తెలంగాణలో కొత్తగా రాష్ట్రప్రభుత్వ చిహ్నం, రాష్ట్ర ప్రభుత్వ గీతం నిర్ణయాలు ప్రకంపనలు రేపుతున్నాయి. 2014లో తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాలను తయారు చేయించారు. అందులో చార్మినార్, కాకతీయ కళాతోరణం ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ చార్మినార్, కాకతీయ కళాతోరణాలు రాచరికపు చిహ్నాలు అంటూ వాటిని తొలగిస్తామని ప్రకటించారు.
తాజాగా వాటిని రాష్ట్ర చిహ్నం నుండి తొలగించి కొత్తవి విడుదల చేసే ప్రయత్నాలు తుది దశకు వచ్చాయి. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్ బదులు టీజీగా మార్చింది. ఇక జయజయహే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా, రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం మారుస్తామని ప్రకటించింది. అయితే జయజయహే తెలంగాణ పాటకు మణిశర్మ సంగీతం అందించడం వివాదానికి దారితీసింది. అయితే అది కవి అందెశ్రీ నిర్ణయం అని తనకు సంబంధం లేదని రేవంత్ తేల్చేశాడు.
ఇవన్నీ పక్కన పెడితే గత పదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం గురించి ప్రజాబాహుల్యంలో ఎక్కడా వ్యతిరేకత గానీ, సమీక్ష కానీ జరగలేదు. కాంగ్రెస్ పార్టీ వీటి పట్ల వ్యతిరేకత గానీ, మార్పులు చేర్పులు సూచించడం గానీ పదేళ్ల చరిత్రలో ఎన్నడూ చేయలేదు. ఇక వ్యక్తిగతంగా రేవంత్ కూడా వీటి గురించి మాట్లాడిన దాఖలాలు గానీ, ప్రభుత్వానికి ఒక వినతిపత్రం ఇచ్చిన ఘటన గానీ, మీడియా ప్రకటన కానీ చేసిన పరిస్థితి లేదు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా దీనికి సంబంధించిన హామీలు లేవు.
ఈ నేపథ్యంలో హఠాత్తుగా వీటిని ముందుకేసుకోవడం వెనక కారణం ఏంటన్న ప్రశ్నలు వెంటాడుతున్నాయి. చార్మినార్, కాకతీయ కళాతోరణాలు రాచరిక చిహ్నాలు అంటున్న రేవంత్ తన మనవడికి మాత్రం కాకతీయ రాజు ప్రతాపరుద్రుని స్ఫూర్థితో రుద్రదేవ్ అని ఎలా పెట్టుకున్నారని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఈ నిర్ణయాలు కాంగ్రెస్ కు మేలు చేస్తాయా ? నష్టం చేస్తాయా ? అన్న చర్చ మొదలయింది.
This post was last modified on May 30, 2024 12:05 pm
కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…
స్టార్ హీరోల కుటుంబాల నుంచి అబ్బాయిలు హీరోలుగా మారడం మామూలే. అమ్మాయిలు మాత్రం హీరోయిన్లు కావడం అరుదు. ఐతే సినీ…
నటుడిగా విజయ్ దేవరకొండ.. దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ కెరీర్లను మార్చేసిన సినిమా.. అర్జున్ రెడ్డి. ట్రెండ్ సెట్టర్ అనే…
ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…