Political News

పిన్నెల్లి అరాచ‌కాల‌పై బుక్‌లెట్‌: చ‌రిత్ర‌లో ఫ‌స్ట్!

వైసీపీ ఎమ్మెల్యే, మాచ‌ర్ల శాస‌న స‌భ్యుడు పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి అరాచ‌కాల‌పై బుక్‌లెట్ రూపొందించారు. దీనిని ఎవ‌రు రాశార‌నే విష‌యాన్ని గోప్యంగా ఉంచారు. ఎందుకంటే.. ప్రాణ భ‌యం ఉన్న నేప‌థ్యంలో ఎవ‌రు రాశార‌నే విష‌యం బ‌య‌ట‌కు పొక్క‌లేదు. అయితే.. సోష‌ల్ మీడియాలో మాత్రం పీడిఎఫ్ కాపీ జోరుగా వైర‌ల్ అవుతోంది. ఇలా.. ఒక ఎమ్మెల్యే అరాచ‌కాల‌పై బుక్‌లెట్ రూపొందించ‌డం.. ప్ర‌చారం చేయ‌డం అనేది చ‌రిత్ర‌లో ఇదే తొలిసారి అని పరిశీల‌కులు చెబుతున్నారు. ఇక‌, 23 పేజీలు ఉన్న ఈ బుక్‌లెట్ పూర్తిగా పీడీఎఫ్ కాపీ. ప్రింట్ వెర్ష‌న్ కాదు.

ఈ బుక్‌లెట్‌లో పిన్నెల్లి గ‌త రెండు ద‌శాబ్దాలుగా.. మాచ‌ర్ల‌లో సాగించిన మార‌ణ‌హోమాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు వివ‌రించారు ర‌చ‌యిత‌. రూ.2 ల‌క్ష‌ల ఆస్తి ఉన్న పిన్నెల్లి సోద‌రుల ఆస్తులు రూ.2 వేల కోట్ల‌కు చేరిన వైనాన్ని వివ‌రించారు. అదేవిధంగా దాడులు, దోపిడీలు.. హ‌త్య‌లు, హ‌త్యాయ‌త్నాలు వంటి అనేక అంశాల‌ను ఈ బుక్‌లెట్‌లో వివ‌రించారు. ప్ర‌ధానంగా అమాయ‌కుల‌ను వేధించి.. సొత్తును స్వాధీనం చేసుకోవ‌డం.. ఇళ్ల‌ను, భూముల‌ను క‌బ్జా చేసిన వైనాన్ని కూడా వివ‌రించారు. అధికారంలో అను కూల పార్టీ ఉన్నా.. ప్ర‌తిప‌క్షం ఉన్నా.. పిన్నెల్లి సోద‌రులు(రామ‌కృష్ణారెడ్డి-వెంక‌ట్రామిరెడ్డి) రెచ్చిపోయిన తీరును వివ‌రించారు.

ఇదేస‌మ‌యంలో పిన్నెల్లికి అనుకూలంగా కొంద‌రు వ్య‌వ‌హ‌రించిన తీరును కూడా ర‌చ‌యిత వివ‌రించారు. త‌ద్వారా.. ఇక్క‌డ సాగిన పాశ‌విక పాల‌న‌ను కూడా పేర్కొన్నారు. ఇక‌, పిన్నెల్లి హ‌యాంలో ఒక గ్రామం గ్రామం(రెంట చింత‌ల‌) మొత్తం వ‌ల‌స పోయిన తీరు.. ఇటీవ‌ల ఎన్నిక‌ల సంఘం జోక్యంతో తిరిగి వ‌చ్చిన తీరును స‌మ‌గ్రంగా క‌ళ్ల‌కు క‌ట్టారు. పీఆర్కే ట్యాక్స్ నుంచి ఇసుక‌, మ‌ద్యం, గ్రావెల్ దోపిడీ వ‌ర‌కు అన్నివిష‌యాల‌ను ఈ బుక్‌లెట్‌లో పేర్కొన్నారు. అదేవిధంగా త‌మ‌ను ఎదిరించిన వారిని హ‌త్య చేసిన‌, చేయించిన తీరును కూడా ర‌చ‌యిత పేర్ల‌తో స‌హా వివ‌రించారు. మొత్తంగా ఈ బుక్‌లెట్ పిన్నెల్లి సోద‌రులు సాగించిన దుమారాన్ని క‌ళ్ల‌కు క‌ట్టింది.

కాగా, ఈ నెల 13న జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ లో పాల్వాయి గేటు స‌మీపంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లోకి దౌర్జ‌న్యంగా ప్ర‌వేశించిన ఎమ్మెల్యే పిన్నెల్లి.. ఈవీఎం, వీవీప్యాట్‌ల‌ను ధ్వంసం చేసిన విష‌యం తెలిసిందే. అనంత‌రం.. ఆయ‌న‌పై కేసులు న‌మోదు కావ‌డం.. ఈ విష‌యం తెలిసి ప‌రార‌వ‌డం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే పిన్నెల్లి బాధితులు బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. వారివేద‌న‌ను పంచుకుంటున్నారు.

This post was last modified on May 29, 2024 10:54 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

1 hour ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

6 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

6 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

7 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

8 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

9 hours ago