మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని.. ఈవీఎం ధ్వంసం ఘటనలు, హత్యా యత్నాల ఘటన లు వెంటాడుతున్నాయి. మే 13న జరిగిన పోలింగ్ సమయంలో ఈవీఎం, వీవీప్యాట్లను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఎమ్మెల్యేను నిలదీసిన.. టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై హత్యా యత్నం జరిగింది. సర్కిల్ ఇన్ స్పెక్టర్పైనా హత్యాయత్నం జరిగింది. ఈ మూడు ఘటనల్లోనూ ఏ1గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు.
దీంతో ఆయన పరారు కావడం.. పోలీసులు ఆయన కోసం వెతకడం.. కానీ, ఆయన మాత్రం పట్టుబడక పోవడం ఇదంతా పెద్ద సినీ డ్రామాను తలపించింది. ఎట్టకేలకు హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ వచ్చే వరకు కూడా.. పిన్నెల్లి ఎక్కడ ఉన్నారనేది మాత్రం ఎవరూ గుర్తించలేక పోయారు. కట్ చేస్తే.. ముందస్తు బెయిల్ వచ్చిన తర్వాత.. ఆయన ఎస్పీ కార్యాలయానికి రావడం తెలిసిందే. అక్కడ రోజూ వచ్చి సంతకం చేసి వెళ్లాలని ఆదేశించడంతోపిన్నెల్లి రోజూ వస్తున్నారు.
ఇదిలావుంటే.. ఈ కేసు ఇక్కడితో ముగిసి పోలేదు. తాజాగా టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు… సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పిన్నెల్లి నుంచి తనకు ప్రాణహాని ఉందని సుప్రీం కోర్టులో శేషగిరిరావు పిటిషన్ వేశారు. పిన్నెల్లికి హైకోర్టు ఇచ్చిన అరెస్టు మినహాయింపు ఆదేశాలు రద్దుచేయాలని కోరారు. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో తనపై దాడి చేశారని పేర్కొన్నారు. కౌంటింగ్ రోజు కూడా హింసకు పాల్పడే ప్రమాదం ఉందని వివరించారు.
దీంతోపాటు ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనపై మరో పిటిషన్ కూడా శేషగిరిరావు దాఖలు చేశారు. ఈ కేసుల్లో ఆధారాలున్నా ఎమ్మెల్యే పేరు, అనుచరుల పేర్లు లేకుండా కేసు పెట్టారని పేర్కొన్నారు. గుర్తు తెలియని వ్యక్తులంటూ ఎమ్మెల్యేకు అనుకూలంగా కొందరు పోలీసులు వ్యవహరించారని పేర్కొన్నారు. అంశాలన్నీ హైకోర్టు పరిగణనలోకి తీసుకోకుండా ముందస్తు బెయిల్ ఇచ్చిందని తెలిపారు. తీవ్ర ఘటనలు చోటు చేసుకున్నా.. ముందస్తు బెయిల్ మంజూరు చేయడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో పిన్నెల్లి బెయిల్ రద్దు చేసి తక్షణమే అరెస్టు చేయించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
స్టార్ హీరోయిన్లు ఏదైనా రామాయణ లాంటి పెద్ద సినిమాలో నటించినపుడు వారి ఇమేజ్కు తగ్గ పాత్రలు లేకపోతే.. అభిమానులు ఫీలవడం…
ఏపీలో కూటమి పాలనకు అప్పుడే రెండేళ్లు పూర్తి అయిపోయింది. ఇంకో మూడేళ్లు ఉంటే మరో ఎన్నికలకు కూటమి పార్టీలు సన్నద్ధం కావాల్సిన పరిస్థితి.…
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా మావిగన్ పై ఓ రేంజిలో చర్చ నడుస్తోంది. వైసీపీ అదినేత వైఎస్ జగన్…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే…
మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త…
సంయుక్త మీనన్ ఈ ఏడాది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ…