Political News

అది కాంగ్రెస్ నిర్ణయమా? రేవంత్ నిర్ణయమా?

తెలంగాణలో కొత్తగా రాష్ట్రప్రభుత్వ చిహ్నం, రాష్ట్ర ప్రభుత్వ గీతం నిర్ణయాలు ప్రకంపనలు రేపుతున్నాయి. 2014లో తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాలను తయారు చేయించారు. అందులో చార్మినార్, కాకతీయ కళాతోరణం ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ చార్మినార్, కాకతీయ కళాతోరణాలు రాచరికపు చిహ్నాలు అంటూ వాటిని తొలగిస్తామని ప్రకటించారు.

తాజాగా వాటిని రాష్ట్ర చిహ్నం నుండి తొలగించి కొత్తవి విడుదల చేసే ప్రయత్నాలు తుది దశకు వచ్చాయి. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్ బదులు టీజీగా మార్చింది. ఇక జయజయహే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా, రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం మారుస్తామని ప్రకటించింది. అయితే జయజయహే తెలంగాణ పాటకు మణిశర్మ సంగీతం అందించడం వివాదానికి దారితీసింది. అయితే అది కవి అందెశ్రీ నిర్ణయం అని తనకు సంబంధం లేదని రేవంత్ తేల్చేశాడు.

ఇవన్నీ పక్కన పెడితే గత పదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం గురించి ప్రజాబాహుల్యంలో ఎక్కడా వ్యతిరేకత గానీ, సమీక్ష కానీ జరగలేదు. కాంగ్రెస్ పార్టీ వీటి పట్ల వ్యతిరేకత గానీ, మార్పులు చేర్పులు సూచించడం గానీ పదేళ్ల చరిత్రలో ఎన్నడూ చేయలేదు. ఇక వ్యక్తిగతంగా రేవంత్ కూడా వీటి గురించి మాట్లాడిన దాఖలాలు గానీ, ప్రభుత్వానికి ఒక వినతిపత్రం ఇచ్చిన ఘటన గానీ, మీడియా ప్రకటన కానీ చేసిన పరిస్థితి లేదు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా దీనికి సంబంధించిన హామీలు లేవు.

ఈ నేపథ్యంలో హఠాత్తుగా వీటిని ముందుకేసుకోవడం వెనక కారణం ఏంటన్న ప్రశ్నలు వెంటాడుతున్నాయి. చార్మినార్, కాకతీయ కళాతోరణాలు రాచరిక చిహ్నాలు అంటున్న రేవంత్ తన మనవడికి మాత్రం కాకతీయ రాజు ప్రతాపరుద్రుని స్ఫూర్థితో రుద్రదేవ్ అని ఎలా పెట్టుకున్నారని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఈ నిర్ణయాలు కాంగ్రెస్ కు మేలు చేస్తాయా ? నష్టం చేస్తాయా ? అన్న చర్చ మొదలయింది.

This post was last modified on May 30, 2024 12:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విజయ్ విజయాన్ని ఏడాది ముందే పసిగట్టిన పీకే

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…

48 minutes ago

ఈసారి బీజేపీ బౌండరీ కొట్టింది

దేశంలో ఐదు రాష్ట్రాలకు (ఒకటి కేంద్ర పాలిత అసెంబ్లీ ఉన్న పుదుచ్చేరి) జరిగిన ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో అప్రతిహత…

3 hours ago

టీవీకే విజయ్ డబుల్ బొనాంజా

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…

3 hours ago

మంచి అవకాశం వదిలేస్తావా బంగారం

సమంత మా ఇంటి బంగారం మే 15 రావడం లేదు. ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ ప్రమోషన్స్ నాలుగైదు…

3 hours ago

విజయ్ నిర్మాతలకు ఊహించని పండగ

అదేంటి రాజకీయాల్లో గెలిచిన తర్వాత విజయ్ ఇక సినిమాల్లో నటించడు కదా, మరి నిర్మాతలకు పండగ ఏమిటనుకుంటున్నారా. తమిళనాడు ముఖ్యమంత్రిగా…

4 hours ago

మే నెల బోణీ చేదుగా ఉంది

కొత్త ఏడాదిలో అయిదో నెల వచ్చేసింది. సంక్రాంతి తర్వాత మళ్ళీ సరైన ఊపు కోసం ఎదురు చూస్తున్న బాక్సాఫీస్ కు…

4 hours ago