మాచర్లలోని పాల్వాయి గేటు పోలింగ్ బూత్లో అక్కడి సిటింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సాగించిన విధ్వంసకాండకు ప్రజాస్వామ్యమే సిగ్గుతో తలవంచుకుంది. ఓ ఎమ్మెల్యే అయి ఉండి ఈవీఎంను, వీవీ ప్యాట్ను ధ్వంసం చేసిన తీరు అన్ని వర్గాల ప్రజలకూ ఆగ్రహాన్ని తెప్పించింది. ప్రజస్వామ్య దేశంలో ఇలాంటి వాటికి తావు ఉండకూడదని, పిన్నెల్లిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలూ ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ ఘటనపై సీరియస్ అయింది.
కానీ ఇంత జరుగుతున్నా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం ఈ ఘటనపై సైలెంట్గా ఉండటం హాట్ టాపిక్గా మారింది. ఏపీలో ఏం జరిగినా స్పందించే పవన్.. ఓ వైసీపీ ఎమ్మెల్యే చేసిన అరాచకాలపై రియాక్టు కాకపోవడంలో ఆంతర్యమేంటో అర్థం కావడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పిన్నెల్లిని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించడం, ఆయన పారిపోవడం, ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించడం, జూన్ 6వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించడం.. ఇలా పరిణామాలన్నీ చకచకా జరిగిపోతున్నాయి. కానీ పవన్ మాత్రం వీటిపై రియాక్ట్ కావడం లేదు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అరాచకాలను, అక్రమాలను ప్రశ్నిస్తూ ఆ పార్టీని ఓడించాలని ఓటర్లకు పిలుపునిచ్చిన పవన్ ఇప్పుడు ఎక్కడున్నారు అనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రచారం తర్వాత ఆయన బయట కనిపించడం లేదు. అయితే ఎక్కుడున్నా సరే వైసీపీ ఎమ్మెల్యే చేసిన అరాచకంపై ఓ పార్టీ అధ్యక్షుడిగా ఆయన స్పందించాల్సిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎలాగో వైసీపీ ఓడిపోతుంది కదా ఇప్పుడు ఎందుకు బురదపై రాయి విసరడం అని పవన్ కామ్గా ఉన్నారనే వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి నాయకుల పని పడదామనే ఆలోచనలో పవన్ ఉన్నట్లు తెలిసింది.
This post was last modified on May 25, 2024 4:33 pm
విక్టరీ వెంకటేష్ మొట్టమొదటి వెబ్ సిరీస్ గా 2023 మార్చిలో విడుదలైన రానా నాయుడు భారీ స్థాయిలో మిలియన్ల కొద్దీ…
ఊరిపేరు భైరవకోనతో ట్రాక్ లో పడ్డ యూత్ హీరో సందీప్ కిషన్ ఈ నెలలో మజాకాతో పలకరించబోతున్నాడు. త్రినాధరావు నక్కిన…
లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం ప్రధాన పాత్ర పోషించిన బ్రహ్మ ఆనందం ఫిబ్రవరి 14 విడుదల కానుంది. మాములుగా అయితే విశ్వక్…
బాలీవుడ్ లో బేబీ జాన్ తో అడుగు పెట్టిన కీర్తి సురేష్ కి తొలి సినిమానే డిజాస్టర్ కావడం నిరాశపరిచేదే…
అనుకున్నంతా అయ్యింది. అధికార పార్టీ టీడీపీ వ్యూహాల ముందు విపక్ష వైసీపీ వ్యూహాలు ఫలించలేదు. రాజకీయాలకు కొత్తే అయినా గుంటూరు…
పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం తినిపించడం ఈ రోజుల్లో పెద్ద సవాళుగా మారింది. తల్లిదండ్రులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, పిల్లలు తమ…