ఏపీకి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టు ఊరటనిచ్చింది. ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ.. కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తూ.. తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేయాలని కోరుతూ.. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టి వేసింది. వాస్తవానికి ఈ పిటిష న్పై ఇప్పటికే వాదనలు కూడా పూర్తయ్యాయి.
తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు.. తాజాగా గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. అసలు పిటిషన్నే కొట్టివేయడం గమనార్హం. ఇది ఒకరకంగా సీఎం జగన్కు ఎదురుదెబ్బేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు.. హైకోర్టు పిటిషన్ కొట్టేయడంతో ఏబీవీకి లైన్ క్లియర్ అయింది. అయితే.. ఇప్పుడు ప్రభుత్వం ఆయన విషయంలో ఏం చేస్తుందనేది ఆసక్తగా మారింది. 2019లో జగన్ అధికారంలొకి వచ్చిన నాటి నుంచి ఏబీవీపై సస్పెన్షన్ విధించారు.
ఏబీవీ కుమారుడు ఇజ్రాయెల్తో కలిసి స్పై పరికరాల వ్యాపారం చేస్తున్నారని తొలుత పేర్కొంటూ.. ఆయనను సస్పెండ్ చేశారు. దీనిలో ఏబీవీ భాగస్వామ్యం ఉందన్నారు. అయితే.. ఇది నిలవలేదు. సుప్రీంకోర్టు ఆదేశాలతో విధుల్లోకి తీసుకున్నారు. తర్వాత రెండు రోజులకే.. ఆయనపై మరోసారి సస్పెన్షన్ వేటు వేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారంటూ.. అభియోగాలు నమోదు చేశారు. అయితే.. ఈ విషయంలో క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని క్యాట్ పేర్కొంది. సస్పెండ్ చేయడం సరికాదని తెలిపింది.
ఆయనను విధుల్లోకి తీసుకోవడంతోపాటు.. నిలిపివేసిన జీత భత్యాలు కూడా ఇవ్వాలని పేర్కొంది. కానీ, ఈ క్యాట్ ఆదేశాలపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. క్యాట్ పూర్తిగా కేసును పట్టించుకోలేదని.. ఏబీవీ చేసింది నేరమేనని.. ఆయనపై విచారణ కొనసాగుతుందని తెలిపింది. ఈ నేపథ్యంలో క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని అభ్యర్థించింది. అయితే.. ప్రభుత్వం దాఖలు చేసిన ఈ పిటిషన్ ను తాజాగా హైకోర్టు ధర్మాసనం పోచ్చింది.
ఇక్కడ కీలక విషయం ఏంటంటే.. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టే సిన హైకోర్టు.. ఏబీవీకి తక్షణమే విధులు కేటాయించాలని ఆదేశించలేదు. అంతేకాదు.. ప్రభుత్వం వెంటనే స్పందించాలని కూడా సూచించలేదు. దీంతో సర్కారు ఏం చేస్తుందనేది వేచి చూడాలి. సుప్రీంకోర్టుకువెళ్తుందా.. లేక తప్పును దిద్దుకుని ఏబీవీనికరుణిస్తుందా? అనేది ఆసక్తిగామారింది. మరో వైపు ఈ నెల 31తో ఏబీవీ రిటైర్మెంట్ కానున్నారు.
This post was last modified on May 30, 2024 5:49 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…