Political News

ప‌వ‌న్ గెలవాల‌ని.. మోకాళ్ల‌పై ఏడు కొండ‌ల మెట్లు ఎక్కేసిన లేడీ డాక్ట‌ర్‌

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎమ్మెల్యే కావాల‌ని.. ఆయ‌న పిఠాపురంలో గెల‌వాల‌ని చాలా మంది కోరుకుంటున్నారు. ఈ క్ర‌మంలో వారు త‌మ అభిమాన నాయ‌కుడి విజ‌యంకోసం.. మొక్కుల కూడా మొక్కుతున్నారు. ఇలాంటి వారిలో తాజాగా ఓ లేడీ డాక్ట‌ర్ కూడా చేరిపోయారు.

తూర్పుగోదావ‌రి జిల్లా ఉండ్రాజ‌వరానికి చెందిన డాక్ట‌ర్ రామ‌లక్ష్మి.. ఆర్ ఎంపీ డాక్ట‌ర్. ఈమెకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే ఎన‌లేని అభిమానం. అలాగ‌ని పార్టీల ప‌రంగా కాదు. న‌ట‌న ప‌రంగా ఆయనంటే ఎంతో ఎన‌లేని మ‌క్కువ‌.

ఈ నేప‌థ్యంలో డాక్ట‌ర్ రామ‌ల‌క్ష్మి.. తాజాగా ముగిసిన ఎన్నికల్లో ప‌వ‌న్ కళ్యాణ్ విజ‌యం ద‌క్కించుకోవాల‌ని కాంక్షిస్తూ.. ఏకంగా.. తిరుమల శ్రీవారి ఏడు కొండ‌ల మెట్లు ఎక్కారు.

అది కూడా.. సాధార‌ణ పాదాల‌తో కాదు.. మోకాళ్ల‌పై ఎక్కి మ‌రీ మొక్కు తీర్చుకున్నారు. వాస్తవానికి మోకాళ్ల‌పై కొంత దూరం వ‌ర‌కు న‌డ‌వాలం టేనే మ‌న‌కు ఇబ్బంది. అలాంటిది.. ఏడు కొండ‌ల మెట్ల‌ను మోకాళ్ల‌పై ఎక్క‌డం అంటే.. మామూలు విష యం కాదు. అయిన‌ప్పికీ రామ‌లక్ష్మి దీనిని సాధించారు.

వాస్తవానికి మే 25నే త‌న మొక్కు తీర్చుకున్న రామల‌క్ష్మి తాజాగా మీడియాకు ఈ విష‌యాన్ని వెల్ల‌డించా రు. ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ విజ‌యం సాధించాలి. అందుకే తిరుమ‌ల శ్రీవారిని మెక్కుకున్నా. అందులో భాగంగానే 450 మెట్లు మోకాళ్ల‌పై ఎక్కి మొక్కు తీర్చుకున్నా. పార్టీల‌తో నాకు సంబంధం లేదు. కేవ‌లం ప‌వ‌న్ పై ఉన్న అభిమానంతోనే ఇలా చేశా ఆయ‌న భారీ మెజారిటీతో విజ‌యం సాధించ‌డం ఖాయం అని డాక్ట‌ర్ పసుపులేటి రామ‌ల‌క్ష్మి వ్యాఖ్యానించారు.

This post was last modified on June 1, 2024 5:02 pm

Share

Recent Posts

సుహాస్ వాడకం ఇలా ఉండాలి

టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…

13 minutes ago

పహల్గామ్‌పై బ్రిక్స్ ఒక్క మాట.. చైనా కూడా ఒప్పుకుంది!

పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్‌కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…

1 hour ago

గుంటూరు మేయర్ సీటు ఎవరికి

రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…

1 hour ago

వైసీపీ ఇలా చేస్తే.. విజ‌య‌వాడ మొత్తం టీడీపీదే..!

వ్యూహాల క‌లిమి.. నాయ‌కుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవ‌స‌రం. ఈ విష‌యంలో వైసీపీ చేస్తున్న వ్వ‌వ‌హారం.. పార్టీని దుంప‌నాశ‌నం…

2 hours ago

`వైనాట్ పులివెందుల` ఎందాకా వచ్చింది?

వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్‌.. సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌ను త‌మ హ‌స్త‌గ‌తం చేసుకోవాలన్నది.. టీడీపీ ఆకాంక్ష‌. ముఖ్యంగా స్థానిక…

4 hours ago

పదేళ్ల పాత రీమేక్ బెడిసి కొట్టిందా

ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…

9 hours ago