దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఇప్పటి వరకు ఆరు దశల్లో పూర్తయింది. మరో దశ పోలింగ్ జరగాల్సి ఉంది. అది జూన్ 1న జరగనుంది. ఇక, ఎన్నికల ఫలితాలు.. జూన్ 4న తేలిపోనున్నాయి. ప్రజలు ఎవరికి పట్టం గట్టారు..? ఎవరిని అందలం ఎక్కించారు? ఎవరిని దించేశారు? అనేది జూన్ 4న తెలిసిపోతుంది. దీంతో జూన్ 4 పై సహజంగానే చర్చ ఉంది. అయితే.. దీనికి మించి ఇప్పుడు జూన్ 1 కోసం ఎక్కువ మంది వేచి ఉన్నారు. ఎవరిని కదిలించినా.. జూన్ 1 ఎప్పుడొస్తుందబ్బా! అనే మాటే వినిపిస్తుండడం గమనార్హం.
దీనికి ప్రధాన కారణం.. ఆ రోజు జరగనున్న ఏడో దశ ఎన్నికల పోలింగ్ అనుకుంటే పొరపాటే. ఆరోజు ఏడో దశ పోలింగ్ జరనుంది. కానీ.. అదే రోజు దేశవ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠకు అంతో ఇంతో తెరదించుతూ.. ఎగ్జిట్ పోల్స్ కూడా రానున్నాయి . కేంద్ర ఎన్ని కల సంఘం ఆదేశాలు.. నిబంధనల మేరకు.. దేశంలో జరిగిన సార్వత్రి ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను జూన్ 1 సాయంత్రం ఆరు గంటల వరకు వెల్లడించే అవకాశం లేదు. ఇదే ఉత్కంఠకు కారణంగా మారింది. జూన్ 1 సాయంత్రం కోసం అందుకే దేశం మొత్తం ఎదురు చూస్తోంది. ప్రఖ్యాత ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ఆరోజు సాయంత్రం 6 గంటల తర్వాత.. తమ ఫలితాలు వెల్లడించేందుకు సమాయత్తమయ్యాయి.
వీటిలో చాణక్య, టైమ్స్ నౌ, న్యూస్ 18, జీ న్యూస్, జన్మత్సహా.. ఏపీలో ఆరా మస్తాన్, నాగన్న వంటి సర్వే సంస్థలుఉన్నాయి. వీటివి విశ్వసనీయత కూడా ఉన్న నేపథ్యంలో ఆ రోజు వరకు ఇవి వేచి ఉంటున్నాయి. దీంతో ఇవి ఏం చెప్పనున్నాయి? ఎవరికి మొగ్గు చూపించనున్నాయి.. ప్రజల నాడిని ఎలా పట్టుకోనున్నాయనే విషయాలు ఆసక్తిగా మారాయి. వీటితో పాటు.. స్థానికంగా వైసీపీ చేయించుకున్న ఐప్యాక్ సర్వే కూడా.. అదే రోజు రానుంది. అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు చేయించుకున్న సర్వే ఫలితాలు కూడా అదే రోజు విడుదల చేయనున్నారు. దీంతో జూన్ 4 కంటే కూడా..జూన్ 1కి అత్యంత ప్రాధాన్యం పెరిగిపోయింది. అందరి కళ్లూ కేలండర్పైనే ఉండడానికి కారణం ఇదే!!
This post was last modified on May 27, 2024 12:19 pm
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
గత ఏడాది లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ మీట్లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం…