ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇంకో మూడు రోజుల్లో ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. శనివారమే దేశవ్యాప్తంగా చివరి దశ లోక్సభ ఎన్నికలు పూర్తి అవుతుండడంతో శనివారం సాయంత్రం ఆరున్నర తర్వాత ఎగ్జిట్ పోల్స్ బయటికి రాబోతున్నాయి. వీటితోనే ఫలితాల మీద ఒక అంచనా వచ్చేస్తుందని భావిస్తున్నారు.
కాగా ఏపీలో ఎన్నికలు అయిన దగ్గర్నుంచి పెద్ద ఎత్తున బెట్టింగ్ నడుస్తోంది. మునుపెన్నడూ లేని స్థాయిలో వేల కోట్ల రూపాయల బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఐతే ఎన్నికలు అయిన దగ్గర్నుంచి ఎక్కువగా బెట్టింగ్ రాయుళ్లు పందెం కాస్తున్నది కూటమి వైపు. క్రమ క్రమంగా వైసీపీ వైపు పందెం కాసే వాళ్ల సంఖ్య తగ్గుతూ వచ్చింది. వైసీపీ నేతలు, కార్యకర్తలు సైతం ఆ పార్టీ మీద పందెం కాయడానికి భయపడే పరసి్థితి వచ్చింది.
ఒక దశలో వైసీపీ గెలిచినట్లు పందెం కాస్తే రూపాయికి రూపాయిన్నర, రెండు రూపాయలు ఇచ్చేలా పందేలు నడిచాయి. కాగా లేటెస్ట్ రిపోర్ట్ ఏంటంటే.. వైసీపీ మీద పందెం కాస్తే రూపాయికి మూడు రూపాయలు ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నారట. అంత టెంప్టింగ్ ఆఫర్లు ఇస్తున్నా ఆ పార్టీ వైపు పందేలు కాసేవాళ్లు కనిపించడం లేదని టాక్. వైసీపీ వాళ్లే ఆ పార్టీ మీద పందెం కాయడానికి వెనుకంజ వేస్తున్నారు.
కొందరు పేరున్న రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే విషయాన్ని తమ విశ్లేషణల్లో ప్రస్తావిస్తున్నారు. ఈ రోజు ఎగ్జిట్ పోల్స్లో కనుక కూటమికి అనుకూలంగా ఫలితాలు ప్రకటిస్తే.. ఇక వైసీపీ విజయావకాశాలను పూర్తిగా కొట్టి పారేయొచ్చని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆరా మస్తాన్ లాంటి వాళ్లు ప్రకటించే ఫలితాల కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
This post was last modified on June 1, 2024 6:14 pm
కొత్త జిల్లాల ఏర్పాటు అంశం రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఆశలు రేకెత్తించింది. ఈ ప్రభుత్వం అయినా తమకు న్యాయం చేస్తుందని వారు…
ఒక బాలీవుడ్ మూవీ మూడో వారంలోనూ సూపర్ స్ట్రాంగ్ గా ఉండటం చూసి ఎన్ని నెలలయ్యిందో గుర్తు చేసుకోవడం కష్టం.…
అదేంటో కాకతాళీయంగా జరిగినా పరిశ్రమకు సంబంధించిన కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇటీవలే విడుదలైన అఖండ తాండవం 2 ఆశించిన…
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…