Political News

ప‌వ‌న్ గెలవాల‌ని.. మోకాళ్ల‌పై ఏడు కొండ‌ల మెట్లు ఎక్కేసిన లేడీ డాక్ట‌ర్‌

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎమ్మెల్యే కావాల‌ని.. ఆయ‌న పిఠాపురంలో గెల‌వాల‌ని చాలా మంది కోరుకుంటున్నారు. ఈ క్ర‌మంలో వారు త‌మ అభిమాన నాయ‌కుడి విజ‌యంకోసం.. మొక్కుల కూడా మొక్కుతున్నారు. ఇలాంటి వారిలో తాజాగా ఓ లేడీ డాక్ట‌ర్ కూడా చేరిపోయారు.

తూర్పుగోదావ‌రి జిల్లా ఉండ్రాజ‌వరానికి చెందిన డాక్ట‌ర్ రామ‌లక్ష్మి.. ఆర్ ఎంపీ డాక్ట‌ర్. ఈమెకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే ఎన‌లేని అభిమానం. అలాగ‌ని పార్టీల ప‌రంగా కాదు. న‌ట‌న ప‌రంగా ఆయనంటే ఎంతో ఎన‌లేని మ‌క్కువ‌.

ఈ నేప‌థ్యంలో డాక్ట‌ర్ రామ‌ల‌క్ష్మి.. తాజాగా ముగిసిన ఎన్నికల్లో ప‌వ‌న్ కళ్యాణ్ విజ‌యం ద‌క్కించుకోవాల‌ని కాంక్షిస్తూ.. ఏకంగా.. తిరుమల శ్రీవారి ఏడు కొండ‌ల మెట్లు ఎక్కారు.

అది కూడా.. సాధార‌ణ పాదాల‌తో కాదు.. మోకాళ్ల‌పై ఎక్కి మ‌రీ మొక్కు తీర్చుకున్నారు. వాస్తవానికి మోకాళ్ల‌పై కొంత దూరం వ‌ర‌కు న‌డ‌వాలం టేనే మ‌న‌కు ఇబ్బంది. అలాంటిది.. ఏడు కొండ‌ల మెట్ల‌ను మోకాళ్ల‌పై ఎక్క‌డం అంటే.. మామూలు విష యం కాదు. అయిన‌ప్పికీ రామ‌లక్ష్మి దీనిని సాధించారు.

వాస్తవానికి మే 25నే త‌న మొక్కు తీర్చుకున్న రామల‌క్ష్మి తాజాగా మీడియాకు ఈ విష‌యాన్ని వెల్ల‌డించా రు. ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ విజ‌యం సాధించాలి. అందుకే తిరుమ‌ల శ్రీవారిని మెక్కుకున్నా. అందులో భాగంగానే 450 మెట్లు మోకాళ్ల‌పై ఎక్కి మొక్కు తీర్చుకున్నా. పార్టీల‌తో నాకు సంబంధం లేదు. కేవ‌లం ప‌వ‌న్ పై ఉన్న అభిమానంతోనే ఇలా చేశా ఆయ‌న భారీ మెజారిటీతో విజ‌యం సాధించ‌డం ఖాయం అని డాక్ట‌ర్ పసుపులేటి రామ‌ల‌క్ష్మి వ్యాఖ్యానించారు.

This post was last modified on June 1, 2024 5:02 pm

Share
Show comments
Published by
Satya
Tags: Pawan

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

47 minutes ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

1 hour ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

3 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

8 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

8 hours ago