ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారు? ఎవరు.. ప్రతిపక్షంలో కూర్చుంటారు? అనేది తేలేందుకు.. మరో ఐదు రోజుల వరకు వేచి చూడక తప్పదు. జూన్ 4న కానీ.. సార్వత్రిక ఎన్నికల ఫలితం వచ్చే అవకాశం లేదు.. అప్పటి వరకు ఎవరికీ నిద్ర పట్టడం లేదు. అయితే…. ఈ మధ్య కాలంలో ఎవరి అంచనాలు వారి వి. ఎవరి లెక్కలు వారికిసొంతం. మేమే గెలుస్తున్నామని.. వైసీపీ చెబుతోంది. కానీ, దుష్ట పాలనకు చరమ గీతం పాడి.. తమకే ప్రజలు పట్టం కట్టారని.. టీడీపీ ద్వితీయ స్థాయి నాయకులు చెబుతున్నారు.
మొత్తంగా రాష్ట్రంలో అయితే.. ఒక గుంభమైన పరిస్థితి నెలకొంది. ఎవరు గెలుస్తారనేది తీవ్ర ఉత్కంఠగానే ఉంది. అయితే.. ప్రాంతాల వారీగా చూసుకుంటే.. ఎవరికైనా 33 సీట్లు చాలా సంక్లిష్టంగా మారాయి. ఆయా స్థానాల్లో విజయం దక్కించుకున్నవారే అధికారం చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా సీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో మొత్తం 33 స్థానాల్లో అత్యంత టఫ్ ఫైట్ జరుగుతోంది. మరో 62 స్థానాల్లో కూడా.. తీవ్రంగా పోటీ ఉంది. ఇక, వైసీపీ ఏకపక్షంగా గెలుచుకునే సీట్లు సీమలో ఉన్నాయి.
టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఉమ్మడిగా దున్నేసే సీట్లు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు సహా ఉమ్మ డి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్నాయి. ప్రకాశంలో ఈ సారి కూటమి క్లీన్ స్వీప్ చేసే అవకాశం కనిపిస్తోం ది. దీంతో ఆ 33 స్థానాల్లో మెజారిటీ సీట్లు దక్కించుకునే వారే అధికారం చేపట్టే అవకాశం ఉంది. వీటిలో ఉత్తరాంధ్రనుంచి సీమ వరకు ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి వర్సెస్ వైసీపీ తీవ్రస్థాయిలో పోరాడుతున్నాయి. బలమైన నాయకులను కూడా పెట్టాయి. దీంతోనే ఈ ఎన్నికలు ఇంత టఫ్గా మారాయి.
ఇక, అనేక సర్వేలు.. అనేక మంది విశ్లేషకులకు కూడా అంతు చిక్కని విషయం కూడా ఇదే కావడం గమ నార్హం. ఆ 33 నుంచి 40 నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారనే విషయాన్ని ఎవరూ పసిగట్టలేక పోతున్నారు. సర్వే సంస్థలు కూడా. ఆ నియోజకవర్గాలే గెలుపు గుర్రాన్ని డిసైడ్ చేస్తాయని చెబుతున్నాయి. కానీ, ఎవరు గెలుస్తారనే పక్కా అంచనాలు మాత్రం రావడం లేదు. ఆ నియోజకవర్గాల్లో గెలిచే వారికే ఏపీ పీఠం దక్కుతుందని అంటున్నారు. చిత్రం ఏంటంటే.. వాటిలోనే ఎక్కువ మంది మహిళలు ఓటేశారు. ఇది మరీ చిత్రంగా మారింది.
This post was last modified on May 31, 2024 5:14 pm
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…