టీడీపీ ఎమ్మెల్యే, నటసింహం నందమూరి బాలకృష్ణ ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. తెలంగాణకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి బాలయ్య ఆయనను కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. పైకి ఇది సాధారణ సమావేశమే అని అనుకుం టున్నా.. కీలకమైన విషయాలు చర్చించేందుకు నందమూరి వచ్చి ఉంటారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న బసవతారకం కేన్సర్ ఆసుపత్రిని మరింత విస్తరించేందుకు రెండేళ్లుగా బాలయ్య ప్రయ త్నిస్తున్నారు. ఏపీలోనూ దీనిని నెలకొల్పాలని అనుకున్నరు. అయితే.. అక్కడ గత ఎన్నికల్లో ప్రభుత్వం మారిపోయిన తర్వాత కుంటుపడింది. దీంతో హైదరాబాద్ శివారు ప్రాంతంలో నూతనంగా నిర్మించాలని ప్లాన్ చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్లాన్ అంతా రెడీ అయింది. తద్వారా మూడు రాష్ట్రాల రోగులకు దీనిని మరింత అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు.
ఏపీ, తెలంగాణ సహా కర్ణాటక ప్రాంత రోగులకు మరిన్ని అధునాతన సౌకర్యాలతో ఈ కేన్సర్ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ శివారులో జాగా కేటాయింపు..(గతంలో కేసీఆర్ ను కూడా అడిగారు) సహా ఇతర అనుమతుల విషయంపై సీఎం రేవంత్ ను నేరుగా కలిసి ఉంటారని చర్చ. అదేసమయంలో హైదరాబాద్లోని రామకృష్ణా సినీ స్టూడియోస్ను ఆధునీకరించను న్నారు. దీనిని మణికొండకు షిఫ్ట్ చేయాలని నిర్ణయించారు. దీనిపై కూడా.. సీఎంకు సమాచారం అందించి.. తగు విధంగా భూమిని కోరినట్టు తెలుస్తోంది. ఏదేమైనా.. బాలయ్య పర్యటన వెనుక.. చాలా వ్యవహారాలు ఉన్నయని అంచనా వేస్తున్నారు.
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…
భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…