ప్రస్తుత ఎన్నికల్లో జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. వీటిలో ఎన్ని గెలుస్తారనే విషయంపై ఇంకా చర్చ సాగుతూనే ఉంది. కొందరు నాలుగు అంటుంటే.. మరికొందరు.. సగం ఖాయమని లెక్కలు వేస్తున్నారు. సరే… ఈ వాదన ఎలా ఉన్నప్పటికీ.. పోటీలో ఉన్నవారు మాత్రం బలమైన నాయకు లే.. దీంతో మొత్తంగా గెలిచినా ఆశ్చర్యంలేదని మరికొందరు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలు గమనిస్తే… 19-20 స్థానాలు దక్కించుకున్నా ఆశ్చర్యం లేదనేది వాస్తవమే.
ఉదాహరణకు పిఠాపురంలో పవన్ విజయం ఖాయమైందని. కేవలం మెజారిటీ మాత్రమే మిగిలి ఉందని అంటున్నారు. ఇలాంటి కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. వాటలో ఒకవైపు అభ్యర్థుల బలం.. మరోవైపు పార్టీ బలం రెండూ కలిపి.. జనసేనకు కలిసి వస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో మండలి బుద్ధ ప్రసాద్ గెలుపు ఖాయమని చెబుతున్నారు. అలానే.. బీమవరంలో పులపర్తి రామాంజనేయులు కూడా.. గెలుపు గుర్రం ఎక్కినట్టేనని అంటున్నారు.
ఇక, భీమవరం, తాడేపల్లి గూడెం, అనకాపల్లి ఇలా.. మొత్తం 19-20 స్థానాల్లో జనసేన గెలుపు గుర్రం ఎక్కేందుకు చాలా వరకు అవకాశం ఉందని లెక్కలు వస్తున్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. స్థానికంగా ఉన్న కుల సమీకరణలు.. వ్యక్తుల బలాబలాలు వంటివి కూడా కలిసి వస్తున్నాయి. దీంతో జనసేన కు 20 స్థానాల్లో పక్కా విజయం నమోదవుతుందని చెబుతున్నారు. ఒక్క నెల్లిమర్ల స్థానం మినహా.. ఇతర నియోజకవర్గాల్లో గెలుపు ఖాయమని అంటున్నారు.
ఒకవేళ ఇదే కనుక నిజమైతే.. ఈ అంచనా కనుక సాక్షాత్కరిస్తే.. ఖచ్చితంగా అది పవన్కు తిరుగులేని శక్తి ని అందిస్తుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే.. ఇటు ప్రభుత్వంలో.. ఆయన మాటకు మరింత వాల్యూ పెంచుతుంది. అదేవిధంగా పార్టీ పరంగా మరింత పుంజుకునేందుకూ అవకాశం ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు.. పార్టీ కి ఇప్పటి వరకు ఎదురైన గాజు గుర్తు సమస్య కూడా.. పరిష్కారం అవుతుందని చెబుతున్నారు. మొత్తానికి 19-20 సీట్లు కనుక జనసేన తెచ్చుకుంటే.. తిరుగులేని చక్రం తిప్పడం ఖాయంగానే కనిపిస్తోంది.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…