దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఇప్పటి వరకు ఆరు దశల్లో పూర్తయింది. మరో దశ పోలింగ్ జరగాల్సి ఉంది. అది జూన్ 1న జరగనుంది. ఇక, ఎన్నికల ఫలితాలు.. జూన్ 4న తేలిపోనున్నాయి. ప్రజలు ఎవరికి పట్టం గట్టారు..? ఎవరిని అందలం ఎక్కించారు? ఎవరిని దించేశారు? అనేది జూన్ 4న తెలిసిపోతుంది. దీంతో జూన్ 4 పై సహజంగానే చర్చ ఉంది. అయితే.. దీనికి మించి ఇప్పుడు జూన్ 1 కోసం ఎక్కువ మంది వేచి ఉన్నారు. ఎవరిని కదిలించినా.. జూన్ 1 ఎప్పుడొస్తుందబ్బా! అనే మాటే వినిపిస్తుండడం గమనార్హం.
దీనికి ప్రధాన కారణం.. ఆ రోజు జరగనున్న ఏడో దశ ఎన్నికల పోలింగ్ అనుకుంటే పొరపాటే. ఆరోజు ఏడో దశ పోలింగ్ జరనుంది. కానీ.. అదే రోజు దేశవ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠకు అంతో ఇంతో తెరదించుతూ.. ఎగ్జిట్ పోల్స్ కూడా రానున్నాయి . కేంద్ర ఎన్ని కల సంఘం ఆదేశాలు.. నిబంధనల మేరకు.. దేశంలో జరిగిన సార్వత్రి ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను జూన్ 1 సాయంత్రం ఆరు గంటల వరకు వెల్లడించే అవకాశం లేదు. ఇదే ఉత్కంఠకు కారణంగా మారింది. జూన్ 1 సాయంత్రం కోసం అందుకే దేశం మొత్తం ఎదురు చూస్తోంది. ప్రఖ్యాత ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ఆరోజు సాయంత్రం 6 గంటల తర్వాత.. తమ ఫలితాలు వెల్లడించేందుకు సమాయత్తమయ్యాయి.
వీటిలో చాణక్య, టైమ్స్ నౌ, న్యూస్ 18, జీ న్యూస్, జన్మత్సహా.. ఏపీలో ఆరా మస్తాన్, నాగన్న వంటి సర్వే సంస్థలుఉన్నాయి. వీటివి విశ్వసనీయత కూడా ఉన్న నేపథ్యంలో ఆ రోజు వరకు ఇవి వేచి ఉంటున్నాయి. దీంతో ఇవి ఏం చెప్పనున్నాయి? ఎవరికి మొగ్గు చూపించనున్నాయి.. ప్రజల నాడిని ఎలా పట్టుకోనున్నాయనే విషయాలు ఆసక్తిగా మారాయి. వీటితో పాటు.. స్థానికంగా వైసీపీ చేయించుకున్న ఐప్యాక్ సర్వే కూడా.. అదే రోజు రానుంది. అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు చేయించుకున్న సర్వే ఫలితాలు కూడా అదే రోజు విడుదల చేయనున్నారు. దీంతో జూన్ 4 కంటే కూడా..జూన్ 1కి అత్యంత ప్రాధాన్యం పెరిగిపోయింది. అందరి కళ్లూ కేలండర్పైనే ఉండడానికి కారణం ఇదే!!
This post was last modified on May 27, 2024 12:19 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…