుల్స్ పల్స్: టీడీపీ 95 -110, వైసీపీ 45 -60, జనసేన 14 – 20, బీజేపీ 2 – 5
కేకే సర్వీస్: టీడీపీ 133, వైసీపీ – 14, జనసేన – 21, బీజేపీ – 7
చాణక్య స్ట్రాటజీస్: టీడీపీ కూటమి 114 – 125, వైసీపీ 39 – 49, ఇతరులు 0-1
పయనీర్: టీడీపీ కూటమి- 144, వైసీపీ 31
రైజ్: టీడీపీ కూటమి 113 – 122, వైసీపీ 48 – 60, ఇతరులు 1
This post was last modified on June 1, 2024 8:34 pm
కొందరు హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో చేసిన సంప్రదాయ పాత్రల కారణంగా వారి మీద ఒక ముద్ర పడిపోతుంది. వాళ్లను గ్లామర్ కోణంలో…
అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…
కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…