Political News

ఇంకెన్ని రోజులు ఆంధ్ర పేరుతో ప‌బ్బం గ‌డుపుకుంటారు?

ఎన్నిక‌లు వ‌చ్చినా.. పార్టీ ఉనికి ప్ర‌మాదంలో ప‌డే ప‌రిస్థితి వ‌చ్చినా.. తెలంగాణ సెంటిమెంట్‌ను రాజేయ‌డ‌మే ప్ర‌ధాన అస్త్రంగా బీఆర్ఎస్ పార్టీ సాగుతోంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్య‌మించిన బీఆర్ఎస్‌.. రాష్ట్రం ఏర్ప‌డ్డాక వ‌రుస‌గా రెండు సార్లు అధికారంలోకి వ‌చ్చింది.

ఆ రెండు ఎన్నిక‌ల్లోనూ అభివృద్ధిని చెప్పుకోకుండా ఎంత సేపు ఆంధ్ర‌వాళ్లు, తెలంగాణ సెంటిమెంట్‌ను న‌మ్ముకుని కేసీఆర్ గట్టెక్కార‌నే విమ‌ర్శ‌లున్నాయి. గ‌తేడాది అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు కూడా తెలంగాణ సెంటిమెంట్‌ను రాజేసేందుకు ప్ర‌య‌త్నించినా కేసీఆర్ ప‌ప్పులుడ‌క‌లేదు. ఎన్నిక‌ల్లో భంగ‌పాటు త‌ప్ప‌లేదు.

ఆ ఎన్నిక‌ల్లో ఓట‌మితో ఒక్క‌సారిగా తెలంగాణ‌లో కేసీఆర్ ప‌రిస్థితి త‌ల‌కిందులైంది. బీఆర్ఎస్ పార్టీ ఉనికే ప్ర‌మాదంలో ప‌డే ప‌రిస్థితి నెల‌కొంది. ఇటీవ‌ల జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లోనూ బీఆర్ఎస్‌కు ఒకట్రెండు సీట్లు కూడా ద‌క్కే ప‌రిస్థితి క‌నిపించ‌లేదు.

దీంతో పార్టీని కాపాడుకోవ‌డం కోసం బీఆర్ఎస్ మ‌రోసారి ఆంధ్ర పేరుతో ప‌బ్బం గ‌డుపుకునేందుకు సిద్ధ‌మైంద‌నే టాక్ వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రూపొందించే బాధ్య‌త‌ల‌ను ఏపీకి చెందిన కీర‌వాణికి అప్ప‌జెప్ప‌డంపై బీఆర్ఎస్ తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తోంది. తెలంగాణ‌కు కాంగ్రెస్ ప్ర‌భుత్వం ద్రోహం చేస్తోంద‌ని మండిప‌డుతోంది.

ఇక రాష్ట్ర చిహ్నంలో మార్పుల‌కు కాంగ్రెస్ ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తులు చేస్తున్న నేప‌థ్యంలో బీఆర్ఎస్ మ‌రింత‌గా విమ‌ర్శ‌ల‌కు ప‌దును పెడుతోంది. చిహ్నంలో నుంచి చార్మినార్‌ను, కాక‌తీయ క‌ళాతోర‌ణాన్ని ఎలా తొల‌గిస్తారంటూ ప్ర‌శ్నిస్తోంది. దీనిపై ఆందోళ‌న‌ల‌కు సైతం దిగుతోంది. చార్మినార్ ద‌గ్గ‌ర ఆందోళ‌న‌లో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.

అయితే గ‌తంలో కేసీఆర్ హ‌యంలో ఇత‌ర రాష్ట్రాల వారికి కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌జెప్ప‌డాన్ని గుర్తుచేస్తూ కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. బతుక‌మ్మ పాట‌ల‌ను త‌మిళ‌నాడుకు చెందిన ఏఆర్ రెహ‌మాన్‌తో క‌విత ఎలా పాడించారంటూ కాంగ్రెస్ ప్ర‌శ్నిస్తోంది. అలాగే కాళేశ్వ‌రం ప్రాజెక్టును ద‌క్కించుకున్న మేఘా కృష్ణారెడ్డి, యాదాద్రి డిజైన్‌ను రూపొందించిన ఆనంద్ సాయి ఆంధ్ర‌వాళ్లే క‌దా అని కాంగ్రెస్ కౌంట‌ర్ ఇస్తోంది. ఇప్ప‌టికైనా ప్రాంతాల మ‌ధ్య విభేదాల‌ను సృష్టించే ప్ర‌య‌త్నాల‌ను మానాల‌ని కేసీఆర్‌కు హిత‌వు ప‌లుకుతోంది.

This post was last modified on June 1, 2024 12:58 pm

Share
Show comments
Published by
Satya
Tags: Andhra

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

18 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago