Political News

జ‌గ‌న్‌పై రాయిదాడి కేసులో నిందితుడికి బెయిల్‌!

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై విజ‌య‌వాడ శివారులోని సింగ్‌న‌గ‌ర్ ప్రాంతంలో జ‌రిగిన రాయి దాడి ఘ‌ట‌నలో ప్ర‌ధాన నిందుతుడు(ఏ1) స‌తీష్‌కు ఉప‌శ‌మ‌నం ల‌భించింది. విజ‌య‌వాడ‌లోని 8వ అద‌న‌పు జిల్లా కోర్టు ఆయ‌నకు బెయిల్ మంజూరు చేసింది. అయితే.. బెయిల్‌కు సంబంధించి కొన్ని ష‌ర‌తులు విదించింది. ప్ర‌తి శ‌నివారం, ఆదివారం సింగ్‌న‌గ‌ర్ పోలీసు స్టేష‌న్‌లో హాజ‌రు కావాల‌ని.. స్టేష‌న్ హౌస్ ఆఫీస‌ర్ ముందు సంత‌కాలు చేయాల‌ని ఆదేశించింది. అదేవిధంగా రూ.50 వేల‌పూచీ క‌త్తు స‌మ‌ర్పించాల‌ని ష‌ర‌తులు విధించింది. కేసుకు సంబంధించి మీడియాకు ఎలాంటి ఇంట‌ర్వ్యూలు, ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇవ్వ‌కూడ‌ద‌ని.. మాట్లాడ‌రాద‌ని తేల్చి చెప్పింది.

అదేవిధంగా రాజ‌కీయ నేత‌ల‌తోనూ ఈ కేసు విష‌యంపై ఎలాంటి స‌మాచారాన్ని పంచుకోరాద‌ని కోర్టు ష‌రతుల్లో పేర్కొంది. దీంతో స‌తీష్‌కు బెయిల్ ల‌భించింది. కాగా, బెయిల్ మంజూరుకు సంబంధించిన పిటిష‌న్ల‌పై సుమారు వారం రోజుల పాటు.. ఈ కోర్టు విచార‌ణ చేసింది. అనంత‌రం.. తీర్పును మంగ‌ళ‌వారం వెలువ‌రించింది. ఇదిలావుంటే.. ఎన్న‌కల ప్ర‌చారంలో భాగంగా సీఎం జ‌గ‌న్ మేమంతా సిద్దం బ‌స్సు యాత్ర నిర్వ‌హించారు. క‌డ‌ప‌లో ప్రారంభ‌మైన ఈ యాత్ర ఏప్రిల్ 13న విజ‌య‌వాడ శివారు.. సింగ్‌న‌గ‌ర్‌కు చేరుకుంది. అయితే.. రాత్రి స‌మ‌యంలో ఇక్క‌డ ఆయ‌న రాయిదాడి జ‌రిగింది. ఆయ‌న‌తో పాటు మాజీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస‌రావు కంటికి కూడా గాయ‌మైంద‌ని స‌ర్కారు తెలిపింది.

ఈ విష‌యంపై రాజ‌కీయ దుమారం కూడా రేగింది. ప్ర‌తిప‌క్షం టీడీపీ సీఎం జ‌గ‌న్‌పై హ‌త్యాయ‌త్నం చేయించింద‌ని వైసీపీ నాయ‌కులు ఆరోపించారు. అయితే.. జ‌గ‌న్ కు త‌గిలింది గుల‌క‌రాయి మాత్ర‌మేన‌ని దీనిని రాజ‌కీయంగా వాడుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని టీడీపీ నేత‌లు ఆరోపించారు. ఈ వివాదం నెల రోజు పాటు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. ఎవ‌రి వాద‌న వారు వినిపించారు. ఈ క్ర‌మంలో కొంద‌రు పోలీసులు కూడా బ‌దిలీ అయ్యారు. అనేక మందిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు చివ‌ర‌కు స‌తీష్ అనే యువ‌కుడి ప్ర‌మేయం ఉంద‌ని గుర్తించి అరెస్టు చేసి జైలుకు త‌ర‌లించారు. తాజాగా ఆయ‌న‌కు బెయిల్ ల‌భించింది.

This post was last modified on May 29, 2024 10:42 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

14 minutes ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

1 hour ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

3 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

3 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

4 hours ago

నెల ముందు కొడుకు మర‌ణం… ఇప్పుడు ఆ న‌టుడు

కొంద‌రు న‌టులు త‌రచుగా సినిమాల్లో క‌నిపిస్తుంటారు. చాలా ఫెమిలియ‌ర్‌గా అనిపిస్తారు. కానీ ఆ న‌టుల పేరేంటో కూడా జ‌నాల‌కు గుర్తుండ‌దు.…

5 hours ago