జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కావాలని.. ఆయన పిఠాపురంలో గెలవాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఈ క్రమంలో వారు తమ అభిమాన నాయకుడి విజయంకోసం.. మొక్కుల కూడా మొక్కుతున్నారు. ఇలాంటి వారిలో తాజాగా ఓ లేడీ డాక్టర్ కూడా చేరిపోయారు.
తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరానికి చెందిన డాక్టర్ రామలక్ష్మి.. ఆర్ ఎంపీ డాక్టర్. ఈమెకు పవన్ కళ్యాణ్ అంటే ఎనలేని అభిమానం. అలాగని పార్టీల పరంగా కాదు. నటన పరంగా ఆయనంటే ఎంతో ఎనలేని మక్కువ.
ఈ నేపథ్యంలో డాక్టర్ రామలక్ష్మి.. తాజాగా ముగిసిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయం దక్కించుకోవాలని కాంక్షిస్తూ.. ఏకంగా.. తిరుమల శ్రీవారి ఏడు కొండల మెట్లు ఎక్కారు.
అది కూడా.. సాధారణ పాదాలతో కాదు.. మోకాళ్లపై ఎక్కి మరీ మొక్కు తీర్చుకున్నారు. వాస్తవానికి మోకాళ్లపై కొంత దూరం వరకు నడవాలం టేనే మనకు ఇబ్బంది. అలాంటిది.. ఏడు కొండల మెట్లను మోకాళ్లపై ఎక్కడం అంటే.. మామూలు విష యం కాదు. అయినప్పికీ రామలక్ష్మి దీనిని సాధించారు.
వాస్తవానికి మే 25నే తన మొక్కు తీర్చుకున్న రామలక్ష్మి తాజాగా మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించా రు. ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విజయం సాధించాలి. అందుకే తిరుమల శ్రీవారిని మెక్కుకున్నా. అందులో భాగంగానే 450 మెట్లు మోకాళ్లపై ఎక్కి మొక్కు తీర్చుకున్నా. పార్టీలతో నాకు సంబంధం లేదు. కేవలం పవన్ పై ఉన్న అభిమానంతోనే ఇలా చేశా ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయం అని డాక్టర్ పసుపులేటి రామలక్ష్మి వ్యాఖ్యానించారు.
This post was last modified on June 1, 2024 5:02 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…