ఏపీ ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సారి పిఠాపురం శాసనసభ స్థానం నుండి బరిలోకి దిగాడు. వైసీపీ తరపున కాకినాడ ఎంపీ వంగా గీత ఎమ్మెల్యేగా పోటీ చేసింది. ఇద్దరూ కాపు సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో ప్రచారం హోరాహోరీగా సాగింది. జనసేన తరపున మెగా ఫ్యామిలీతో పాటు బుల్లితెర నటులు పిఠాపురం గ్రామాలలో సందడి చేశారు. వైసీపీ తరపున రోజా చేసిన వ్యాఖ్యలకు ధీటుగా కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో జబర్దస్త్ నటుల కౌంటర్లు సీనియర్ రాజకీయ నాయకుల విమర్శలను తలపించాయి.
పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 75 వేలు ఉంటాయని అంచనా. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏకపక్ష విజయం సాధిస్తాడా ? వంగా గీత జనసేన అధినేత పవన్ గెలుపును అడ్డుకోగలిగేంత సత్తా ఉందా ? అన్న అనుమానాలు అందరినీ వెంటాడుతున్నాయి. ప్రచారం చివరిరోజు వచ్చిన ముఖ్యమంత్రి జగన్ వంగాగీతను గెలిపిస్తే ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెడతామని హామీ ఇచ్చారు.
అయితే ఇంకా ఫలితాలకు కొద్దిరోజులు మిగిలి ఉండగానే పిఠాపురం జనసేన, వైసీపీ శ్రేణుల పిచ్చి పీక్స్ కు చేరింది. జనసేన అభిమానులు అప్పుడు ‘మా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్’ అన్న స్టిక్కర్లు తమ వాహనాలకు తగిలించుకుని తిరుగుతున్నారు. తాము మాత్రం తక్కువ తిన్నామా అంటూ వైసీపీ అభిమానులు తమ వాహనాలకు ‘డిప్యూటీ సీఎం వంగా గీత’ అన్న స్టిక్కర్లు వేసుకుని తిరుగుతున్నారు. ఇది చూసిన జనం ‘ఆలు లేదు .. చూలు లేదు .. కొడుకు పేరు సోమలింగం’ అన్నట్లు ఉంది వీళ్ల వ్యవహారం అని ముక్కున వేలేసుకుంటున్నారు.
This post was last modified on May 28, 2024 12:23 pm
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…