తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. పార్లమెంటు ఎన్నికల వరకు చాలా మౌనంగా ఉంది. ఎన్నికలను మాత్రమే రాజకీయంగా చూసింది. విమర్శలు-ప్రతివిమర్శలు.. సవాళ్లు ప్రతిసవాళ్లు రువ్వుకుంది. ఇది ముగిసిపోయింది. అయితే.. ఇప్పుడు అసలు కథ మొదలు పెట్టిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం.. మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఎంపిక చేసిన.. తెలంగాణ తల్లి విగ్రహం నుంచి రాష్ట్ర అధికారిక చిహ్నం వరకు.. సమూలంగా మార్పులు చేస్తున్నారు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మరింత రాజకీయంగా చర్చనీయాంశం అయింది.
ఎందుకు?
ప్రస్తుతం రేవంత్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయించారు. కానీ, దీనిని తొలినాళ్లలో అప్పటి సీఎం కేసీఆర్ ముచ్చటపడి మరీ.. చేయించుకున్నారు. దీనికి ఆయన పెద్ద అధ్యయనమే చేయించారు. అనేక విమర్శలు.. ప్రతి విమర్శలు వచ్చినా.. మా తల్లి మాయిష్టం అంటూ.. కౌంటర్లు ఇచ్చారు. అంటే.. ఒక రకంగా.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే.. వెంటనే కేసీఆర్ గుర్తుకు వస్తారు. ఇదే.. ఇప్పుడు మార్పునకు దారితీసిందనే.. వాదన వినిపిస్తోంది.
ఇక, రాష్ట్ర అధికార చిహ్నంలోనూ మార్పులు చేయిస్తున్నారు సీఎం రేవంత్రెడ్డి. అధికార చిహ్నంలో ఓరుగల్లు కోట ముఖ చిత్రం ఉంది. ఇది రాజకీయ వంశాలకు చిహ్నమని.. కాబట్టి తొలగిస్తున్నామని అన్నారు. అంతేకాదు.. ఇప్పుడు మరిన్ని మార్పులు చేయిస్తున్నారు. ప్రముఖ చిత్రకారుడు రుద్ర రాజేశం రాష్ట్ర అధికార చిహ్నాన్ని తీర్చిదిద్దుతున్నారు. దీనిని కూడా జూన్ 2 న ఆవిష్కరించనున్నారు. అయితే.. ఇది కూడా అప్పటి సీఎం కేసీఆర్ దగ్గరుండి.. చేయించుకున్న చిహ్నం. ఇప్పుడు దీనిలోనూ కేసీఆర్ జాడలు కనిపించవనే వాదన వినిపిస్తోంది.
ఇక, తెలంగాణ అధికారిక గీతం. ఈ విషయంలో కేసీఆర్ వెనుకబడ్డారు. అధికారంలో ఉన్నపదేళ్లలో ఆయన గీతం చేయించాలని అనుకున్నా.. ఎప్పుడూ.. ఆయన ప్రత్యేక దృష్టి పెట్టలేదు. ఇక, రేవంత్ వచ్చీ రావడంతోనే.. గీతంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏపీకి చెందిన సంగీత దర్శకుడు కీరవాణి మనకెందుకు? అన్న విమర్శలు వచ్చినా.. ఆయన వెనక్కి తగ్గలేదు. ఇక, అందెశ్రీరాసిన గీతం.. దాదాపు కంపోజ్ రికార్డింగ్ కూడా అయిపోయింది. మొత్తానికి ఈ మూడు పరిణామాలను గమనిస్తే.. తెలంగాణపై కేసీఆర్ కన్నా.. రేవంత్ ముద్ర ఎక్కువగా కనిపించే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు.
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…
సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తూ గాన కోకిల ఎస్ జానకి చివరి శ్వాస తీసుకున్నారు. గత కొంత కాలంగా…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఓ వ్యక్తి ఆరుగురిని…
ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…
అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…