ఎన్నికలు వచ్చినా.. పార్టీ ఉనికి ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చినా.. తెలంగాణ సెంటిమెంట్ను రాజేయడమే ప్రధాన అస్త్రంగా బీఆర్ఎస్ పార్టీ సాగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన బీఆర్ఎస్.. రాష్ట్రం ఏర్పడ్డాక వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చింది.
ఆ రెండు ఎన్నికల్లోనూ అభివృద్ధిని చెప్పుకోకుండా ఎంత సేపు ఆంధ్రవాళ్లు, తెలంగాణ సెంటిమెంట్ను నమ్ముకుని కేసీఆర్ గట్టెక్కారనే విమర్శలున్నాయి. గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా తెలంగాణ సెంటిమెంట్ను రాజేసేందుకు ప్రయత్నించినా కేసీఆర్ పప్పులుడకలేదు. ఎన్నికల్లో భంగపాటు తప్పలేదు.
ఆ ఎన్నికల్లో ఓటమితో ఒక్కసారిగా తెలంగాణలో కేసీఆర్ పరిస్థితి తలకిందులైంది. బీఆర్ఎస్ పార్టీ ఉనికే ప్రమాదంలో పడే పరిస్థితి నెలకొంది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్కు ఒకట్రెండు సీట్లు కూడా దక్కే పరిస్థితి కనిపించలేదు.
దీంతో పార్టీని కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్ మరోసారి ఆంధ్ర పేరుతో పబ్బం గడుపుకునేందుకు సిద్ధమైందనే టాక్ వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రూపొందించే బాధ్యతలను ఏపీకి చెందిన కీరవాణికి అప్పజెప్పడంపై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం ద్రోహం చేస్తోందని మండిపడుతోంది.
ఇక రాష్ట్ర చిహ్నంలో మార్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తులు చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ మరింతగా విమర్శలకు పదును పెడుతోంది. చిహ్నంలో నుంచి చార్మినార్ను, కాకతీయ కళాతోరణాన్ని ఎలా తొలగిస్తారంటూ ప్రశ్నిస్తోంది. దీనిపై ఆందోళనలకు సైతం దిగుతోంది. చార్మినార్ దగ్గర ఆందోళనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.
అయితే గతంలో కేసీఆర్ హయంలో ఇతర రాష్ట్రాల వారికి కీలక బాధ్యతలు అప్పజెప్పడాన్ని గుర్తుచేస్తూ కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. బతుకమ్మ పాటలను తమిళనాడుకు చెందిన ఏఆర్ రెహమాన్తో కవిత ఎలా పాడించారంటూ కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టును దక్కించుకున్న మేఘా కృష్ణారెడ్డి, యాదాద్రి డిజైన్ను రూపొందించిన ఆనంద్ సాయి ఆంధ్రవాళ్లే కదా అని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. ఇప్పటికైనా ప్రాంతాల మధ్య విభేదాలను సృష్టించే ప్రయత్నాలను మానాలని కేసీఆర్కు హితవు పలుకుతోంది.
This post was last modified on June 1, 2024 12:58 pm
ఒకప్పుడు అప్పు చేయాలంటే భయపడేవాళ్లు, అది అవసరానికి మాత్రమే తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అప్పు చేయడం తప్పు…
కూలీ సినిమా విడుదలకు ముందు దర్శకుడు లోకేష్ కనకరాజ్ భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఎంత చర్చ జరిగిందో.. ఎన్ని ఊహాగానాలు…
అఖిల్ కెరీర్ను మార్చేస్తుందని.. అతడిని పెద్ద స్టార్ను చేస్తుందని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అతనొక్కడే,…
ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ…
రాష్ట్రంలోని ఒక్కొక్క నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కొక్క విధంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం లో ఉన్న పార్టీల వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ..…
స్వంత అభిమాని హత్య కేసులో అభియోగం ఎదురుకుంటున్న శాండల్ వుడ్ హీరో దర్శన్ ఎప్పుడు బయటికి వస్తాడో లేదా నేరం…