Political News

వైసీపీకి షాక్‌: మంత్రుల పేషీల నుంచి చిత్తు కాగితం కూడా తీసుకెళ్ల‌ద్దు!

ఏపీ అధికార పార్టీ వైసీపీకి భారీ షాక్ త‌గిలింది. మంత్రుల పేషీ నుంచి చిత్తు కాగితం కూడా తీసుకువెళ్లేం దుకు వీల్లేద‌ని.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం మార్గ‌ద‌ర్శ‌కాలు పాటించాల‌ని ప్ర‌భుత్వ సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేసింది.

అంతేకాదు.. ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, మంత్రుల పేషీ ల నుంచి ప‌త్రాలు, ఫైళ్లు, ఇత‌ర‌త్రా డిజిట‌ల్ డివైజ్‌ల‌ను కూడా తీసుకు వెళ్ల‌రాద‌ని ఆదేశించింది. ఈ బాధ్య‌త‌ల‌ను కార్యాల‌య సిబ్బందికి అప్ప‌గించింది.

ఇదేస‌మ‌యంలో మంత్రుల పేషీకి ఎవ‌రు వ‌చ్చినా.. ఎవ‌రు వెళ్లినా.. వారిని, వారు ప్ర‌యాణించిన వాహ‌నా న్ని కూడా.. క్షుణ్ణంగా ప‌రిశీలించాల‌ని.. అవ‌స‌ర‌మైతే… పోలీసుల‌కు ఫిర్యాదు చేయాల‌ని కూడా.. ఆదేశించ డం గ‌మ‌నార్హం.

ఎన్నిక‌ల సంఘం ఆదేశాల‌ను అంద‌రూ పాటించాల‌ని సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ ఉత్త‌ర్వు ల్లో స్ప‌ష్టం చేసింది. మ‌రో నాలుగురోజుల్లో మంత్రుల పేషీల‌ను తాము స్వాధీనం చేసుకుంటామ‌ని పేర్కొం ది. ఎన్నిక‌ల పోలింగ్ ఫ‌లితం రావ‌డానికి ముందు రోజు మంత్రుల పేషీల‌ను ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌ను కూడా స్వాధీనం చేసుకుంటాని తెలిపింది.

ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టి నుంచి వ‌చ్చే నెల 3వ తేదీ వ‌ర‌కు మంత్రుల పేషీలు, ప్ర‌భుత్వ కీల‌క కార్యాల‌యా ల‌ను కూడా ప‌రిర‌క్షించాల‌ని, నిఘా ను ముమ్మ‌రం చేయాల‌ని.. సీసీ కెమెరాలు నిరంత‌రం ప‌నిచేసేలా చూడాల‌ని కూడా.. ఆదేశాల్లో పేర్కొంది.

సచివాలయం నుంచి తమ అనుమతి లేకుండా ఎలాంటి పత్రాలు, వస్తువులు తీసుకెళ్లొద్దని స్పష్టం చేసింది. జూన్ 3లోగా మంత్రుల పేషీలకు తాళాలు వేయాల‌ని తెలిపింది. మంత్రుల‌కు సంబంధించిన వ్య‌క్తిగ‌త వ‌స్తువులు(ఫోన్ చార్జ‌ర్లు, ట‌వ‌ళ్లు, పెన్నులువంటివి) తీసుకువెళ్లేందుకు అనుమ‌తి ఉంద‌ని తెలిపింది.

This post was last modified on May 31, 2024 5:02 pm

Share

Recent Posts

జగన్ కు జైల్లో అవమానం?

కర్నూలు జైల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కర్నూలులో పర్యటించిన సంగతి…

1 hour ago

దొంగతనం చేసిన ఇంట్లోనే నిద్రపోయిన దొంగ!

ఓ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చిన దొంగ ఆ ఇంట్లో వస్తువులు దొంగిలించడం…ఆకలేయడంతో ఆ ఇంట్లోనే తినేసి నిద్రలోకి జారుకోవడం…తీరా…

3 hours ago

పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎంపై హత్యాయత్నం… పొత్తే కారణమా?

పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై హత్యాయత్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం…

3 hours ago

ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మద్దతు

రాజ్యసభలో విపక్షనేత, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హల్ద్వానిలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన ర్యాలీ ప్రదేశాన్ని శ్రీరామ్…

6 hours ago

అతిగా ఫోన్ వాడిన షకీలా ఇప్పుడు ఎలా ఉందంటే…

ఒకప్పుడు షకీలాకు సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. వరుస సినిమాలు, భారీ గుర్తింపు, తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌తో…

6 hours ago

ఫ్యాన్స్ వద్దా జాన్వీ మేడమ్?

ఏఐ రంగప్రవేశం తర్వాత తమ ఫొటోలు, వీడియోలను ఇష్టానుసారం వాడేస్తున్న నేపథ్యంలో పర్సనాలిటీ రైట్స్ కోసం ఫిలిం సెలబ్రెటీలను న్యాయస్థానాలను…

6 hours ago