Political News

మాచ‌ర్ల‌పై ప‌వ‌న్ ఎందుకు సైలెంట్ ?

మాచ‌ర్ల‌లోని పాల్వాయి గేటు పోలింగ్ బూత్‌లో అక్క‌డి సిటింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి సాగించిన విధ్వంస‌కాండ‌కు ప్ర‌జాస్వామ్య‌మే సిగ్గుతో త‌ల‌వంచుకుంది. ఓ ఎమ్మెల్యే అయి ఉండి ఈవీఎంను, వీవీ ప్యాట్‌ను ధ్వంసం చేసిన తీరు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కూ ఆగ్ర‌హాన్ని తెప్పించింది. ప్ర‌జ‌స్వామ్య దేశంలో ఇలాంటి వాటికి తావు ఉండ‌కూడ‌ద‌ని, పిన్నెల్లిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. టీడీపీ స‌హా ఇత‌ర ప్ర‌తిప‌క్ష పార్టీలూ ఈ ఘ‌ట‌న‌ను తీవ్రంగా ఖండించాయి. కేంద్ర ఎన్నిక‌ల సంఘం కూడా ఈ ఘ‌ట‌న‌పై సీరియస్ అయింది.

కానీ ఇంత జ‌రుగుతున్నా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మాత్రం ఈ ఘ‌ట‌న‌పై సైలెంట్‌గా ఉండ‌టం హాట్ టాపిక్‌గా మారింది. ఏపీలో ఏం జ‌రిగినా స్పందించే ప‌వ‌న్.. ఓ వైసీపీ ఎమ్మెల్యే చేసిన అరాచ‌కాల‌పై రియాక్టు కాక‌పోవ‌డంలో ఆంత‌ర్య‌మేంటో అర్థం కావ‌డం లేద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పిన్నెల్లిని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్ర‌య‌త్నించ‌డం, ఆయ‌న పారిపోవ‌డం, ముంద‌స్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్ర‌యించ‌డం, జూన్ 6వ‌ర‌కు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌ద్ద‌ని కోర్టు ఆదేశించ‌డం.. ఇలా ప‌రిణామాల‌న్నీ చ‌క‌చ‌కా జ‌రిగిపోతున్నాయి. కానీ ప‌వ‌న్ మాత్రం వీటిపై రియాక్ట్ కావ‌డం లేదు.

ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ అరాచ‌కాల‌ను, అక్ర‌మాల‌ను ప్ర‌శ్నిస్తూ ఆ పార్టీని ఓడించాల‌ని ఓట‌ర్ల‌కు పిలుపునిచ్చిన ప‌వ‌న్ ఇప్పుడు ఎక్క‌డున్నారు అనే ప్ర‌శ్న త‌లెత్తుతోంది. ప్ర‌చారం త‌ర్వాత ఆయ‌న బ‌య‌ట క‌నిపించ‌డం లేదు. అయితే ఎక్కుడున్నా స‌రే వైసీపీ ఎమ్మెల్యే చేసిన అరాచ‌కంపై ఓ పార్టీ అధ్య‌క్షుడిగా ఆయ‌న స్పందించాల్సింద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే ఎలాగో వైసీపీ ఓడిపోతుంది క‌దా ఇప్పుడు ఎందుకు బుర‌ద‌పై రాయి విస‌ర‌డం అని ప‌వ‌న్ కామ్‌గా ఉన్నార‌నే వ్యాఖ్య‌లూ వినిపిస్తున్నాయి. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఇలాంటి నాయ‌కుల ప‌ని ప‌డ‌దామ‌నే ఆలోచ‌న‌లో ప‌వ‌న్ ఉన్న‌ట్లు తెలిసింది.

This post was last modified on May 25, 2024 4:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

9 minutes ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

3 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

4 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

4 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

6 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

6 hours ago