ఏపీలో నరాలు తెగే ఉత్కంఠకు కారణమైన అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తున్నారు? ఎవరు ఓడుతున్నారనే విషయాలు.. సర్వత్రా ఆసక్తిగా మారాయి. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ కోసం .. అందరూ ఎదురు చూశారు. తాజాగా శనివారం సాయంత్రం 6.30 తర్వాత.. పలు సంస్థలు ఆయా వివరాలు వెల్లడించాయి. అయితే.. మెజారిటీ సంస్థలు.. కూటమి(టీడీపీ+బీజేపీ+జనసేన)కే జై కొట్టాయి. ఆ పార్టీల కూటమే అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పాయి. దాదాపు 12-15 సంస్తలు చేసిన సర్వేల్లో మెజారిటీ సంస్థలు.. కూటమి పక్షానే నిలవడం గమనార్హం.
ఇదీ.. ఎగ్జిట్ పోల్(అసెంబ్లీ)
ఏపీబీ సీ ఓటర్: ఎన్డీఏ కూటమికి 52.9 శాతం ఓట్లు, వైఎస్సార్ సీపీ 41.7 శాతం ఓట్లు, కాంగ్రెస్ కు 3.3 శాతం ఓట్లు, ఇతరులు 2.1 శాతం ఓట్లు.
పీపుల్స్ పల్స్: టీడీపీ 95 -110, వైసీపీ 45 -60, జనసేన 14 – 20, బీజేపీ 2 – 5
కేకే సర్వీస్: టీడీపీ 133, వైసీపీ – 14, జనసేన – 21, బీజేపీ – 7
చాణక్య స్ట్రాటజీస్: టీడీపీ కూటమి 114 – 125, వైసీపీ 39 – 49, ఇతరులు 0-1
పయనీర్: టీడీపీ కూటమి- 144, వైసీపీ 31
రైజ్: టీడీపీ కూటమి 113 – 122, వైసీపీ 48 – 60, ఇతరులు 1
This post was last modified on June 1, 2024 8:34 pm
యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ఒకప్పుడు అంకుశం, ఆగ్రహం, మగాడు లాంటి సూపర్ హిట్స్ తో తొంభై దశకంలో మంచి…
ముఖ్యమంత్రి పదవి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ప్రతి రాజకీయ నేత సీఎం కావాలనే కోరుకుంటారు. ఇక గ్రాండ్…
ఇవాళ అందరూ బైకర్, రాకాస గురించే మాట్లాడుకుంటున్నారు కానీ వీటితో పాటు కార్మేని సెల్వం అనే డబ్బింగ్ సినిమా రిలీజైన…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని జైలుకు వెళ్లేందుకెు సిద్ధపడిపోయారా? అంటే.. అవుననే సమాధానమే…
అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ రూపొందించిన బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించటం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు.…
అమెరికాలో ఉంటున్న తెలుగు అమ్మాయి, ఇన్ఫ్లుయెన్సర్ (పికు నెమలి) సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో…