ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారు? ఎవరు.. ప్రతిపక్షంలో కూర్చుంటారు? అనేది తేలేందుకు.. మరో ఐదు రోజుల వరకు వేచి చూడక తప్పదు. జూన్ 4న కానీ.. సార్వత్రిక ఎన్నికల ఫలితం వచ్చే అవకాశం లేదు.. అప్పటి వరకు ఎవరికీ నిద్ర పట్టడం లేదు. అయితే…. ఈ మధ్య కాలంలో ఎవరి అంచనాలు వారి వి. ఎవరి లెక్కలు వారికిసొంతం. మేమే గెలుస్తున్నామని.. వైసీపీ చెబుతోంది. కానీ, దుష్ట పాలనకు చరమ గీతం పాడి.. తమకే ప్రజలు పట్టం కట్టారని.. టీడీపీ ద్వితీయ స్థాయి నాయకులు చెబుతున్నారు.
మొత్తంగా రాష్ట్రంలో అయితే.. ఒక గుంభమైన పరిస్థితి నెలకొంది. ఎవరు గెలుస్తారనేది తీవ్ర ఉత్కంఠగానే ఉంది. అయితే.. ప్రాంతాల వారీగా చూసుకుంటే.. ఎవరికైనా 33 సీట్లు చాలా సంక్లిష్టంగా మారాయి. ఆయా స్థానాల్లో విజయం దక్కించుకున్నవారే అధికారం చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా సీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో మొత్తం 33 స్థానాల్లో అత్యంత టఫ్ ఫైట్ జరుగుతోంది. మరో 62 స్థానాల్లో కూడా.. తీవ్రంగా పోటీ ఉంది. ఇక, వైసీపీ ఏకపక్షంగా గెలుచుకునే సీట్లు సీమలో ఉన్నాయి.
టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఉమ్మడిగా దున్నేసే సీట్లు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు సహా ఉమ్మ డి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్నాయి. ప్రకాశంలో ఈ సారి కూటమి క్లీన్ స్వీప్ చేసే అవకాశం కనిపిస్తోం ది. దీంతో ఆ 33 స్థానాల్లో మెజారిటీ సీట్లు దక్కించుకునే వారే అధికారం చేపట్టే అవకాశం ఉంది. వీటిలో ఉత్తరాంధ్రనుంచి సీమ వరకు ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి వర్సెస్ వైసీపీ తీవ్రస్థాయిలో పోరాడుతున్నాయి. బలమైన నాయకులను కూడా పెట్టాయి. దీంతోనే ఈ ఎన్నికలు ఇంత టఫ్గా మారాయి.
ఇక, అనేక సర్వేలు.. అనేక మంది విశ్లేషకులకు కూడా అంతు చిక్కని విషయం కూడా ఇదే కావడం గమ నార్హం. ఆ 33 నుంచి 40 నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారనే విషయాన్ని ఎవరూ పసిగట్టలేక పోతున్నారు. సర్వే సంస్థలు కూడా. ఆ నియోజకవర్గాలే గెలుపు గుర్రాన్ని డిసైడ్ చేస్తాయని చెబుతున్నాయి. కానీ, ఎవరు గెలుస్తారనే పక్కా అంచనాలు మాత్రం రావడం లేదు. ఆ నియోజకవర్గాల్లో గెలిచే వారికే ఏపీ పీఠం దక్కుతుందని అంటున్నారు. చిత్రం ఏంటంటే.. వాటిలోనే ఎక్కువ మంది మహిళలు ఓటేశారు. ఇది మరీ చిత్రంగా మారింది.
This post was last modified on May 31, 2024 5:14 pm
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇక జైలు ఊచలు లెక్కపెట్టక తప్పేలా లేదు. ఎందుకంటే...తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అనే…
ప్రస్తుతం మంచి ఊపులో షూటింగ్ జరుపుకుంటున్న బాలకృష్ణ - గోపీచంద్ మలినేని మూవీలో ముందు తీసుకున్న హీరోయిన్ నయనతార. ఇది…
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
నిందితులను పోలీసులు పబ్లిక్లో కొట్టడం వంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. అటువంటి సందర్భాల్లో అలా కొట్టడం మానవ హక్కుల ఉల్లంఘన…