Political News

హైదరాబాద్‌తో ఏపీ రుణం తీరిపోయింది

హైదరాబాద్ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌కు రాజధానే అన్న విషయం చాలామంది మరిచిపోయే ఉంటారు. ఉమ్మడి రాష్ట్రాన్ని రెండుగా విభజించిన సమయంలో హైదరాబాద్‌ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా నిర్ణయిస్తూ చట్టంలో పేర్కొన్న సంగతి తెలిసిందే.

ఐతే 2014లో రాష్ట్రం విడిపోయాక రకరకాల కారణాల వల్ల ఏడాది తిరక్కుండానే అప్పటి చంద్రబాబు ప్రభుత్వం హైదరాబాద్‌ను ఖాళీ చేసి వెళ్లిపోయింది. కొంత కాలానికే 90 శాతం ఏపీ ప్రభుత్వ కార్యాలయాలు హైదరాబాద్‌ నుంచి అమరావతి, ఇతర ఏపీ నగరాలకు తరలిపోయాయి.

కానీ 10 శాతం కార్యాలయాలు ఇంకా హైదరాబాద్‌లోనే కొనసాగుతున్న సంగతి చాలామందికి తెలియదు. ఐతే వాటికి కూడా ఇప్పుడు హైదరాబాద్‌తో రుణం తీరిపోయింది. జూన్ 2తో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పదేళ్ల గడువు తీరిపోనుంది.

ఏపీ విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ గడువు జూన్ 2 తారీఖున ముగియనుంది. దీంతో హైదరాబాద్‌లోనే కొనసాగుతున్న కొన్ని ఏపీ ప్రభుత్వ కార్యాలయాలను ఏపీకి మార్చక తప్పని పరిస్థితి. 2016లో 90% కార్యాలయాలు తెలంగాణ నుండి ఏపీకి మారగా.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ప్రధాన కార్యాలయం సహా మరి కొన్ని ఆఫీసులను ఏపీకి మారుస్తున్నారు.

జూన్ 2 లోపు హైదరాబాద్‌లో ఏపీ ప్రభుత్వం తీసుకున్న భవనాలన్నింటినీ ఖాళీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చింది. దీంతో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కార్యాలయాన్ని కర్నూలుకు మార్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల్లో ఒకటైన కర్నూలుకు ఈ ఆఫీసును మార్చాలని ఆదేశాలు జారీ చేశారు.

దీని కంటే ముందే జూన్ 2లోపు అన్ని భవనాలనూ తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని కూడా సీఎం ఆదేశాలిచ్చారు. ఒకవేళ ఏపీలో ప్రభుత్వం మారితే.. ఆయా కార్యాలయాలను ఏపీలో ఎక్కడ ఏర్పాటు చేయాలన్నదానిపై తుది నిర్ణయం తీసుకోవచ్చు. మొత్తానికి జూన్ 2 నాడు హైదరాబాద్‌తో ఏపీకి రుణం తీరిపోనుందన్నమాట.

Satya

Recent Posts

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

27 minutes ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

1 hour ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

1 hour ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

1 hour ago

ప‌ద్మ అవార్డులు అడిగి ఇస్తారా?

దేశ అత్యున్న‌త పౌర పుర‌స్కారాలైన ప‌ద్మ అవార్డుల‌ను ఎంత ప్రతిష్ఠాత్మ‌కంగా భావిస్తారో తెలిసిందే. ప్ర‌తిసారీ అవార్డులు ప్ర‌క‌టించిన‌పుడు గ్ర‌హీత‌ల అర్ఙ‌త‌ల…

2 hours ago

అంబానీ ఆసుప‌త్రికి ప‌వ‌న్ క‌ల్యాణ్‌… ఏం జ‌రిగింది?

జ‌న‌సేన పార్టీ అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మ‌రోసారి ఆసుప‌త్రిలో చేరారు. 40 రోజుల కింద‌ట‌ ఆయ‌న…

2 hours ago