Political News

ఏబీవీకి లైన్ క్లియ‌ర్‌.. జ‌గ‌న్‌కు ఎదురు దెబ్బ‌!

ఏపీకి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టు ఊర‌టనిచ్చింది. ఆయ‌న‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం విధించిన‌ సస్పెన్షన్ ను  ఎత్తివేస్తూ.. కేంద్ర ప‌రిపాల‌నా ట్రైబ్యున‌ల్ (క్యాట్) ఇచ్చిన ఉత్తర్వుల‌ను స‌మ‌ర్థిస్తూ.. తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో క్యాట్ ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను నిలుపుద‌ల చేయాల‌ని కోరుతూ.. రాష్ట్ర ప్ర‌భుత్వం దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను కొట్టి వేసింది. వాస్త‌వానికి ఈ పిటిష న్‌పై ఇప్ప‌టికే వాద‌న‌లు కూడా పూర్త‌య్యాయి.

తీర్పును రిజ‌ర్వ్ చేసిన హైకోర్టు.. తాజాగా గురువారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. అయితే..  అస‌లు పిటిషన్‌నే కొట్టివేయ‌డం గ‌మ‌నార్హం. ఇది ఒక‌ర‌కంగా సీఎం జ‌గ‌న్‌కు ఎదురుదెబ్బేన‌ని రాజ‌కీయ వ‌ర్గాలు భావిస్తున్నాయి. మ‌రోవైపు.. హైకోర్టు పిటిషన్ కొట్టేయ‌డంతో ఏబీవీకి లైన్ క్లియ‌ర్ అయింది. అయితే.. ఇప్పుడు ప్ర‌భుత్వం ఆయ‌న విష‌యంలో ఏం చేస్తుంద‌నేది ఆస‌క్త‌గా మారింది. 2019లో జ‌గ‌న్ అధికారంలొకి వ‌చ్చిన నాటి నుంచి ఏబీవీపై సస్పెన్ష‌న్ విధించారు.

ఏబీవీ కుమారుడు ఇజ్రాయెల్‌తో క‌లిసి స్పై ప‌రిక‌రాల వ్యాపారం చేస్తున్నార‌ని తొలుత పేర్కొంటూ.. ఆయ‌న‌ను స‌స్పెండ్ చేశారు. దీనిలో ఏబీవీ భాగ‌స్వామ్యం ఉంద‌న్నారు. అయితే.. ఇది నిల‌వ‌లేదు. సుప్రీంకోర్టు ఆదేశాల‌తో విధుల్లోకి తీసుకున్నారు. త‌ర్వాత రెండు రోజుల‌కే.. ఆయ‌న‌పై మ‌రోసారి స‌స్పెన్ష‌న్ వేటు వేశారు. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా మాట్లాడారంటూ.. అభియోగాలు న‌మోదు చేశారు. అయితే.. ఈ విష‌యంలో క్ర‌మ శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క్యాట్ పేర్కొంది. స‌స్పెండ్ చేయ‌డం స‌రికాద‌ని తెలిపింది.

ఆయ‌న‌ను విధుల్లోకి తీసుకోవ‌డంతోపాటు.. నిలిపివేసిన జీత భ‌త్యాలు కూడా ఇవ్వాల‌ని పేర్కొంది. కానీ, ఈ క్యాట్ ఆదేశాల‌పై ప్ర‌భుత్వం హైకోర్టును ఆశ్ర‌యించింది. క్యాట్ పూర్తిగా కేసును ప‌ట్టించుకోలేద‌ని.. ఏబీవీ చేసింది నేర‌మేన‌ని.. ఆయ‌న‌పై విచార‌ణ కొన‌సాగుతుంద‌ని తెలిపింది. ఈ నేప‌థ్యంలో క్యాట్ ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను కొట్టివేయాల‌ని అభ్య‌ర్థించింది. అయితే.. ప్రభుత్వం దాఖ‌లు చేసిన ఈ పిటిషన్ ను తాజాగా హైకోర్టు  ధర్మాసనం పోచ్చింది.

ఇక్క‌డ కీల‌క విష‌యం ఏంటంటే.. ప్ర‌భుత్వం దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను కొట్టే సిన హైకోర్టు.. ఏబీవీకి త‌క్ష‌ణ‌మే విధులు కేటాయించాల‌ని ఆదేశించ‌లేదు. అంతేకాదు.. ప్ర‌భుత్వం వెంట‌నే స్పందించాల‌ని కూడా సూచించ‌లేదు. దీంతో స‌ర్కారు ఏం చేస్తుంద‌నేది వేచి చూడాలి. సుప్రీంకోర్టుకువెళ్తుందా.. లేక త‌ప్పును దిద్దుకుని ఏబీవీనిక‌రుణిస్తుందా?  అనేది ఆస‌క్తిగామారింది. మ‌రో వైపు ఈ నెల 31తో ఏబీవీ రిటైర్మెంట్ కానున్నారు. 

This post was last modified on May 30, 2024 5:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎటెటో వెళ్తున్న జన నాయకుడు గొడవ

సినిమా విడుదల ఎప్పుడో తేలకుండానే పైరసీ బారిన పడిన జన నాయకుడు గొడవ రకరకాల మలుపులు తిరుగుతోంది. ముందు లాయర్ తరపున…

37 minutes ago

తేడా కొడుతోంది అనిరుధ్ భాయ్

సౌత్ మ్యూజిక్ లో సెన్సేషన్ అంటే అనిరుధ్ రవిచందర్ పేరే ముందు గుర్తొస్తుంది. తను పని చేస్తున్నాడని తెలిస్తే చాలు…

1 hour ago

బీఆర్ఎస్‌లో పూర్తి ప్ర‌క్షాళ‌న… కారణమేంటి?

తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…

1 hour ago

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

4 hours ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

5 hours ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

5 hours ago