ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇంకో మూడు రోజుల్లో ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. శనివారమే దేశవ్యాప్తంగా చివరి దశ లోక్సభ ఎన్నికలు పూర్తి అవుతుండడంతో శనివారం సాయంత్రం ఆరున్నర తర్వాత ఎగ్జిట్ పోల్స్ బయటికి రాబోతున్నాయి. వీటితోనే ఫలితాల మీద ఒక అంచనా వచ్చేస్తుందని భావిస్తున్నారు.
కాగా ఏపీలో ఎన్నికలు అయిన దగ్గర్నుంచి పెద్ద ఎత్తున బెట్టింగ్ నడుస్తోంది. మునుపెన్నడూ లేని స్థాయిలో వేల కోట్ల రూపాయల బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఐతే ఎన్నికలు అయిన దగ్గర్నుంచి ఎక్కువగా బెట్టింగ్ రాయుళ్లు పందెం కాస్తున్నది కూటమి వైపు. క్రమ క్రమంగా వైసీపీ వైపు పందెం కాసే వాళ్ల సంఖ్య తగ్గుతూ వచ్చింది. వైసీపీ నేతలు, కార్యకర్తలు సైతం ఆ పార్టీ మీద పందెం కాయడానికి భయపడే పరసి్థితి వచ్చింది.
ఒక దశలో వైసీపీ గెలిచినట్లు పందెం కాస్తే రూపాయికి రూపాయిన్నర, రెండు రూపాయలు ఇచ్చేలా పందేలు నడిచాయి. కాగా లేటెస్ట్ రిపోర్ట్ ఏంటంటే.. వైసీపీ మీద పందెం కాస్తే రూపాయికి మూడు రూపాయలు ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నారట. అంత టెంప్టింగ్ ఆఫర్లు ఇస్తున్నా ఆ పార్టీ వైపు పందేలు కాసేవాళ్లు కనిపించడం లేదని టాక్. వైసీపీ వాళ్లే ఆ పార్టీ మీద పందెం కాయడానికి వెనుకంజ వేస్తున్నారు.
కొందరు పేరున్న రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే విషయాన్ని తమ విశ్లేషణల్లో ప్రస్తావిస్తున్నారు. ఈ రోజు ఎగ్జిట్ పోల్స్లో కనుక కూటమికి అనుకూలంగా ఫలితాలు ప్రకటిస్తే.. ఇక వైసీపీ విజయావకాశాలను పూర్తిగా కొట్టి పారేయొచ్చని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆరా మస్తాన్ లాంటి వాళ్లు ప్రకటించే ఫలితాల కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
This post was last modified on June 1, 2024 6:14 pm
అంబటి రాంబాబును అడ్డు పెట్టుకుని కాపులను మరోసారి వైసీపీ తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోందా? కుల రాజకీయాలు, కాపు రాజకీయాలకు…
ఏపీలో కూటమి ప్రభుత్వం మరింత బలోపేతం అవుతోందా? పార్టీల మధ్య సమన్వయం కట్టుతప్పకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారా? అంటే.. ఔననే సమాధానమే…
యానిమల్ సినిమాతో బాలీవుడ్ మేకర్స్ ని సైతం ముక్కున వేలేసుకునేలా చేశాడు సందీప్ వంగ. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్…
దర్శకుడిగానే కాదు నిర్మాతగా కూడా తన అభిరుచి ఏంటన్నది ప్రేక్షకులకు తెలియచేస్తూ సుకుమార్ చేసే ప్రయత్నాలు తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్…
దేశ రాజధానిలో ఈరోజు భారత్ ట్యాక్సీ అడుగుపెట్టడంతో క్యాబ్ సర్వీసుల రంగంలో అలజడి మొదలైంది. ఇప్పటి వరకు ఓలా, ఉబేర్…
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…