Political News

వైసీపీకి షాక్‌: మంత్రుల పేషీల నుంచి చిత్తు కాగితం కూడా తీసుకెళ్ల‌ద్దు!

ఏపీ అధికార పార్టీ వైసీపీకి భారీ షాక్ త‌గిలింది. మంత్రుల పేషీ నుంచి చిత్తు కాగితం కూడా తీసుకువెళ్లేం దుకు వీల్లేద‌ని.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం మార్గ‌ద‌ర్శ‌కాలు పాటించాల‌ని ప్ర‌భుత్వ సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేసింది.

అంతేకాదు.. ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, మంత్రుల పేషీ ల నుంచి ప‌త్రాలు, ఫైళ్లు, ఇత‌ర‌త్రా డిజిట‌ల్ డివైజ్‌ల‌ను కూడా తీసుకు వెళ్ల‌రాద‌ని ఆదేశించింది. ఈ బాధ్య‌త‌ల‌ను కార్యాల‌య సిబ్బందికి అప్ప‌గించింది.

ఇదేస‌మ‌యంలో మంత్రుల పేషీకి ఎవ‌రు వ‌చ్చినా.. ఎవ‌రు వెళ్లినా.. వారిని, వారు ప్ర‌యాణించిన వాహ‌నా న్ని కూడా.. క్షుణ్ణంగా ప‌రిశీలించాల‌ని.. అవ‌స‌ర‌మైతే… పోలీసుల‌కు ఫిర్యాదు చేయాల‌ని కూడా.. ఆదేశించ డం గ‌మ‌నార్హం.

ఎన్నిక‌ల సంఘం ఆదేశాల‌ను అంద‌రూ పాటించాల‌ని సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ ఉత్త‌ర్వు ల్లో స్ప‌ష్టం చేసింది. మ‌రో నాలుగురోజుల్లో మంత్రుల పేషీల‌ను తాము స్వాధీనం చేసుకుంటామ‌ని పేర్కొం ది. ఎన్నిక‌ల పోలింగ్ ఫ‌లితం రావ‌డానికి ముందు రోజు మంత్రుల పేషీల‌ను ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌ను కూడా స్వాధీనం చేసుకుంటాని తెలిపింది.

ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టి నుంచి వ‌చ్చే నెల 3వ తేదీ వ‌ర‌కు మంత్రుల పేషీలు, ప్ర‌భుత్వ కీల‌క కార్యాల‌యా ల‌ను కూడా ప‌రిర‌క్షించాల‌ని, నిఘా ను ముమ్మ‌రం చేయాల‌ని.. సీసీ కెమెరాలు నిరంత‌రం ప‌నిచేసేలా చూడాల‌ని కూడా.. ఆదేశాల్లో పేర్కొంది.

సచివాలయం నుంచి తమ అనుమతి లేకుండా ఎలాంటి పత్రాలు, వస్తువులు తీసుకెళ్లొద్దని స్పష్టం చేసింది. జూన్ 3లోగా మంత్రుల పేషీలకు తాళాలు వేయాల‌ని తెలిపింది. మంత్రుల‌కు సంబంధించిన వ్య‌క్తిగ‌త వ‌స్తువులు(ఫోన్ చార్జ‌ర్లు, ట‌వ‌ళ్లు, పెన్నులువంటివి) తీసుకువెళ్లేందుకు అనుమ‌తి ఉంద‌ని తెలిపింది.

This post was last modified on May 31, 2024 5:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

54 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

1 hour ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago