తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడులను అంగరంగవైభవంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సీఎం రేవంత్రెడ్డి ఈ వేడుకలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ జాతీయ గీతం వంటివాటిని ఆవిష్కరించనున్నారు. ఆదివారం జరగనున్న ఈ కార్యక్రమం … నభూతో అన్నట్టుగా నిర్వహించేలా సర్కారు ఏర్పాట్లు చేసింది. దీనికి ఎంతో మంది ఉద్యమకారులను కూడా ఆహ్వానించింది. మాజీ సీఎం కేసీఆర్ను కూడా పిలిచారు.
ఇక, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు.. సోనియా గాంధీ ని కూడా ప్రభుత్వం సాదరంగా ఆహ్వానించింది. ముందు వస్తారని భావించినా.. చివరి నిముషంలో సోనియా గాంధీ పర్యటన రద్దయింది. అనారోగ్య కారణాలతో తాను రాలేక పోతున్నానని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు పార్టీ కీలక నాయకుల కు సోనియా ఫోన్ చేసి మరీ చెప్పినట్టు సమాచారం. తన ఆరోగ్యం బాగోలేదని.. రావాలని ప్రయత్నించా నని ఆమె తెలిపారు.
దీంతో కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న ఆశలు నీరుగారాయి. ఇక, ఈ కార్యక్రమానికి రావాలంటూ.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి భట్టి విక్రమార్కలు.. గవర్నర్ రాధాకృష్ణను కలిశారు. ఆయనకు పుష్పగుఛ్ఛం అందించి..ఆహ్వాన పత్రికను ఇచ్చి సాదరంగా ఆహ్వానం పలికారు. మరి ఆయన అయినా.. వస్తారో లేదో చూడాలి. ఇక, మాజీ సీఎం కేసీఆర్ వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఆయన సొంతగానే కార్యక్రమాలు చేసుకుంటున్న నేపథ్యంలో సర్కారు కార్యక్రమానికి రారని భావిస్తున్నారు.
This post was last modified on June 1, 2024 12:53 pm
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…