ఏపీ అధికార పార్టీ వైసీపీకి భారీ షాక్ తగిలింది. మంత్రుల పేషీ నుంచి చిత్తు కాగితం కూడా తీసుకువెళ్లేం దుకు వీల్లేదని.. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు పాటించాలని ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
అంతేకాదు.. ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రుల పేషీ ల నుంచి పత్రాలు, ఫైళ్లు, ఇతరత్రా డిజిటల్ డివైజ్లను కూడా తీసుకు వెళ్లరాదని ఆదేశించింది. ఈ బాధ్యతలను కార్యాలయ సిబ్బందికి అప్పగించింది.
ఇదేసమయంలో మంత్రుల పేషీకి ఎవరు వచ్చినా.. ఎవరు వెళ్లినా.. వారిని, వారు ప్రయాణించిన వాహనా న్ని కూడా.. క్షుణ్ణంగా పరిశీలించాలని.. అవసరమైతే… పోలీసులకు ఫిర్యాదు చేయాలని కూడా.. ఆదేశించ డం గమనార్హం.
ఎన్నికల సంఘం ఆదేశాలను అందరూ పాటించాలని సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వు ల్లో స్పష్టం చేసింది. మరో నాలుగురోజుల్లో మంత్రుల పేషీలను తాము స్వాధీనం చేసుకుంటామని పేర్కొం ది. ఎన్నికల పోలింగ్ ఫలితం రావడానికి ముందు రోజు మంత్రుల పేషీలను ప్రభుత్వ కార్యాలయాలను కూడా స్వాధీనం చేసుకుంటాని తెలిపింది.
ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు మంత్రుల పేషీలు, ప్రభుత్వ కీలక కార్యాలయా లను కూడా పరిరక్షించాలని, నిఘా ను ముమ్మరం చేయాలని.. సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూడాలని కూడా.. ఆదేశాల్లో పేర్కొంది.
సచివాలయం నుంచి తమ అనుమతి లేకుండా ఎలాంటి పత్రాలు, వస్తువులు తీసుకెళ్లొద్దని స్పష్టం చేసింది. జూన్ 3లోగా మంత్రుల పేషీలకు తాళాలు వేయాలని తెలిపింది. మంత్రులకు సంబంధించిన వ్యక్తిగత వస్తువులు(ఫోన్ చార్జర్లు, టవళ్లు, పెన్నులువంటివి) తీసుకువెళ్లేందుకు అనుమతి ఉందని తెలిపింది.
This post was last modified on May 31, 2024 5:02 pm
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
రేపు కొత్త శుక్రవారం వచ్చేస్తోంది. సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తిగా అయిపోవడంతో ఇప్పుడు మూవీ లవర్స్ దృష్టి వీటివైపు వెళ్లాల్సి…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…