పార్లమెంటు ఎన్నికల్లో ఎవరు విజయం దక్కించుకుంటున్నారనే విషయాన్ని పలు స్ట్రాటజీ సంస్థలు ముందస్తు ఫలితాన్ని వెల్లడించాయి. దీనిలో నమ్మదగిన సంస్థగా ఉన్న ఆరా మస్తాన్ సర్వే ఫలితాలు..జనసేనకు జై కొట్టాయి.
జనసేన పార్టీ పోటీ చేసిన రెండు పార్లమెంటు స్థానాల్లో ఈ పార్టీ విజయం దక్కించుకుంటుందని ఈ సంస్థ తెలిపింది. ప్రస్తుత పార్లమెంటు ఎమ్మెల్యే జనసేన పార్టీ మచిలీపట్నం.. కాకినాడ స్థానాలలో పోటీ చేసింది. అయితే.. ఈ రెండు కూడా జనసేన దక్కించుకుంటుందని తెలిపింది.
మచిలీపట్నం నుంచి సిట్టింగ్ ఎంపీ.. వల్లభనేని బాలశౌరి జనసేన తరఫున పోటీ చేశారు. 2019లో ఆయన వైసీపీ తరఫున గెలుపు గుర్రం ఎక్కారు. ఆయనకు వేరే నియోజకవర్గం కేటాయించడంతో అలిగి పార్టీ నుంచి బయటకు వచ్చి..జనేసేనలో చేరారు.
ఈ క్రమంలో ఆయనకు మరోసారి మచిలీపట్నం నియోజకవర్గాన్నే కేటాయించారు. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఆయనే విజయం దక్కించుకోనున్నారని ఆరా మస్తాన్ సర్వే పేర్కొంది.
ఇక, కాకినాడ నుంచి కూడా జనసేన విజయం దక్కించుకుంటుందని ఆరా మస్తాన్ సర్వే పేర్కొంది. ఇక్కడ నుంచి తొలి సారి రాజకీయ అరంగేట్రం చేసిన టై టైం ఉదయ్ శ్రీనివాస్ విజయం దక్కించుకోనున్నట్టు ఈ సర్వే తెలిపింది.
కాకినాడ నియోజకవర్గం లో ఉన్న కాపుల ఓట్లు జనసేన కు పడ్డాయి. దీంతో ఇక్కడ ఆ పార్టీ విజయం ఖాయమైందని సర్వే పేర్కొంది. ఈ రెండు నియోజ కవర్గాలు కూడా.. జనసేనకు అత్యంత కీలకమైన నియోజకవర్గాలు కావడం.. గమనార్హం. ఇక్కడ పవన్ కల్యాణ్ నాలుగు నుంచి ఆరుసార్లు ప్రచారం చేశారు. ఇప్పుడు ఆ ఫలితం కనిపిస్తోందని సర్వే చెప్పడం గమనార్హం.
This post was last modified on June 1, 2024 8:36 pm
కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…
తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…
ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…
ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…
కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…