ఏపీ అధికార పార్టీ వైసీపీకి భారీ షాక్ తగిలింది. మంత్రుల పేషీ నుంచి చిత్తు కాగితం కూడా తీసుకువెళ్లేం దుకు వీల్లేదని.. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు పాటించాలని ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
అంతేకాదు.. ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రుల పేషీ ల నుంచి పత్రాలు, ఫైళ్లు, ఇతరత్రా డిజిటల్ డివైజ్లను కూడా తీసుకు వెళ్లరాదని ఆదేశించింది. ఈ బాధ్యతలను కార్యాలయ సిబ్బందికి అప్పగించింది.
ఇదేసమయంలో మంత్రుల పేషీకి ఎవరు వచ్చినా.. ఎవరు వెళ్లినా.. వారిని, వారు ప్రయాణించిన వాహనా న్ని కూడా.. క్షుణ్ణంగా పరిశీలించాలని.. అవసరమైతే… పోలీసులకు ఫిర్యాదు చేయాలని కూడా.. ఆదేశించ డం గమనార్హం.
ఎన్నికల సంఘం ఆదేశాలను అందరూ పాటించాలని సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వు ల్లో స్పష్టం చేసింది. మరో నాలుగురోజుల్లో మంత్రుల పేషీలను తాము స్వాధీనం చేసుకుంటామని పేర్కొం ది. ఎన్నికల పోలింగ్ ఫలితం రావడానికి ముందు రోజు మంత్రుల పేషీలను ప్రభుత్వ కార్యాలయాలను కూడా స్వాధీనం చేసుకుంటాని తెలిపింది.
ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు మంత్రుల పేషీలు, ప్రభుత్వ కీలక కార్యాలయా లను కూడా పరిరక్షించాలని, నిఘా ను ముమ్మరం చేయాలని.. సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూడాలని కూడా.. ఆదేశాల్లో పేర్కొంది.
సచివాలయం నుంచి తమ అనుమతి లేకుండా ఎలాంటి పత్రాలు, వస్తువులు తీసుకెళ్లొద్దని స్పష్టం చేసింది. జూన్ 3లోగా మంత్రుల పేషీలకు తాళాలు వేయాలని తెలిపింది. మంత్రులకు సంబంధించిన వ్యక్తిగత వస్తువులు(ఫోన్ చార్జర్లు, టవళ్లు, పెన్నులువంటివి) తీసుకువెళ్లేందుకు అనుమతి ఉందని తెలిపింది.
ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…
అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…
అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు ఎప్పుడు కష్టం వచ్చినా… ఆదుకునేందుకు కర్ణాకట కొత్త సీఎం డీకే శివకుమార్ సదా…