Political News

పోలింగ్ స‌రే.. ఇది మ‌రీ టెన్ష‌న్‌.. !

ఏపీలో పోలింగ్ ప్ర‌క్రియ ముగిసింది. అయితే.. దాని తాలూకు ప‌ర్య‌వ‌సానం.. దాడులు.. హింస వంటివి కొన్నేళ్ల వ‌ర‌కు కూడా రాష్ట్రాన్ని వెంటాడ‌నున్నాయి. అంటే.. ఆయా కేసుల్లో ఇరుక్కున్న నాయ‌కులు.. చేసిన నేత‌లు.. అందరూ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. సో.. పోలింగ్ వ్య‌వ‌హారం.. ఇలా టెన్ష‌న్ రేపింది. ఇక‌, ఇప్పుడు మ‌రో కీల‌క విష‌యం తెర‌మీదికి వ‌చ్చింది. అదే.. కౌంటింగ్‌. వ‌చ్చే నెల 4వ తేదీన కౌంటింగ్ జ‌ర‌గ‌నుంది.

రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ, 25 పార్ల‌మెంటు స్థానాల‌కు కూడా ఒకేసారి కౌంటింగ్ ప్ర‌క్రియ జ‌ర‌గ‌నుంది. అయితే.. ఈ ప్ర‌క్రియ మ‌రింత టెన్ష‌న్ గా మార‌నుంద‌నేది అధికార వ‌ర్గాల అంచ‌నాగా ఉంది. దీనికి కార ణం.. ఎక్క‌డిక‌క్క‌డ ఎవ‌రికి వారు ధీమా పెంచేసుకోవ‌డ‌మే. ఒక‌ప్పుడు ఎన్నిక‌లు అన‌గానే.. గెలుపు-ఓట‌ముల‌ను స‌మపాళ్ల‌లో తీసుకునేవారు. గెలిస్తే… సంబ‌రాలు చేసుకునే వారు. ఓడితే మౌనంగా ఉండి.. వేరే ప్రాంతానికి వెళ్లి ఆ బాధ‌ను మ‌రో రూపంలో తీర్చుకునే వారు. త‌ర్వాత ప‌రిస్థితి స‌ర్దుమ‌ణిగింది.

అయితే.. ఇప్పుడు అలాంటి ప‌రిస్థితి క‌నిపించ‌డంలేదు. ముఖ్యంగా ఏపీలో అయితే.. మ‌రింత ఎక్కువ‌గా బెట్టింగులు.. పందేలు.. పంతాలు.. ప‌ట్టింపులు ఇలా.. లెక్క‌లేన‌న్ని అంశాలు నాయ‌కుల‌కు-నాయ‌కుల‌కు, పార్టీల‌కు-పార్టీల‌కు మ‌ధ్య టెన్ష‌న్ పెట్టేస్తున్నాయి. దీనికి తోడు 32 నియోజ‌క‌వ‌ర్గాలు స‌మ‌స్యాత్మ‌కంగా గుర్తించారు. ఇక‌, మ‌రో 20 నియోజ‌క‌వ‌ర్గాలు అత్యంత స‌మ‌స్యాత్మ‌కంగా ఉన్నాయి. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితి ఎలా ఉంటుంద‌నేది అంచ‌నా కు కూడా అంద‌డం లేదు.

వాస్త‌వానికి ర‌గ‌డ‌లు జ‌రుగుతాయని అంచ‌నా వేసిన అనంత‌పురం, ప‌ల్నాడు, చిత్తూరు వంటి నియోజ‌కవర్గాల‌లోనే వాటిని నిలువ‌రించ‌లేక పోయారు. అంతా అయిపోయిన త‌ర్వాత చ‌ర్య‌లు తీసుకున్నారు. అయినా అవి ఒక ప‌ట్టాన అదుపులోకి రాలేదు. ఎన్నిక‌ల పోలింగ్‌తో పోలిస్తే.. కౌంటింగ్ రోజు మ‌రింత తీవ్ర‌మైన ప‌రిస్థితి ఉంటుందన‌డంలో సందేహం లేదు. ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో 2019లో కౌంటింగ్ రోజు త‌ల‌లు ప‌గుల‌గొట్టుకున్నారు. ఇలాంటివి ఇప్పుడు మ‌రిన్ని పెరిగే అవ‌కాశం ఉంది. దీనికి ప‌రిష్కారం పోలీసులు.. వ్య‌వ‌స్త కాదు. పార్టీల అధినేత‌లే. వారే కార్య‌క‌ర్త‌ల‌కు, నాయ‌కుల‌కు కూడా పిలుపునిస్తే.. కొంత వ‌ర‌కు ఇలాంటి ఘ‌ట‌న‌ల‌కు చెక్ పెట్టే అవ‌కాశం ఉంటుంది. లేక‌పోతే.. మ‌రింత రెచ్చిపోవ‌డం ఖాయం.

This post was last modified on May 25, 2024 5:39 pm

Share

Recent Posts

మైత్రీ సినిమాలన్నీ గతంలోకే వెళ్తున్నాయే!

మైత్రీ మూవీ మేకర్స్ చేతిలో ఉన్న లైనప్ చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపిస్తోంది. ప్రెజెంట్ నడుస్తున్న కథల కంటే…

1 hour ago

రేషన్ కార్డుపై మోదీ బొమ్మ వేయాల్సిందే!

ఈ రోజుల్లో పబ్లిసిటీకి కాదేదీ అనర్హం…రాజకీయ నేతలు మొదలు సినీ తారల వరకు అందరూ పబ్లిసిటీనే నమ్ముకున్నారంటే అతిశయోక్తి కాదు.…

1 hour ago

జగన్ కు అవమానం… జైలు సిబ్బంది క్లారిటీ

ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ని పరామర్శించేందుకు కర్నూలు జిల్లా పంచలింగాల జైలు వద్దకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్…

2 hours ago

వెంకటేష్ ప్రయాణానికి అప్పుడే 40 ఏళ్ళు

సరిగ్గా నాలుగు దశాబ్దాల క్రితం ఇదే రోజు 1986 సంవత్సరం ఆగస్ట్ 14 కలియుగ పాండవులు రిలీజయ్యింది. మాములుగా స్టార్…

2 hours ago

సాక్ష్యాల తారుమారు కేసులో సీదిరి అప్పల రాజుకు బెయిల్

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు ఆరవ్ శర్మ చేసిన బైక్ యాక్సిడెంట్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం…

3 hours ago

ఆవారాపన్ 2… అంతగా ఏముందబ్బా

కొత్తగా రిలీజైన సినిమాల్లో అడ్వాన్స్ బుకింగ్ పరంగా దూసుకుపోతున్న సినిమాగా ఆవారాపన్ 2 అన్ని రాష్టాల ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.…

3 hours ago