ఏపీ ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సారి పిఠాపురం శాసనసభ స్థానం నుండి బరిలోకి దిగాడు. వైసీపీ తరపున కాకినాడ ఎంపీ వంగా గీత ఎమ్మెల్యేగా పోటీ చేసింది. ఇద్దరూ కాపు సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో ప్రచారం హోరాహోరీగా సాగింది. జనసేన తరపున మెగా ఫ్యామిలీతో పాటు బుల్లితెర నటులు పిఠాపురం గ్రామాలలో సందడి చేశారు. వైసీపీ తరపున రోజా చేసిన వ్యాఖ్యలకు ధీటుగా కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో జబర్దస్త్ నటుల కౌంటర్లు సీనియర్ రాజకీయ నాయకుల విమర్శలను తలపించాయి.
పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 75 వేలు ఉంటాయని అంచనా. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏకపక్ష విజయం సాధిస్తాడా ? వంగా గీత జనసేన అధినేత పవన్ గెలుపును అడ్డుకోగలిగేంత సత్తా ఉందా ? అన్న అనుమానాలు అందరినీ వెంటాడుతున్నాయి. ప్రచారం చివరిరోజు వచ్చిన ముఖ్యమంత్రి జగన్ వంగాగీతను గెలిపిస్తే ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెడతామని హామీ ఇచ్చారు.
అయితే ఇంకా ఫలితాలకు కొద్దిరోజులు మిగిలి ఉండగానే పిఠాపురం జనసేన, వైసీపీ శ్రేణుల పిచ్చి పీక్స్ కు చేరింది. జనసేన అభిమానులు అప్పుడు ‘మా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్’ అన్న స్టిక్కర్లు తమ వాహనాలకు తగిలించుకుని తిరుగుతున్నారు. తాము మాత్రం తక్కువ తిన్నామా అంటూ వైసీపీ అభిమానులు తమ వాహనాలకు ‘డిప్యూటీ సీఎం వంగా గీత’ అన్న స్టిక్కర్లు వేసుకుని తిరుగుతున్నారు. ఇది చూసిన జనం ‘ఆలు లేదు .. చూలు లేదు .. కొడుకు పేరు సోమలింగం’ అన్నట్లు ఉంది వీళ్ల వ్యవహారం అని ముక్కున వేలేసుకుంటున్నారు.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…