Political News

ఇంకెన్ని రోజులు ఆంధ్ర పేరుతో ప‌బ్బం గ‌డుపుకుంటారు?

ఎన్నిక‌లు వ‌చ్చినా.. పార్టీ ఉనికి ప్ర‌మాదంలో ప‌డే ప‌రిస్థితి వ‌చ్చినా.. తెలంగాణ సెంటిమెంట్‌ను రాజేయ‌డ‌మే ప్ర‌ధాన అస్త్రంగా బీఆర్ఎస్ పార్టీ సాగుతోంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్య‌మించిన బీఆర్ఎస్‌.. రాష్ట్రం ఏర్ప‌డ్డాక వ‌రుస‌గా రెండు సార్లు అధికారంలోకి వ‌చ్చింది.

ఆ రెండు ఎన్నిక‌ల్లోనూ అభివృద్ధిని చెప్పుకోకుండా ఎంత సేపు ఆంధ్ర‌వాళ్లు, తెలంగాణ సెంటిమెంట్‌ను న‌మ్ముకుని కేసీఆర్ గట్టెక్కార‌నే విమ‌ర్శ‌లున్నాయి. గ‌తేడాది అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు కూడా తెలంగాణ సెంటిమెంట్‌ను రాజేసేందుకు ప్ర‌య‌త్నించినా కేసీఆర్ ప‌ప్పులుడ‌క‌లేదు. ఎన్నిక‌ల్లో భంగ‌పాటు త‌ప్ప‌లేదు.

ఆ ఎన్నిక‌ల్లో ఓట‌మితో ఒక్క‌సారిగా తెలంగాణ‌లో కేసీఆర్ ప‌రిస్థితి త‌ల‌కిందులైంది. బీఆర్ఎస్ పార్టీ ఉనికే ప్ర‌మాదంలో ప‌డే ప‌రిస్థితి నెల‌కొంది. ఇటీవ‌ల జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లోనూ బీఆర్ఎస్‌కు ఒకట్రెండు సీట్లు కూడా ద‌క్కే ప‌రిస్థితి క‌నిపించ‌లేదు.

దీంతో పార్టీని కాపాడుకోవ‌డం కోసం బీఆర్ఎస్ మ‌రోసారి ఆంధ్ర పేరుతో ప‌బ్బం గ‌డుపుకునేందుకు సిద్ధ‌మైంద‌నే టాక్ వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రూపొందించే బాధ్య‌త‌ల‌ను ఏపీకి చెందిన కీర‌వాణికి అప్ప‌జెప్ప‌డంపై బీఆర్ఎస్ తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తోంది. తెలంగాణ‌కు కాంగ్రెస్ ప్ర‌భుత్వం ద్రోహం చేస్తోంద‌ని మండిప‌డుతోంది.

ఇక రాష్ట్ర చిహ్నంలో మార్పుల‌కు కాంగ్రెస్ ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తులు చేస్తున్న నేప‌థ్యంలో బీఆర్ఎస్ మ‌రింత‌గా విమ‌ర్శ‌ల‌కు ప‌దును పెడుతోంది. చిహ్నంలో నుంచి చార్మినార్‌ను, కాక‌తీయ క‌ళాతోర‌ణాన్ని ఎలా తొల‌గిస్తారంటూ ప్ర‌శ్నిస్తోంది. దీనిపై ఆందోళ‌న‌ల‌కు సైతం దిగుతోంది. చార్మినార్ ద‌గ్గ‌ర ఆందోళ‌న‌లో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.

అయితే గ‌తంలో కేసీఆర్ హ‌యంలో ఇత‌ర రాష్ట్రాల వారికి కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌జెప్ప‌డాన్ని గుర్తుచేస్తూ కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. బతుక‌మ్మ పాట‌ల‌ను త‌మిళ‌నాడుకు చెందిన ఏఆర్ రెహ‌మాన్‌తో క‌విత ఎలా పాడించారంటూ కాంగ్రెస్ ప్ర‌శ్నిస్తోంది. అలాగే కాళేశ్వ‌రం ప్రాజెక్టును ద‌క్కించుకున్న మేఘా కృష్ణారెడ్డి, యాదాద్రి డిజైన్‌ను రూపొందించిన ఆనంద్ సాయి ఆంధ్ర‌వాళ్లే క‌దా అని కాంగ్రెస్ కౌంట‌ర్ ఇస్తోంది. ఇప్ప‌టికైనా ప్రాంతాల మ‌ధ్య విభేదాల‌ను సృష్టించే ప్ర‌య‌త్నాల‌ను మానాల‌ని కేసీఆర్‌కు హిత‌వు ప‌లుకుతోంది.

This post was last modified on June 1, 2024 12:58 pm

Share
Show comments
Published by
Satya
Tags: Andhra

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

3 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

6 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago