Political News

అలా జ‌రిగితే.. ప‌వ‌న్ కు తిరుగులేదుగా!

ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేసిన విష‌యం తెలిసిందే. వీటిలో ఎన్ని గెలుస్తార‌నే విష‌యంపై ఇంకా చ‌ర్చ సాగుతూనే ఉంది. కొంద‌రు నాలుగు అంటుంటే.. మ‌రికొంద‌రు.. స‌గం ఖాయ‌మ‌ని లెక్క‌లు వేస్తున్నారు. స‌రే… ఈ వాద‌న ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. పోటీలో ఉన్న‌వారు మాత్రం బ‌ల‌మైన నాయ‌కు లే.. దీంతో మొత్తంగా గెలిచినా ఆశ్చ‌ర్యంలేద‌ని మ‌రికొంద‌రు చెబుతున్నారు. క్షేత్ర‌స్థాయిలో వాస్త‌వాలు గ‌మ‌నిస్తే… 19-20 స్థానాలు ద‌క్కించుకున్నా ఆశ్చ‌ర్యం లేద‌నేది వాస్త‌వ‌మే.

ఉదాహ‌ర‌ణ‌కు పిఠాపురంలో ప‌వ‌న్ విజ‌యం ఖాయ‌మైంద‌ని. కేవ‌లం మెజారిటీ మాత్ర‌మే మిగిలి ఉంద‌ని అంటున్నారు. ఇలాంటి కొన్ని నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. వాట‌లో ఒక‌వైపు అభ్య‌ర్థుల బ‌లం.. మ‌రోవైపు పార్టీ బ‌లం రెండూ క‌లిపి.. జ‌న‌సేన‌కు క‌లిసి వ‌స్తున్నాయ‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు. అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో మండ‌లి బుద్ధ ప్ర‌సాద్ గెలుపు ఖాయ‌మ‌ని చెబుతున్నారు. అలానే.. బీమ‌వ‌రంలో పుల‌ప‌ర్తి రామాంజనేయులు కూడా.. గెలుపు గుర్రం ఎక్కినట్టేన‌ని అంటున్నారు.

ఇక‌, భీమ‌వ‌రం, తాడేప‌ల్లి గూడెం, అన‌కాప‌ల్లి ఇలా.. మొత్తం 19-20 స్థానాల్లో జ‌న‌సేన గెలుపు గుర్రం ఎక్కేందుకు చాలా వ‌ర‌కు అవ‌కాశం ఉంద‌ని లెక్కలు వ‌స్తున్నాయి. వీటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే.. స్థానికంగా ఉన్న కుల స‌మీక‌ర‌ణ‌లు.. వ్య‌క్తుల బ‌లాబలాలు వంటివి కూడా క‌లిసి వ‌స్తున్నాయి. దీంతో జ‌న‌సేన కు 20 స్థానాల్లో ప‌క్కా విజ‌యం న‌మోద‌వుతుంద‌ని చెబుతున్నారు. ఒక్క నెల్లిమ‌ర్ల స్థానం మిన‌హా.. ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపు ఖాయ‌మ‌ని అంటున్నారు.

ఒక‌వేళ ఇదే క‌నుక నిజ‌మైతే.. ఈ అంచ‌నా క‌నుక సాక్షాత్క‌రిస్తే.. ఖ‌చ్చితంగా అది ప‌వ‌న్‌కు తిరుగులేని శ‌క్తి ని అందిస్తుంద‌నడంలో సందేహం లేదు. ఎందుకంటే.. ఇటు ప్ర‌భుత్వంలో.. ఆయ‌న మాట‌కు మ‌రింత వాల్యూ పెంచుతుంది. అదేవిధంగా పార్టీ ప‌రంగా మ‌రింత పుంజుకునేందుకూ అవకాశం ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు. అంతేకాదు.. పార్టీ కి ఇప్పటి వ‌ర‌కు ఎదురైన గాజు గుర్తు స‌మ‌స్య కూడా.. ప‌రిష్కారం అవుతుంద‌ని చెబుతున్నారు. మొత్తానికి 19-20 సీట్లు క‌నుక జ‌న‌సేన తెచ్చుకుంటే.. తిరుగులేని చ‌క్రం తిప్ప‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది.

This post was last modified on May 28, 2024 7:10 am

Share
Show comments
Published by
Satya
Tags: Pawan

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

54 minutes ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

2 hours ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

4 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

8 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

9 hours ago