Political News

ఆయ‌న‌కు మెజారిటీ త‌గ్గినా.. ఓడిపోయిన‌ట్టే!

ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌. ఇది వైఎస్ కుటుంబానికి కంచుకోట అనే విష‌యం తెలిసిందే. అయితే.. ఈసారి ఇదే వైఎస్ కుటుంబంలో త‌లెత్తిన వివాదంతో.. అన్నా చెల్లె ళ్లు చీలిపోయారు. దీంతో ఇక్క‌డ రాజ‌కీయ దుమారం రేగింది. ఫ‌లితంగా.. ఇక్క‌డ సీఎం జ‌గ‌న్‌కు పెద్ద ప‌రీక్ష పెట్టిన‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ‘జ‌గ‌న్ ఓడిపోవ‌డం కుదిరే ప‌ని కాదు. ఇది ఎవ‌రూ చేయ‌లేరులే… కానీ, ఆయ‌నకు మెజారిటీ త‌గ్గినా ఓడిపోయిన‌ట్టే క‌దా!’ అని అంటున్నారు స్థానికులు.

నిజానికి అప్ర‌తిహ‌త విజ‌యంతో ముందుకు సాగుతున్న జ‌గ‌న్‌.. గ‌త ఎన్నిక‌ల్లో ఏకంగా 90 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీ దక్కించుకుని రాష్ట్రంలోనే మెజారిటీ ఎక్కువ ద‌క్కించుకున్న నాయ‌కుడిగా రికార్డు సృష్టించారు. ఈ రికార్డును ఈ సారి ఆయ‌న అధిగ‌మించ‌లేక పోవ‌చ్చ‌నే అంచ‌నాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఆయ‌న గెలుపు ఖాయ‌మే అయినా… ముప్పేట దిగ్బంధించిన ఇత‌ర పార్టీల కార‌ణంగా జ‌గ‌న్ మెజారిటీ త‌గ్గుతుంద‌ని చెబుతున్నారు.

టీడీపీనుంచి బీటెక్ ర‌వి పోటీలో ఉన్నారు. ఈయ‌న ఇక్క‌డ చిర‌ప‌రిచితుడు. పైగా..మూడు రాజ‌ధానుల‌కు వ్య‌తిరేకంగా త‌న ఎమ్మెల్సీ సీటును తృణ‌ప్రాయంగా వ‌దులుకున్నారు. దీంతో చాలా వ‌ర‌కు సింప‌తీ గెయిన్ చేశారు. ఫ‌లితంగా మెజారిటీ ఓట్లు ద‌క్కించుకునే అవ‌కాశం ఉంది. అయితే..ఈయ‌న ద‌క్కించుకునే ఓట్ల‌న్నీ కూడా.. సీఎం ఖాతాలోవేన‌ని చెబుతున్నారు. ఇది ఒక‌ర‌కంగా వైసీపీ అధినేత‌కు ఇబ్బందిగా మార‌నుంది. ఇది భారీ మెజారిటీని త‌గ్గిస్తుంద‌ని అంట‌న్నారు.

ఇక‌, కాంగ్రెస్ కూడా ఈ ద‌ఫా ఇక్క‌డ బ‌ల‌మైన సెంటిమెంటునే రాజేసింది. జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిల‌.. ఇక్క‌డ కొంగు ప‌ట్టి ఓట్లు అడిగారు. అయితే.. ఇది సెంటిమెంటును రాజేయ‌డంతో ఆమె ఒక్క‌రికే కాకుండా.. గ్రామీణ ప్ర‌జ‌లు క‌నుక మొగ్గు చూపి ఉంటే..పులివెందుల సీటులో కూడా.. కాంగ్రెస్‌కు ఓట్లు ప‌డతాయ‌ని చెబుతున్నారు. ఇదే జ‌రిగితే.. మ‌రింత‌గా సీఎం జ‌గ‌న్‌కు డ్యామేజీ జ‌రిగి.. గ‌త ఎన్నిక‌ల్లో వ‌చ్చిన మెజారిటీ 90 వేల‌లో స‌గం లేదా.. అంత‌క‌న్నా ఓట్లు త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Satya

Recent Posts

అనుమానాలు తీర్చేసిన ఆదర్శ కుటుంబం

వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆదర్శ కుటుంబం విడుదల తేదీకి అఫీషియల్ ముద్ర పడిపోయింది. అక్టోబర్ 2…

1 hour ago

హైదరాబాదు రోడ్డుపై స్పందించిన ట్రంప్

హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ సమీప రహదారికి 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ'గా నామకరణం చేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం…

2 hours ago

శోకంలోనూ విమర్శలు తప్పలేదు

అదేంటో గానీ… పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కు ఎటు వెళ్లినా విమర్శల జడివానే తప్పడం లేదు. సాధారణ…

2 hours ago

చంద్రబాబు… అసలైన జెన్ జీ..!

ప్రస్తుత జెన్ జీ, జెన్ ఆల్ఫా వర్గానికి చెందిన యువతలానే నేనూ జెన్ జీని అంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు…

3 hours ago

డ్రాగన్ అలా చేస్తే అభిమానులకు పండగే

డ్రాగన్ విడుదల ఇంకా సంవత్సరం ఉండటంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు కాలం భారంగా గడిచిపోతోంది. ఒకవేళ వార్ 2 బ్లాక్…

3 hours ago

టీడీపీ కార్యకర్తల దాడిలో కానిస్టేబుల్ కు గాయాలు?

అమరావతిలోని ఉండవల్లిలో వైసీపీ నాయకుల పర్యటన ఉద్రిక్తతంగా మారింది. ఆ పర్యటనను రాజధాని రైతులు, టీడీపీ వర్గాలు అడ్డుకునేందుకు ప్రయత్నించాయి.…

4 hours ago