Political News

వైసీపీకి షాక్‌: మంత్రుల పేషీల నుంచి చిత్తు కాగితం కూడా తీసుకెళ్ల‌ద్దు!

ఏపీ అధికార పార్టీ వైసీపీకి భారీ షాక్ త‌గిలింది. మంత్రుల పేషీ నుంచి చిత్తు కాగితం కూడా తీసుకువెళ్లేం దుకు వీల్లేద‌ని.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం మార్గ‌ద‌ర్శ‌కాలు పాటించాల‌ని ప్ర‌భుత్వ సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేసింది.

అంతేకాదు.. ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, మంత్రుల పేషీ ల నుంచి ప‌త్రాలు, ఫైళ్లు, ఇత‌ర‌త్రా డిజిట‌ల్ డివైజ్‌ల‌ను కూడా తీసుకు వెళ్ల‌రాద‌ని ఆదేశించింది. ఈ బాధ్య‌త‌ల‌ను కార్యాల‌య సిబ్బందికి అప్ప‌గించింది.

ఇదేస‌మ‌యంలో మంత్రుల పేషీకి ఎవ‌రు వ‌చ్చినా.. ఎవ‌రు వెళ్లినా.. వారిని, వారు ప్ర‌యాణించిన వాహ‌నా న్ని కూడా.. క్షుణ్ణంగా ప‌రిశీలించాల‌ని.. అవ‌స‌ర‌మైతే… పోలీసుల‌కు ఫిర్యాదు చేయాల‌ని కూడా.. ఆదేశించ డం గ‌మ‌నార్హం.

ఎన్నిక‌ల సంఘం ఆదేశాల‌ను అంద‌రూ పాటించాల‌ని సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ ఉత్త‌ర్వు ల్లో స్ప‌ష్టం చేసింది. మ‌రో నాలుగురోజుల్లో మంత్రుల పేషీల‌ను తాము స్వాధీనం చేసుకుంటామ‌ని పేర్కొం ది. ఎన్నిక‌ల పోలింగ్ ఫ‌లితం రావ‌డానికి ముందు రోజు మంత్రుల పేషీల‌ను ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌ను కూడా స్వాధీనం చేసుకుంటాని తెలిపింది.

ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టి నుంచి వ‌చ్చే నెల 3వ తేదీ వ‌ర‌కు మంత్రుల పేషీలు, ప్ర‌భుత్వ కీల‌క కార్యాల‌యా ల‌ను కూడా ప‌రిర‌క్షించాల‌ని, నిఘా ను ముమ్మ‌రం చేయాల‌ని.. సీసీ కెమెరాలు నిరంత‌రం ప‌నిచేసేలా చూడాల‌ని కూడా.. ఆదేశాల్లో పేర్కొంది.

సచివాలయం నుంచి తమ అనుమతి లేకుండా ఎలాంటి పత్రాలు, వస్తువులు తీసుకెళ్లొద్దని స్పష్టం చేసింది. జూన్ 3లోగా మంత్రుల పేషీలకు తాళాలు వేయాల‌ని తెలిపింది. మంత్రుల‌కు సంబంధించిన వ్య‌క్తిగ‌త వ‌స్తువులు(ఫోన్ చార్జ‌ర్లు, ట‌వ‌ళ్లు, పెన్నులువంటివి) తీసుకువెళ్లేందుకు అనుమ‌తి ఉంద‌ని తెలిపింది.

This post was last modified on May 31, 2024 5:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

1 hour ago

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

2 hours ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

2 hours ago

శర్వానంద్ భోగికి అసలైన ఛాలెంజ్

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

3 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

3 hours ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

4 hours ago